అన్వేషించండి

KTR: 'రేవంత్ సర్కారు ఐదేళ్లు ఉండాల్సిందే' - ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి పక్కనే మానవ బాంబులు ఉన్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

KTR Comments on CM Revanth Reddy: రేవంత్ సర్కారు ఐదేళ్లు నిక్షేపంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టే వారు ఆ పార్టీలోనే ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ సహా బీజేపీ నేత బండి సంజయ్ పైనా విమర్శలు గుప్పించారు. 'రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీపీ పెంచుకోకు. నీ ప్రభుత్వాన్ని కూల్చం. ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండాలని కోరుకుంటాం. అప్పుడే వెలుగు చీకట్లకు తేడా తెలుస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చే ఖమ్మం, నల్గొండ మానవ బాంబులు మీ పార్టీలోనే ఉన్నాయి. నీకు ఫ్రస్టేషన్ ఎక్కువైంది. ఎన్నికలయ్యాక తమ ఎమ్మెల్యేలతో బీజేపీలో కలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై ఉన్న కోపాన్ని రైతులపై తీర్చుకుంటోంది. ఇంతకీ అబద్ధపు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

కరీంనగర్ సెంటిమెంట్

కరీంనగర్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఓ సెంటిమెంట్ అని.. ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ అన్నారు. ఆనాడు ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్ సైరన్ మోగించారని.. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 'పాలమూరు సభలో సీఎం రేవంత్ భాష నాకు అర్థం కాలేదు. మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రేవంత్ ఐదేళ్ల పాలన చూశాక ఎవరు గొప్పవాళ్లో ప్రజలకు తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు అని సీఎం అంటున్నారు. కానీ, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వొచ్చు. కానీ అలా చేయడం లేదు. కేసీఆర్ ను బద్నాం చేయాలనే చూస్తున్నారు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు. కరువు మీద కేసీఆర్ సంధించిన బ్రహ్మస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వివరించారు.

కాంగ్రెస్ దుష్ప్రచారం

బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ.. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీ గెలుపునకే కారణమవుతుందనేది అంతా గమనించాలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ కాబోతున్నారనేది గ్యారెంటీ అంటూ ఎద్దేవా చేశారు. ‘మరో 10 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు పూర్తవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకోవాలని సీఎం రేవంత్ నాకు సవాల్ చేశారు. ఇద్దరం రాజీనామా చేసి మల్కాజిగిరిలోనే తేల్చుకుందాం అంటే చడీ చప్పుడు లేదు.' అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

బండి సంజయ్ కు సవాల్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్డి, కేసీఆర్ వంటి మహానుభావులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారని గుర్తు చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ ను నిలదీశారు. గత పదేళ్లలో ఐదేళ్లు వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నారని.. మరో ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని, కేంద్రంలో పదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్నారని అన్నారు. ఈ పదేళ్లలో కరీంనగర్ కు ఎవరు ఏం చేశారో.? తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. డేట్ అంట్ టైం ఫిక్స్ చేయాలని.. ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ అని చెప్పారు. ఎంపీ నిధులు ఖర్చు పెట్టడం చేతకాని వారు ఎంపీగా ఎందుకు ఉండాలని మండిపడ్డారు. 

వచ్చే ఏడాదంతా ఎన్నికలే ఉంటాయని.. పార్లమెంట్ తర్వాత, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలు ఉంటాయని కేటీఆర్ వివరించారు. ఆ ఎన్నికల్లో అందరినీ గెలిపించుకునే బాధ్యత తమదే అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

Also Read: BRS News: రేవంత్ పాలమూరు బిడ్డ కాదు, చంద్రబాబు పెంపుడు బిడ్డ - బీఆర్ఎస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget