అన్వేషించండి

KTR: 'రేవంత్ సర్కారు ఐదేళ్లు ఉండాల్సిందే' - ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి పక్కనే మానవ బాంబులు ఉన్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

KTR Comments on CM Revanth Reddy: రేవంత్ సర్కారు ఐదేళ్లు నిక్షేపంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టే వారు ఆ పార్టీలోనే ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ సహా బీజేపీ నేత బండి సంజయ్ పైనా విమర్శలు గుప్పించారు. 'రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీపీ పెంచుకోకు. నీ ప్రభుత్వాన్ని కూల్చం. ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండాలని కోరుకుంటాం. అప్పుడే వెలుగు చీకట్లకు తేడా తెలుస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చే ఖమ్మం, నల్గొండ మానవ బాంబులు మీ పార్టీలోనే ఉన్నాయి. నీకు ఫ్రస్టేషన్ ఎక్కువైంది. ఎన్నికలయ్యాక తమ ఎమ్మెల్యేలతో బీజేపీలో కలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై ఉన్న కోపాన్ని రైతులపై తీర్చుకుంటోంది. ఇంతకీ అబద్ధపు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

కరీంనగర్ సెంటిమెంట్

కరీంనగర్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఓ సెంటిమెంట్ అని.. ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ అన్నారు. ఆనాడు ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్ సైరన్ మోగించారని.. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 'పాలమూరు సభలో సీఎం రేవంత్ భాష నాకు అర్థం కాలేదు. మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రేవంత్ ఐదేళ్ల పాలన చూశాక ఎవరు గొప్పవాళ్లో ప్రజలకు తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు అని సీఎం అంటున్నారు. కానీ, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వొచ్చు. కానీ అలా చేయడం లేదు. కేసీఆర్ ను బద్నాం చేయాలనే చూస్తున్నారు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు. కరువు మీద కేసీఆర్ సంధించిన బ్రహ్మస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వివరించారు.

కాంగ్రెస్ దుష్ప్రచారం

బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ.. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీ గెలుపునకే కారణమవుతుందనేది అంతా గమనించాలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ కాబోతున్నారనేది గ్యారెంటీ అంటూ ఎద్దేవా చేశారు. ‘మరో 10 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు పూర్తవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకోవాలని సీఎం రేవంత్ నాకు సవాల్ చేశారు. ఇద్దరం రాజీనామా చేసి మల్కాజిగిరిలోనే తేల్చుకుందాం అంటే చడీ చప్పుడు లేదు.' అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

బండి సంజయ్ కు సవాల్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్డి, కేసీఆర్ వంటి మహానుభావులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారని గుర్తు చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ ను నిలదీశారు. గత పదేళ్లలో ఐదేళ్లు వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నారని.. మరో ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని, కేంద్రంలో పదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్నారని అన్నారు. ఈ పదేళ్లలో కరీంనగర్ కు ఎవరు ఏం చేశారో.? తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. డేట్ అంట్ టైం ఫిక్స్ చేయాలని.. ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ అని చెప్పారు. ఎంపీ నిధులు ఖర్చు పెట్టడం చేతకాని వారు ఎంపీగా ఎందుకు ఉండాలని మండిపడ్డారు. 

వచ్చే ఏడాదంతా ఎన్నికలే ఉంటాయని.. పార్లమెంట్ తర్వాత, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలు ఉంటాయని కేటీఆర్ వివరించారు. ఆ ఎన్నికల్లో అందరినీ గెలిపించుకునే బాధ్యత తమదే అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

Also Read: BRS News: రేవంత్ పాలమూరు బిడ్డ కాదు, చంద్రబాబు పెంపుడు బిడ్డ - బీఆర్ఎస్

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Embed widget