అన్వేషించండి

Dharmavaram Politics: ధర్మవరంలో పొలిటికల్ హీట్ - ఇండిపెండెంట్ గా నిలబడేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే

Andhrapradesh Politics: అనంతపురం జిల్లా ధర్మవరంలో పొలిటికల్ హీట్ నెలకొంది. టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ ఇండిపెండెంట్ గా నిలబడతానని తెలిపారు.

Political Heat In Dharmavaram: అనంతపురం జిల్లా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. నువ్వా నేనా అన్నట్లుగా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ధర్మవరం పీఠం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ధర్మవరం రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారబోతోంది.

బరిలో ఆ అభ్యర్థి

మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ కూటమి అభ్యర్థిగా ధర్మవరం టికెట్ ఆశించి బంగపడ్డారు. తొలుత టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జీ పరిటాల శ్రీరామ్ అభ్యర్థి అని అంతా అనుకున్నారు. అయితే, టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తులో భాగంగా.. బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కోరింది. అలాగే, ధర్మవరం అసెంబ్లీ స్థానం కోసం కూడా బీజేపీ పట్టుబట్టింది. కూటమి నేతలు కూడా ధర్మవరం నియోజకవర్గాన్ని బీజేపీకే కేటాయించారు.  దీంతో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ (Gonuguntla Suryanarayana) పోటీ దాదాపుగా ఖరారైంది. అలాంటి తరుణంలో అనుకోని పరిణామాలతో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను ధర్మవరం కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. 

'ఎన్నికల బరిలో నిలబడతా'

ధర్మవరం టికెట్ ఆశించిన ఆఖరి నిమిషంలో మరొకరికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ ఇండిపెండెంట్ గా బరిలో నిలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆదివారం నియోజకవర్గంలోని తన కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. టికెట్ రాకుండా కొందరు నేతలు కుట్రలు పన్నారని సమావేశంలో చర్చించారు. పరోక్షంగా పరిటాల కుటుంబ సభ్యులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. గతంలో కూడా 2009 ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ రాకుండా అడ్డుకున్నారని నాడు కూడా నేటి పరిస్థితే ఎదురైందని గుర్తు చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచి 44 వేల ఓట్లు సాధించామని అన్నారు. ప్రస్తుతం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని గోనుగుంట్ల భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా నియోజకవర్గంలో కార్యాచరణ కూడా ప్రారంభించినట్లు సమాచారం. 

'ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించను' 

'2009 ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం నియోజకవర్గం ఇంఛార్జీగా నన్ను నియమించారు. అనంతరం కొందరు ఉద్దేశపూర్వకంగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలను రెచ్చగొట్టారు. ఆ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ధర్మవరం నియోజకవర్గంలో 10 హత్యలు కూడా జరిగాయి. చంద్రబాబు ఆశీస్సులతో 2014 ఎన్నికల్లో ధర్మవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిచాను. గెలిచిన అనంతరం మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ను రూపుమాపేందుకు పటిష్ట చర్యలు చేపట్టాను. ఫ్యాక్షన్ రాజకీయాల ద్వారా కుటుంబాలు రోడ్డున పడతాయి తప్ప బాగుపడవని అర్థం అయ్యేలా వివరించి ధర్మవరంలో ఫ్యాక్షన్ రాజకీయాలను రూపు మాపాను. 2014 ఎన్నికల అనంతరం  ధర్మవరం నియోజకవర్గాన్ని రూ.4,500 కోట్లతో అభివృద్ధి చేశా.' అని గోనుగుంట్ల వివరించారు. నా ప్రాణం ఉన్నంతవరకు ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు, కుతంత్రాలను అధిష్టానానికి తెలియజేశానని.. ధర్మవరం టికెట్ పై అధిష్టానం పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలా కాని పక్షంలో ధర్మవరం ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఎన్నికల బరిలో నిలుస్తానని.. ఎమ్మెల్యేగా కూడా గెలుస్తానని గోనుగుంట్ల సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Nara Lokesh: 'జెడ్' కేటగిరీ భద్రతలో నారా లోకేశ్ - కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget