అన్వేషించండి

Bengal Assembly Elections: బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రే - దీదీ వర్సెస్ మోదీ పోరు ఊహించనంత హోరాహోరీ!

Bengal elections: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసి, ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తరుణంలో అక్కడ రాజకీయ వాతావరణం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఫలితాలను ప్రసిద్ధ సంస్థలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి.

Didi vs  Modi battle is an unimaginable battle:  బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.  టుడేస్ చాణక్య ,  పి-మార్క్ వంటి సంస్థలు ఈసారి  భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని, 150 నుండి 190 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని జోస్యం చెబుతున్నాయి. మరోవైపు  పీపుల్స్ పల్స్ ,  జన్మత్ వంటి సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం ఖాయమని అంచనా వేస్తున్నాయి. ఈ భిన్నమైన అంచనాలు ఓటరు తీర్పును అంచనా వేయడంలో సర్వే సంస్థలు సైతం ఎంతగా తడబడుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి.

 రికార్డు స్థాయి పోలింగ్ - నిశ్శబ్ద విప్లవమా?

బెంగాల్ చరిత్రలోనే అత్యధికంగా సుమారు 92.93 శాతం  పోలింగ్ నమోదు కావడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా భారీ పోలింగ్ అధికార వ్యతిరేకతను సూచిస్తుందని ఒక వాదన ఉంటే, మహిళా ఓటర్ల భారీ భాగస్వామ్యం తమ సంక్షేమ పథకాలకు మద్దతు అని టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా దాదాపు 90 లక్షల నకిలీ ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడం వల్ల, ఈ ఓటింగ్ సరళి అత్యంత పారదర్శకమైన తీర్పును ఇవ్వబోతోందని భావిస్తున్నారు.

 బెంగాలీ అస్తిత్వం vs జాతీయవాదం

ఈ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ ప్రధానంగా  బెంగాలీ అస్తిత్వం, ప్రాంతీయ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన లక్ష్మీ భండార్ వంటి పథకాలు మహిళా ఓటర్లను ఆకట్టుకున్నాయి. మరోవైపు బీజేపీ, కేంద్రం నుండి వస్తున్న నిధుల దుర్వినియోగం, అవినీతి,  చొరబాటు వంటి అంశాలను ఎజెండాగా పెట్టింది. హిందూ ఓట్ల ధ్రువీకరణ, సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ వంటి అంశాలు ఈసారి బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు పేర్కొంటున్నాయి.

 ఓటరు  మౌనం  .. సర్వే సంస్థలకే సవాల్!

బెంగాల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం ఓటరు మౌనం. ప్రముఖ సర్వే సంస్థ  యాక్సిస్ మై ఇండియా  ఈసారి ఫలితాలను వెల్లడించడానికి నిరాకరించింది.  దాదాపు 70 శాతం మంది ఓటర్లు తమ మనసులో మాట చెప్పడానికి నిరాకరించడంతో, డేటా నాణ్యత లేదని ఆ సంస్థ ఫలితాలను ఆపేసింది. ఇది బెంగాల్‌లో ఓటరు ఎంతటి గోప్యతను పాటిస్తున్నారో తెలియజేస్తోంది. ఏ పార్టీకైనా మద్దతు ఇస్తున్నట్లు బయటపడితే గొడవలు జరుగుతాయనే భయంతో ఓటర్లు మౌనంగా ఉండి సైలెంట్ ఓటింగ్ వేసి ఉంటారనేది విశ్లేషకుల అంచనా.

  కింగ్ మేకర్ ఎవరు?

ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీ మధ్యే ఉన్నప్పటికీ.. లెఫ్ట్ ఫ్రంట్ . కాంగ్రెస్ కూటమి ఓట్లను ఎంతవరకు చీల్చగలవనేది కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో , స్వతంత్రులు.  చిన్న పార్టీల పాత్ర కీలకం కానుంది. అయితే బెంగాల్ చరిత్రలో ఓటరు ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపుతాడు కాబట్టి, ఫలితాలు ఏకపక్షంగానే ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ఓటరు వేసిన భారీ పోలింగ్ మార్పు కోసమా? లేక మమతమ్మ పాలనకు పునరంకితం కావడానికా? అనేది మే 4న వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది. అంతవరకు బెంగాల్ రాజకీయం ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూనే ఉంటుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Advertisement

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Embed widget