అన్వేషించండి

Vasamshetty Subhash: ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా జగన్‎కు జ్ఞానోదయం కాలేదు - మంత్రి వాసంశెట్టి సుభాష్

Andhra Pradesh: వైసీపీ పాలనలో జగన్ కేవలం నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడ్డారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి ఎద్దేవా చేశారు.

AP Minister Vasamshetty Subhash: కాకినాడ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కాలేదని ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.  కాకినాడ ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి మంత్రి సుభాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.  వైసీపీ ప్రభుత్వం తాగునీటి నిర్వహణ నిర్లక్ష్యం చేయడంతో, నీరు కలుషితమై ప్రస్తుతం ప్రజలు డయేరియా బారినపడుతున్నారని మంత్రి  సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో అవినీతి పరులు ప్రతిశాఖలో ఉన్నారని ఆరోపించారు.  

అందుబాటులో ఉండాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు 24 గంటలు పాటు వైద్యసేవలు అందేలా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఉపేక్షించ వద్దని మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసి, అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​కు మంత్రి సూచించారు.  

నవరత్నాల పైనే ఆశలు
వైసీపీ పాలనలో జగన్ కేవలం  నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడ్డారని ఆయన అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలను  ఎత్తేశారని గుర్తు చేశారు. అందుకే ఎన్నికల్లో 11సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారని అన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయేంటని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ పరిపాలన ఎలా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కానీ జగన్ మాత్రం తన పాలనలో  99శాతం హామీలు అమలు చేశామనే భ్రమలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పాలన అందించనున్నట్లు వాసంశెట్టి సుభాష్ తెలిపారు. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

అందుకే తగిన బుద్ధి చెప్పారు
వైసీపీ విధానాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఇసుక అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు. ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కార్మికులకు జీవనోపాధిని కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  చంద్రన్న బీమా సాయాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు.  ఎమ్మెల్యేలందరితో కలసి పని చేస్తామన్నారు.  

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే పరిశ్రమలు ఇతర రాష్ట్రలకు తరలి పోయాయన్నారు. రూ.3000 వేల కోట్లు భవన నిర్మాణ కార్మికుల నిధులు జగన్ పథకాలు కోసం మళ్లించినట్లు ఆరోపించారు.  వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీలోకి రావడానికి ఛాన్స్ లేదు.. గేట్లు క్లోజ్ అయ్యాయన్నారు.  ప్రభుత్వ  స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండా చాలా చోట్ల వైసీపీ పార్టీ కార్యాలయాలను నిర్మించారన్నారు.  లిక్కర్, ఇసుక దోపిడీ తో రాష్ట్రాన్ని లూటీ చేశారు.. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి ఎద్దేవా చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Embed widget