అన్వేషించండి

Vasamshetty Subhash: ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా జగన్‎కు జ్ఞానోదయం కాలేదు - మంత్రి వాసంశెట్టి సుభాష్

Andhra Pradesh: వైసీపీ పాలనలో జగన్ కేవలం నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడ్డారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి ఎద్దేవా చేశారు.

AP Minister Vasamshetty Subhash: కాకినాడ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కాలేదని ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.  కాకినాడ ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి మంత్రి సుభాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.  వైసీపీ ప్రభుత్వం తాగునీటి నిర్వహణ నిర్లక్ష్యం చేయడంతో, నీరు కలుషితమై ప్రస్తుతం ప్రజలు డయేరియా బారినపడుతున్నారని మంత్రి  సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో అవినీతి పరులు ప్రతిశాఖలో ఉన్నారని ఆరోపించారు.  

అందుబాటులో ఉండాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు 24 గంటలు పాటు వైద్యసేవలు అందేలా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఉపేక్షించ వద్దని మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసి, అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​కు మంత్రి సూచించారు.  

నవరత్నాల పైనే ఆశలు
వైసీపీ పాలనలో జగన్ కేవలం  నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడ్డారని ఆయన అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలను  ఎత్తేశారని గుర్తు చేశారు. అందుకే ఎన్నికల్లో 11సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారని అన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయేంటని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ పరిపాలన ఎలా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కానీ జగన్ మాత్రం తన పాలనలో  99శాతం హామీలు అమలు చేశామనే భ్రమలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పాలన అందించనున్నట్లు వాసంశెట్టి సుభాష్ తెలిపారు. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

అందుకే తగిన బుద్ధి చెప్పారు
వైసీపీ విధానాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఇసుక అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు. ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కార్మికులకు జీవనోపాధిని కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  చంద్రన్న బీమా సాయాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు.  ఎమ్మెల్యేలందరితో కలసి పని చేస్తామన్నారు.  

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే పరిశ్రమలు ఇతర రాష్ట్రలకు తరలి పోయాయన్నారు. రూ.3000 వేల కోట్లు భవన నిర్మాణ కార్మికుల నిధులు జగన్ పథకాలు కోసం మళ్లించినట్లు ఆరోపించారు.  వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీలోకి రావడానికి ఛాన్స్ లేదు.. గేట్లు క్లోజ్ అయ్యాయన్నారు.  ప్రభుత్వ  స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండా చాలా చోట్ల వైసీపీ పార్టీ కార్యాలయాలను నిర్మించారన్నారు.  లిక్కర్, ఇసుక దోపిడీ తో రాష్ట్రాన్ని లూటీ చేశారు.. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి ఎద్దేవా చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Puducherry Elections 2026: పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !
పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !
Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Embed widget