అన్వేషించండి

Amaravati Bill: అమరావతి చట్టబద్ధత బిల్లు - పార్లమెంట్ లో వైసీపీ వ్యతిరేకిస్తుందా ?

Amaravati Legalization Bill:అమరావతికి చట్టబద్ధత బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెస్తారని ప్రచారం జరుగుతోంది. తాము అమరావతికి వ్యతిరేకం కాదని మిథున్ రెడ్డి చెప్పారు. కానీ వైసీపీ పాలసీ అది కాదు.

Amaravati Legalization Bill YSRCP Will oppose  in Parliament : అమరావతి రాజధాని అంశం మరోసారి పార్లమెంటు వేదికగా చర్చకు వస్తోంది. రాజధాని నగరానికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే అమరావతి రైతులకు న్యాయం  జరగాలన్నదే తమ విధానమని ఆయన పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అస్పష్టంగానే  న్యాయం  నిర్వచనం                              

వైసీపీ చెబుతున్న రైతులకు న్యాయం అనే మాటలో స్పష్టత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిని అనిశ్చితిలోకి నెట్టడం వల్ల రైతులే ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు కూడా న్యాయం అని మాట్లాడుతున్నారే తప్ప, ఆ న్యాయం ఏ రూపంలో ఉండాలి.. తంలో కుదుర్చుకున్న ఒప్పందాల అమలునా లేక మరేదైనా కొత్త ప్రతిపాదననా అన్నది ఆ పార్టీ నేతలు వివరించలేకపోతున్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఈ అస్పష్ట వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన బలపడుతోంది.

వివాదమా? చట్టబద్ధతా?                             

రాజధానిపై పదేపదే వివాదాలు సృష్టించడం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని  అందరి అభిప్రాయం.  గత కొన్నేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటాలు, రాజకీయ ప్రకటనల వల్ల అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై, భూములు ఇచ్చిన రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రాజధానిపై ఇంకా వివాదాలు సృష్టించడం వల్ల పెట్టుబడులు వెనక్కి పోవడమే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనికి భిన్నంగా, పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ద్వారానే రైతులకు అసలైన భరోసా లభిస్తుంది. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడమే రైతులకు జరిగే అతిపెద్ద న్యాయం. చట్టబద్ధత ఉంటే ప్రభుత్వాలు మారినా రాజధాని మారదనే నమ్మకం ఏర్పడుతుంది. ఈ భరోసా వల్ల అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి, భూముల ధరలు పెరుగుతాయి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఒప్పందం ప్రకారం రైతులకు దక్కాల్సిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన వాటాలు అప్పుడే విలువను సంతరించుకుంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యం                    

రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని వివాదాల్లో ఉంచడం కంటే, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటే అది వివాదాల ద్వారా సాధ్యం కాదు, కేవలం రాజ్యాంగబద్ధమైన రక్షణ ,వేగవంతమైన అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. పార్లమెంటులో రాబోయే బిల్లు ఈ దిశగా ఒక కీలక మలుపు అవుతుందని ఆశించవచ్చు. కానీ అది వైసీపీ విధానం మీదనే ఆధారపడి ఉంటుంది.        

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
Tamil Nadu Assembly Elections 2026: విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
Telangana assembly meetings: అసెంబ్లీలో వార్ వన్ సైడ్ - కేసీఆర్ లేని లోటు - రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!
అసెంబ్లీలో వార్ వన్ సైడ్ - కేసీఆర్ లేని లోటు - రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!
Advertisement

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget