అన్వేషించండి

Visakha Capital : ఏపీ రాజధానిపై వైసీపీలో జోరుగా చర్చ, ఎన్నికల ముందు షిఫ్టింగ్ సాధ్యమా?

ముఖ్యమంత్రి జగన్ సింగిల్ గా విశాఖకు వెళ్తారా? లేదంటే మెత్తం వ్యవస్థను ఆయనతో పాటు తీసుకువెళ్తారా? విశాఖ రాజధాని అంటూ జగన్ చేసిన కామెంట్స్ తరువాత పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Visakha Capital : దిల్లీ వేదికగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణం అని, త్వరలోనే తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని ప్రకటించారు.  అయితే ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. వరుసగా పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. అది అలా అయితే ఇది ఎలా...అబ్బే అది సాధ్యం కాదంటూ, కాదు సాధ్యమేనంటూ ఎవరికి వారు వాదనలు మొదలుపెట్టేశారు. ఆ విషయాలు ఏంటంటే... విశాఖపట్టణం రాజధాని అని సీఎం జగన్ ప్రకటించారు. ఆయన చెప్పాక ఇంకెవరు ఏం మాట్లాడతారు. అదే జరుగుతుందని కొందరు నేతలు అంటుంటే, ఇదే సమయంలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. రాజధానికి వెళ్లాలంటే, అంతకు ముందు జరగాల్సిన వ్యవహరాలు అన్నీ ఆశామాషీ కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కొందరు అవును అంటూనే, ముఖ్యమంత్రి రేంజ్ లో జగన్ వెళ్లి విశాఖపట్టణంలో కుర్చుంటే, మిగిలినవి వాతంతట అవే వస్తాయంటూ, పార్టీ నేతలు కొందరు ధీమాగా చెబుతున్నారు. అయితే కొందరు ఈ విషయానికి నిజమే అంటూనే అంత ఈజీనా అంటూ సందేహాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. సచివాలయం, అందులోని హెచ్ఓడీలు, వివిధ శాఖలు, దిగువ స్దాయి అధికారులు, సిబ్బంది, ఇలా అందరూ తట్టాబుట్టా సర్దుకొని, బెజవాడ నుంచి విశాఖపట్టణానికి వెళ్లటమా..అంటూ ఊహల్లోకి వెళుతున్నారు. రాజధాని  ఒక  ప్రాంతం  నుంచి  ఇంకో  ప్రాంతానికి  వెళ్లడం పెద్ద  ప్రాసెస్.. ఎన్నికల ముందు సీఎం ఈ  ప్రాసెస్ ను అమలుచేయటం అంత ఈజీనా అంటూ కొందరు అధికారులు సైతం, తమను కలిసిన పార్టీ ముఖ్య నేతల వద్ద సందేహాలు చెబుతున్నారంట. 

అప్పుడు...ఇప్పుడు 

రాజధాని తరలింపు వ్యవహరంపై ప్రభుత్వ వర్గాలు అప్పుడు ఇప్పుడూ అంటూ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014లో హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ అవ్వటానికి జరిగిన ప్రయత్నాలు గురించి ఆలోచిస్తున్నారు. అప్పట్లోనే అత్యంత క్లిష్టంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడలో తాత్కాలిక కార్యాలయాలు, అద్దెకు ఇళ్ళు వెతుక్కున్నారు. అదే సమయంలో అమాంతంహా పెరిగిన ఇళ్ల అద్దెలు, అప్పటి సీఎం చంద్రబాబు ఇంటి అద్దెల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేయటం...ఇలాంటి పదనిసలు అన్నీ ఇప్పుడు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. సీఎంగా ఉన్న వ్యక్తి రాజధాని అంటూ విశాఖపట్టణానికి వెళ్లి అక్కడ నుంచి పని చేయటానికి ముందు కూడా కొన్నిసదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా సీఎంవో అధికారులకు ఏర్పాట్లు జరగాలి, ఆ తరువాత సీఎంకు ప్రత్యేక సదుపాయాలు, భద్రత వంటి అంశాలు అత్యంత కీలకం.. ఇదే సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, వారికి అందాల్సిన సదుపాయాలు, ప్రోటోకాల్, వంటి తతంగాలు, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని గుర్తించే విధంగా వాతావరణం ఏర్పాటు చేయటం...ఇలా ప్రతిది సవాలే. 

మనుషులు వచ్చారు కానీ 

హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు చేసిన సమయంలో చాలా మంది ఉద్యోగులు, విజయవాడకు వచ్చారు కాని, వారి మనస్సులు మాత్రం ఇప్పటికి హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఆంధ్రప్రదేశ్ సచివాలయం పూర్తిగా బోసిబోతుంది. అధికారులు అంతా హైదరాబాద్ కు వెళ్ళిపోతారు. అక్కడ వాతావరణానికి ,విజయవాడ లో వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణమని అంటుంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా వెంటాడుతున్న సమయలో ఇప్పుడు మరోసారి విశాఖపట్టణానికి రాజధాని అని జగన్ చేసిన కామెంట్స్ తో ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget