News
News
X

Visakha Capital : ఏపీ రాజధానిపై వైసీపీలో జోరుగా చర్చ, ఎన్నికల ముందు షిఫ్టింగ్ సాధ్యమా?

ముఖ్యమంత్రి జగన్ సింగిల్ గా విశాఖకు వెళ్తారా? లేదంటే మెత్తం వ్యవస్థను ఆయనతో పాటు తీసుకువెళ్తారా? విశాఖ రాజధాని అంటూ జగన్ చేసిన కామెంట్స్ తరువాత పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

FOLLOW US: 
Share:

Visakha Capital : దిల్లీ వేదికగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణం అని, త్వరలోనే తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని ప్రకటించారు.  అయితే ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. వరుసగా పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. అది అలా అయితే ఇది ఎలా...అబ్బే అది సాధ్యం కాదంటూ, కాదు సాధ్యమేనంటూ ఎవరికి వారు వాదనలు మొదలుపెట్టేశారు. ఆ విషయాలు ఏంటంటే... విశాఖపట్టణం రాజధాని అని సీఎం జగన్ ప్రకటించారు. ఆయన చెప్పాక ఇంకెవరు ఏం మాట్లాడతారు. అదే జరుగుతుందని కొందరు నేతలు అంటుంటే, ఇదే సమయంలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. రాజధానికి వెళ్లాలంటే, అంతకు ముందు జరగాల్సిన వ్యవహరాలు అన్నీ ఆశామాషీ కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కొందరు అవును అంటూనే, ముఖ్యమంత్రి రేంజ్ లో జగన్ వెళ్లి విశాఖపట్టణంలో కుర్చుంటే, మిగిలినవి వాతంతట అవే వస్తాయంటూ, పార్టీ నేతలు కొందరు ధీమాగా చెబుతున్నారు. అయితే కొందరు ఈ విషయానికి నిజమే అంటూనే అంత ఈజీనా అంటూ సందేహాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. సచివాలయం, అందులోని హెచ్ఓడీలు, వివిధ శాఖలు, దిగువ స్దాయి అధికారులు, సిబ్బంది, ఇలా అందరూ తట్టాబుట్టా సర్దుకొని, బెజవాడ నుంచి విశాఖపట్టణానికి వెళ్లటమా..అంటూ ఊహల్లోకి వెళుతున్నారు. రాజధాని  ఒక  ప్రాంతం  నుంచి  ఇంకో  ప్రాంతానికి  వెళ్లడం పెద్ద  ప్రాసెస్.. ఎన్నికల ముందు సీఎం ఈ  ప్రాసెస్ ను అమలుచేయటం అంత ఈజీనా అంటూ కొందరు అధికారులు సైతం, తమను కలిసిన పార్టీ ముఖ్య నేతల వద్ద సందేహాలు చెబుతున్నారంట. 

అప్పుడు...ఇప్పుడు 

రాజధాని తరలింపు వ్యవహరంపై ప్రభుత్వ వర్గాలు అప్పుడు ఇప్పుడూ అంటూ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014లో హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ అవ్వటానికి జరిగిన ప్రయత్నాలు గురించి ఆలోచిస్తున్నారు. అప్పట్లోనే అత్యంత క్లిష్టంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడలో తాత్కాలిక కార్యాలయాలు, అద్దెకు ఇళ్ళు వెతుక్కున్నారు. అదే సమయంలో అమాంతంహా పెరిగిన ఇళ్ల అద్దెలు, అప్పటి సీఎం చంద్రబాబు ఇంటి అద్దెల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేయటం...ఇలాంటి పదనిసలు అన్నీ ఇప్పుడు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. సీఎంగా ఉన్న వ్యక్తి రాజధాని అంటూ విశాఖపట్టణానికి వెళ్లి అక్కడ నుంచి పని చేయటానికి ముందు కూడా కొన్నిసదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా సీఎంవో అధికారులకు ఏర్పాట్లు జరగాలి, ఆ తరువాత సీఎంకు ప్రత్యేక సదుపాయాలు, భద్రత వంటి అంశాలు అత్యంత కీలకం.. ఇదే సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, వారికి అందాల్సిన సదుపాయాలు, ప్రోటోకాల్, వంటి తతంగాలు, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని గుర్తించే విధంగా వాతావరణం ఏర్పాటు చేయటం...ఇలా ప్రతిది సవాలే. 

మనుషులు వచ్చారు కానీ 

హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు చేసిన సమయంలో చాలా మంది ఉద్యోగులు, విజయవాడకు వచ్చారు కాని, వారి మనస్సులు మాత్రం ఇప్పటికి హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఆంధ్రప్రదేశ్ సచివాలయం పూర్తిగా బోసిబోతుంది. అధికారులు అంతా హైదరాబాద్ కు వెళ్ళిపోతారు. అక్కడ వాతావరణానికి ,విజయవాడ లో వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణమని అంటుంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా వెంటాడుతున్న సమయలో ఇప్పుడు మరోసారి విశాఖపట్టణానికి రాజధాని అని జగన్ చేసిన కామెంట్స్ తో ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 

Published at : 01 Feb 2023 01:54 PM (IST) Tags: YSRCP AP Politics AP CMO ap updates AP Capital AP SACHIVALAYAM

సంబంధిత కథనాలు

Warangal BJP: వరంగల్ పశ్చిమ బీజేపీలో టికెట్ కోసం పోటా పోటీ, నేతల వరుస పర్యటనలు

Warangal BJP: వరంగల్ పశ్చిమ బీజేపీలో టికెట్ కోసం పోటా పోటీ, నేతల వరుస పర్యటనలు

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

TSPSC Paper Leak Case : పేపర్ లీక్ కేసు సీబీఐకి ఇవ్వాలా వద్దా ? హైకోర్టు చెప్పింది ఏమిటంటే ?

TSPSC Paper Leak Case : పేపర్ లీక్ కేసు సీబీఐకి ఇవ్వాలా వద్దా ? హైకోర్టు చెప్పింది ఏమిటంటే ?

TS Paper Leak Politics : పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పెట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?

TS Paper Leak Politics : పేపర్ లీక్

YSRCP What Next : పట్టభద్రులిచ్చిన తీర్పుతో షాక్ - వైసీపీ దిద్దుబాటు చర్యలేంటి ? లైట్ తీసుకుంటారా ?

YSRCP What Next : పట్టభద్రులిచ్చిన తీర్పుతో షాక్ - వైసీపీ దిద్దుబాటు చర్యలేంటి ? లైట్ తీసుకుంటారా ?

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్