అన్వేషించండి
Agnipath Protests Photos: సికింద్రాబాద్ స్టేషన్లో అల్లకల్లోలం, రైళ్లకు ఆందోళనకారులు నిప్పు - పోలీసుల ఫైరింగ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లకు నిప్పు
1/8

నిన్నటివరకూ ఉత్తరాధి రాష్ట్రాల్లో చెలరేగిన అగ్నిపథ్ వివాదం నేడు తెలంగాణలోనూ ప్రభావం చూపుతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు.
2/8

అగ్ని పథ్ పథకాన్ని రద్దు చేసి రెగ్యూలర్ గా సైన్యంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
3/8

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికి పోతుంది. ఆందోళనకారులు చెలరేగడంతో పోలీసులు సైతం ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.
4/8

అగ్నిపథ్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రద్దు కావడంతో కొన్ని గంటల వ్యవధిలో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ చెప్పారు.
5/8

ఆర్మీ విద్యార్థుల ఆకస్మిక దాడితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అల్లర్లు మొదలుకావడంతో కొందరు ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. రైల్వే ఆస్తులకు తీవ్రంగా నష్టం కలిగించడంతో ఆందోళనకారులు చెదరగొట్టేందుకు పోలీసులు ఫైరింగ్ మొదలుపెట్టారు.
6/8

అగ్నిపథ్ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్ స్టేషన్లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు.
7/8

ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది.
8/8

నాలుగేళ్ల సర్వీసు తరువాత ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థులు ఆందోళనకు గురై నిరసనకు దిగి విధ్వంసానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Published at : 17 Jun 2022 11:55 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















