అన్వేషించండి

US Tariffs on India: భారత ప్రధాని మోదీతో చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మార్కెట్‌కు బూస్ట్

Trump Tariffs on India | భారత మార్కెట్లో జోష్ నింపే వార్త చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాను త్వరలోనే భారత ప్రధాని మోదీతో చర్చించాలనుకుంటున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

US India Talks On Trade Barriers to continue | వాషింగ్టన్: భారత్ మీద 50 శాతం టారిఫ్ అమలుచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను పరిష్కరించడానికి, వాణిజ్య ఒప్పందం కోసం తమ ప్రభుత్వం భారతదేశంతో చర్చలు కొనసాగిస్తోందని తెలిపారు. చైనాకు భారతదేశాన్ని కోల్పోయానని కామెంట్ చేసిన కొన్ని రోజులకే భారత్ తో ట్రేడ్ డీల్ కోసం చూస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ చేశారు. "చాలా మంచి స్నేహితుడు అయిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో త్వరలో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. ఈ చర్చలు రెండు దేశాలు కోరుకున్న ఫలితాన్ని ఇస్తాయనే నమ్మకం ఉందన్నారు. 

భారత్, రష్యాను చైనాకు కోల్పోయామన్న ట్రంప్..

“భారతదేశం, అమెరికా దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను పరిష్కరించడానికి చర్చలు కొనసాగుతాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను. మన రెండు గొప్ప దేశాలకు విజయవంతమైన ముగింపు లభిస్తుంది” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లు చైనాలోని టియాంజిన్ లోని SCO సమ్మిట్ లో ఇటీవల సమావేశం అయ్యారు. భారతదేశం, రష్యా దేశాలను  చైనాకు కోల్పోతున్నామని ట్రంప్ ఆ సమయంలో అన్నారు. చైనాలో జరిగిన సమ్మిట్ లో ముగ్గురు నేతలు కలిసి దిగిన ఫోటోను కూడా ట్రంప్ షేర్ చేశారు.

అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఇదే సమయంలో జీఎస్టీ స్లాబ్స్ సైతం తగ్గిస్తున్నట్లు ప్రకటించడం అమెరికా బిగ్ షాకిచ్చినట్లు అయింది. దాంతో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. ప్రధాని మోదీని "గొప్ప ప్రధాన మంత్రి" అని సంబోధించారు. తాము ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ ట్రంప్ మనోభావాలను గౌరవిస్తున్నాం. ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. 

ఇప్పటికే ఆలస్యమైందన్న అమెరికా

గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ..  అమెరికా వస్తువులపై సున్నా శాతం సుంకాలు తగ్గించడానికి భారతదేశం ప్రతిపాదించిందని అన్నారు. అయితే, ఈ ప్రతిపాదన ఆలస్యమైందని, ఈ చర్యను చాలా సంవత్సరాల క్రితమే తీసుకోవాల్సిందన్నారు. భారతదేశ వాణిజ్య విధానాలను, రష్యాతో ఇంధన సంబంధాలను ట్రంప్ పలుమార్లు విమర్శించారు.

నెలల తరబడి భారత్ మీద విషం చిమ్ముతున్న అమెరికా అధ్యక్షుడు భారత్ తో చర్చలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. భారత్, అమెరికా ప్రతినిధులు చర్చించి వాణిజ్య ఒప్పందం చేసుకుంటారని శుభవార్త చెప్పారు. అయితే రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనసాగించడాన్ని అమెరికా జీర్ణించుకోవడం లేదు. అందుకే 25 శాతం అదనపు సుంకాలు భారత్ మీద విధించడం తెలిసిందే.  

భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ సుంకాలు ఈ ఏడాది భారతదేశ జిడిపిలో 0.5 శాతం తగ్గించవచ్చని అన్నారు. యుఎస్ సెన్సెస్ బ్యూరో డేటా ప్రకారం, 2024 లో అమెరికా-భారత్ మధ్య వాణిజ్యం విలువ 129 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో వాషింగ్టన్ 45.8 బిలియన్ డాలర్ల లోటును నమోదు చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget