అన్వేషించండి
Lok Sabha Elections 4th Phase: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నేతలు, ప్రశాంతంగా పోలింగ్
Lok Sabha Elections 4th Phase: లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
1/7

మధ్యప్రదేశ్లోని ఉజ్జెయిన్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సీమా యాదవ్ ఓటు వేశారు. 100% పోలింగ్ నమోదయ్యేలా ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటు తప్పకుండా వేయాలని సూచించారు.
2/7

ఝార్ఖండ్లోని కుంతీ నియోజకవర్గంలో అర్జున్ ముండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలపై కేవలం రాజకీయ పార్టీలకే కాకుండా ఓటర్లందరికీ ఆసక్తి నెలకొందని వెల్లడించారు. దేశ ప్రజలంతా బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారన్న నమ్మకముందని అన్నారు. ఝార్ఖండ్లో అత్యంత కీలక నేతల్లో ఒకరైన అర్జున్ ముండా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
Published at : 13 May 2024 11:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















