అన్వేషించండి
Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనమిచ్చాడు చూశారా - ఎంత చూసినా తనివి తీరదు
Ram Mandir Inauguration: అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనమిచ్చాడు.
![Ram Mandir Inauguration: అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనమిచ్చాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/04e629f23a95b8c937517799a362d5231705664355281517_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనమిచ్చాడు.
1/8
![జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున దర్శనమివ్వాల్సిన అయోధ్య రాముడు ముందే దర్శనమిచ్చాడు. ఇప్పటి వరకూ ముఖాన్ని కప్పేసి ఉన్న విగ్రహం ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాల రాముడి పూర్తి రూపం కనిపించాక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/fdd6eef6db563f95c046e20b9351b4bd4d884.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున దర్శనమివ్వాల్సిన అయోధ్య రాముడు ముందే దర్శనమిచ్చాడు. ఇప్పటి వరకూ ముఖాన్ని కప్పేసి ఉన్న విగ్రహం ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాల రాముడి పూర్తి రూపం కనిపించాక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
2/8
![పూర్తిగా కృష్ణ శిలతో తయారు చేసిన బాల రాముడి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ విగ్రహం అందరినీ కట్టి పడేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/af2fdf290531f27f6e2bcecbf5a0ebd50165c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పూర్తిగా కృష్ణ శిలతో తయారు చేసిన బాల రాముడి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ విగ్రహం అందరినీ కట్టి పడేస్తోంది.
3/8
![బంగారు విల్లు, బాణం పట్టుకున్న ఐదేళ్ల రాముడి విగ్రహాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశాడు. ఈ విగ్రహం ఎత్తు 5 అడుగులు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/c17e32f0625b62158c2f477651459c45a3d3f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బంగారు విల్లు, బాణం పట్టుకున్న ఐదేళ్ల రాముడి విగ్రహాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశాడు. ఈ విగ్రహం ఎత్తు 5 అడుగులు.
4/8
![ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకుంది. గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/3d04751e8825c5f3af126667f3de4bee3a8af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకుంది. గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
5/8
![జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులకే ఆ రోజు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/e611559a4632e85ba92351826c3efd4457fc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులకే ఆ రోజు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది.
6/8
![గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరగాల్సిన క్రతువులు కొనసాగుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/9bd6c94fb615a65fdeaec9c08ec8da6827d35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరగాల్సిన క్రతువులు కొనసాగుతున్నాయి.
7/8
![అయోధ్య ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పనులపై ఆరా తీశారు. మొత్తం 8 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపారు. వీళ్లలో బిలియనీర్ ముకేశ్ అంబానీ, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/ca847b9f63aa8cae4a5e719ab7725b9957d2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయోధ్య ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పనులపై ఆరా తీశారు. మొత్తం 8 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపారు. వీళ్లలో బిలియనీర్ ముకేశ్ అంబానీ, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు.
8/8
![ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులు ఇన్విటేషన్ కార్డుతో పాటు తప్పనిసరిగా విజిటింగ్ పాస్ని తీసుకురావాలని ట్రస్ట్ వెల్లడించింది. దానిపై ఉన్న QR కోడ్ని స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతినిస్తారని స్పష్టం చేసింది. కేవలం ఇన్విటేషన్ కార్డు మాత్రమే సరిపోదని వివరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/b6342b4146dc46159bc734427f2dd5e74dc46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులు ఇన్విటేషన్ కార్డుతో పాటు తప్పనిసరిగా విజిటింగ్ పాస్ని తీసుకురావాలని ట్రస్ట్ వెల్లడించింది. దానిపై ఉన్న QR కోడ్ని స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతినిస్తారని స్పష్టం చేసింది. కేవలం ఇన్విటేషన్ కార్డు మాత్రమే సరిపోదని వివరించింది.
Published at : 19 Jan 2024 05:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion