అన్వేషించండి

Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల సహా తెలంగాణలో ప్రాజెక్టులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 29 నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

హైదరాబాద్: ఇటీవల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తరువాత రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. రెండేళ్లు గడువు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులలో చిన్న పనులు చేయలేదని, తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీలోనే సమాధానం చెబుతామని, జనవరి 2 నుంచి జలాల అంశంపై అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు

కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై సమగ్రంగా చర్చించేందుకు డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. మంత్రులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన 2014 తర్వాత జరిగిన వ్యయం వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా 'నీళ్లు-నిజాలు' పేరుతో చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ విమర్శలు చేసిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అప్పట్లోనే డీపీఆర్‌లు ఎందుకు వెనక్కి వచ్చాయన్నది ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి, 3 రోజుల విరామం తర్వాత జనవరి 2 నుంచి సమావేశాలు తిరిగి కొనసాగించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారు. 

జీహెచ్‌ఎంసీ విస్తరణ, మున్సిపల్ ఎన్నికలు
హైదరాబాద్ నగర విస్తరణ (GHMC)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచుతూ, నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజించే ప్రతిపాదనపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కొత్తగా 70 నుంచి 80 డివిజన్లతో అదనపు కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని, అందులో ఒకటి సైబరాబాద్ పేరుతో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన తర్వాత వచ్చే జనవరి తరువాతే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించారు. 

పంచాయతీ ఫలితాల విశ్లేషణ, సర్పంచుల సభ
ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మంత్రులను రేవంత్ రెడ్డి అభినందించారు. గెలిచిన సర్పంచుల విద్యార్హతలు, సామాజిక వర్గాల వారీగా వివరాలను సేకరించి వారిని 3 టీంలుగ విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని రేవంత్ సూచించారు. సంక్రాంతి పండుగ నాటికి నూతన సర్పంచులతో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాన్ని మండల, నియోజకవర్గ స్థాయిల్లో విశ్లేషించి పార్టీ భవిష్యత్ వ్యూహాలను రూపొందించాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

గత ప్రభుత్వ విధానాలపై పోరాటం
నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, ప్రాజెక్టుల డీపీఆర్ లు వెనక్కి వచ్చిన సందర్భాలలో అసెంబ్లీ సమావేశాల్లో గళంవిప్పి రాష్ట్ర ప్రజలకు గట్టిగా వినిపించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆధారాలతో సహ వివరించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తాగునీటి ప్రాజెక్టుగా పరిమితం చేసి, రైతులకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుు 90 టీఎంసీల పూర్తిస్థాయి ప్రాజెక్టుగా మార్చడానికి తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుంచాలని నిర్ణయించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

KTR Revanth Globarena: గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
Bellampally MJP School Food Poisoning: బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget