PM Modi Europe Tour: ఆ చిటికెలు చిటికెలు- మోదీ మనసు దోచిన చిన్నారి- ఏం పాడినవ్ రా బుడ్డోడా!
PM Modi Europe Tour: ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ఓ చిన్నారి పాడిన పాటను మోదీ ఆసక్తింగా ఆలకించారు.
![PM Modi Europe Tour: ఆ చిటికెలు చిటికెలు- మోదీ మనసు దోచిన చిన్నారి- ఏం పాడినవ్ రా బుడ్డోడా! Modi Europe Tour Indian-Origin Boy Sings Patriotic Song On PM Modi's Arrival In Berlin Gets Praise WATCH PM Modi Europe Tour: ఆ చిటికెలు చిటికెలు- మోదీ మనసు దోచిన చిన్నారి- ఏం పాడినవ్ రా బుడ్డోడా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/02/4b4f48e77b60374b293641c6969490f0_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Europe Tour: ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బెర్లిన్ చేరుకున్నారు. బ్రాండన్బర్గ్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు ప్రధాని మోదీతో ముచ్చటించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
It was early morning in Berlin yet several people from the Indian community came by. Was wonderful connecting with them. India is proud of the accomplishments of our diaspora. pic.twitter.com/RfCyCqJkPY
— Narendra Modi (@narendramodi) May 2, 2022
పాట పాడిన చిన్నారి
ఆ తర్వాత అక్కడికి వచ్చిన చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఓ బాలిక ప్రధానికి చిత్రపటాన్ని బహూకరించింది. ప్రధాని తనకు ఆదర్శమని తెలిపింది. మరో చిన్నారి మోదీకి దేభక్తి పాటను పాడి వినిపించాడు.
#WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm
— ANI (@ANI) May 2, 2022
మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్రధాని మోదీ చిటికెలు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడ్ని మోదీ మెచ్చుకున్నారు.
ఐరోపా పర్యటన
పర్యటనలో భాగంగా మొదట బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొంటారు. వీరిద్దరూ భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో ఎడిషన్కు సహ అధ్యక్షులుగా ఉన్నారు. 2021లో జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరువురు దేశాధినేతలు సమావేశం కానుండడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల అనంతరం జర్మనీలోని భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
డెన్మార్క్
ఆ తర్వాత డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్హాగన్కు వెళతారు. డెన్మార్క్ వేదికగా జరగనున్న ఇండియా- నార్డిక్ సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. అనంతరం భారత్- డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్లో మోదీ పాల్గొంటారు.
శుభాకాంక్షలు
ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ కొద్దిసేపు పారిస్లో ఆగనున్నారు. నూతనంగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ను కలిసి మోదీ శుభాకాంక్షలు తెలపుతారు.
Also Read: Vladimir Putin's Health: పుతిన్ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం!
Also Read: Nand Mulchandani: అమెరికాలో మనోడికి అరుదైన గౌరవం- నిఘా సంస్థ సీటీఓగా నియామకం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)