అన్వేషించండి

Iran War : గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని చిదిమేయడమే లక్ష్యం- అయిల్ ప్లాంట్లను టార్గెట్ చేసి బాంబులేస్తున్న ఇరాన్

Aramco refinery: ఇరాన్ తమ సుప్రీం లీడర్ ఖొమైనీ మరణానికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చాలని ప్రయత్నిస్తోంది. అయిల్ రిఫైనరీల కేంద్రంగా దాడులు చేస్తోంది.

Iran struck Saudi Aramco refinery: సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకటైన రాస్ తనూరా పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ దాడి కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం  అరామ్కో (Aramco) తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

చమురు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం 

పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్న రాస్ తనూరా కాంప్లెక్స్ మధ్యప్రాచ్యంలోనే అత్యంత కీలకమైనది. ఇది రోజుకు సుమారు 5,50,000 బారెల్స్ చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా, సౌదీ అరేబియాకు ప్రధాన ఎగుమతి కేంద్రంగా కూడా ఉంది. డ్రోన్ దాడి వల్ల అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అరామ్కో తన ప్లాంట్‌ను మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫ పై ఇది భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ,  అరామ్కో ప్లాంట్‌పై దాడి ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై తక్షణమే కనిపించింది. సోమవారం ఈ ఘటన జరిగిన వెంటనే బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 10 శాతం మేర పెరిగాయి. చమురు ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో గ్లోబల్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి.  

గల్ఫ్ రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం

ఇరాన్ కేవలం సౌదీ అరేబియానే కాకుండా అబుదాబి, దుబాయ్, దోహా, ఒమన్‌లోని వాణిజ్య నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన షిప్పింగ్ హబ్‌లు స్తంభించిపోయాయి. అమెరికా స్థావరాలు ఉన్న కతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలపై కూడా ఇరాన్ క్షిపణులు ,  డ్రోన్లతో దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది.

చమురు ఉత్పత్తి దారుణంగా పడిపోయే ప్రమాదం 

2019లో అబ్కైక్ ,  ఖురైస్ ప్లాంట్లపై జరిగిన దాడుల సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది.  తాజా పరిణామాలు అంతకంటే తీవ్రంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులకు దిగిందని, ఈ పోరు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలనే కాకుండా ప్రపంచ ఆర్థిక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Iran US War: మారుతున్న యుద్ధ సమీకరణాలు.. ఇరాన్‌ను నడిపిస్తున్నది ఎవరు! US- ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న సపోర్ట్
మారుతున్న యుద్ధ సమీకరణాలు.. ఇరాన్‌ను నడిపిస్తున్నది ఎవరు! US- ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న సపోర్ట్
US Iran War: 48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Iran War Updates: అగ్రనేతలంతా మరణించినా ఇరాన్ ఎందుకు లొంగడం లేదు? - వాళ్ల బలం ఇదేనా?
అగ్రనేతలంతా మరణించినా ఇరాన్ ఎందుకు లొంగడం లేదు? - వాళ్ల బలం ఇదేనా?
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget