అన్వేషించండి

Tirumala: తిరుమలకు ఉగ్ర ముప్పు! హై సెక్యూరిటీపై ఐబీ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారుల కీలక భేటీ

Tirumala: తిరుమలలో భద్రత లోపాలపై కేంద్ర ఐబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్, పోలీసులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు.

Tirumala Latest News Today: తిరుమలలో ఇటీవల బయటపడ్డ భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మంగళవారం తిరుమల కొండపై అన్నమయ్య భవన్ లో టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు, కేంద్ర ఐబీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, రాజస్థాన్ కు చెందిన కమ్యూనిటీ పోలిసింగ్ అధికారి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. ఏడు కొండలపై చేపట్టిన భద్రతా ఏర్పాట్ల గురించి టీటీడీ భద్రతా అధికారులు, పోలీసులు విడివిడిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తిరుమలలో భద్రతా లోపాలు ఆందోళన కలిగిస్తుండటంతో టీటీడీ అధికారులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు. 

భద్రతా వైఫల్యంపై కీలక చర్చ

అలిపిరి మొదలుకుని ఘాట్ రోడ్డు, వైకుంఠం క్యూ‌ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, భక్తుల రద్దీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాట్లు, తనిఖీ వంటి భద్రతలపై చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్ధానంపై ఉగ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర భద్రతా బలగాలు హెచ్చరించిన క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐతే టీటీడీలో భద్రతను మరింత కఠినతరం చేసేందుకు కేంద్ర భద్రతా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో భద్రతలో వైఫల్యం ఎక్కడ ఉందన్న దానిపై నిఘా అధికారుల ద్వారా ఓ అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర నిఘా వర్గాలతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను కూడా తిరుమలకు రప్పించి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఓఎస్డీ శశిధర్ రెడ్డి, ఎస్ఎస్జి ఎస్బీ బాబుజీ అట్టెడ, ఎస్ఐబీ ఐఎస్‌డబ్ల్యూ గరుడ సుమిత్ సునీల్ పాల్గొన్నారు.

గతంలో మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు 

శ్రీవారి ఆలయం పరిసరాల్లో ఏప్రిల్ 25వ తేదీన సాయంత్రం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో భక్తులను ఆందోళనకు గురయ్యారు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్‌ ప్రాంతంలో హెలికాప్టర్‌లు చక్కర్లు కొట్టినట్లు అధికారులు గుర్తించారు. తిరుమలలో 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల మీదుగా చక్కర్లు కొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

అంతకు ముందు డ్రోన్ కలకలం 

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో  టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాల చిత్రీకరించడంపై ఆరా తీశారు. తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన విజువల్స్ పై విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వారు విజువల్స్ ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. వీళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Ravi Bishnoi Unwanted Record: రవి బిష్ణోయ్ పేరిట వరస్ట్ రికార్డ్! ఇంగ్లాండ్ పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆ జాబితాలో చోటు
రవి బిష్ణోయ్ పేరిట వరస్ట్ రికార్డ్! ఇంగ్లాండ్ పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆ జాబితాలో చోటు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Embed widget