అన్వేషించండి

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో తిరుప్పరకుండ్రం మంటలు - హిందూత్వ భావోద్వేగం అంటుకున్నట్లేనా?

Thirupparakundram: తమిళనాడులో ఇప్పటి వరకు ద్రవిడ రాజకీయాలు ఉండగా, ఇప్పుడు బీజేపీ దానిని మతపరమైన రాజకీయాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దానికి తిరుప్పకుండ్రం దీపం వివాదం ఆయుధంగా దొరికింది.

Thirupparakundram fire in Tamil Nadu politics: తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న  తిరుప్పర కుండ్రం   ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. శతాబ్దాలుగా హిందూ-ముస్లిం సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ కొండ, ప్రస్తుతం  మతపరమైన రాజకీయాలకు వేదికగా మారింది. 

 దక్షిణ భారత్ 'అయోధ్య'గా మారుతోందా? తిరుప్పర కుండ్రం చుట్టూ ముదురుతున్న రాజకీయం!

 తమిళనాడులో మురుగన్ ఆరు క్షేత్రాల్లో  మొదటిదైన తిరుప్పర కుండ్రం ఇప్పుడు రాజకీయ సెగలతో రగులుతోంది. ఈ కొండపై మురుగన్ ఆలయంతో పాటు శతాబ్దాల నాటి  సికందర్ బాదుషా దర్గా కూడా ఉంది. ఇన్నాళ్లూ కలిసిమెలిసి ఉన్న ఈ రెండు మతాల మధ్య, ఇటీవలి కాలంలో  కార్తీక దీపం  వెలిగించడం , జంతు బలుల విషయంలో తలెత్తిన వివాదాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ ప్రాంతాన్ని  దక్షిణ భారత్ అయోధ్య గా అభివర్ణించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయికి చేరింది.

 వివాదానికి మూలం ఏమిటి? 

ఇటీవలి కాలంలో కొండపై ఉన్న దీప స్తంభం  వద్ద కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే, దర్గాకు సమీపంలో దీపం వెలిగిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని డీఎంకే ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు, దర్గాలో జంతు బలులు ఇవ్వడంపై కూడా హైకోర్టు ఆంక్షలు విధించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కొండ పేరును  సికందర్ మలై ' అని పిలవాలా లేక తిరుప్పర కుండ్రం మలై  అని పిలవాలా అనే అంశంపై కూడా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

 ఏ పార్టీ వైఖరి ఏమిటి? 

 బీజేపీ ఈ అంశాన్ని తన  హిందుత్వ  అజెండాకు ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. దశాబ్దాలుగా హిందువుల హక్కులను డీఎంకే కాలరాస్తోందని, దర్గా ప్రాంగణంలో దీపం వెలిగించే హక్కు హిందువులకు ఉందని వాదిస్తోంది. ఈ సమస్య ద్వారా తమిళనాడులో హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. అధికార డీఎంకే ప్రభుత్వం దీనిని  సామరస్య సమస్య గా చూస్తోంది. కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని చెబుతూనే, మత విద్వేషాలను రగిలించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. మైనారిటీల హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యత అని డీఎంకే సంకేతాలు ఇస్తోంది. ఈ విషయంలో అన్నాడీఎంకే ఆచితూచి స్పందిస్తోంది. ప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవించాలని చెబుతూనే, అటు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇటు ముస్లింల మద్దతు కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది.

 ఎన్నికలపై ప్రభావం 
వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వివాదం పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. తమిళనాడులో ఇప్పటివరకు  ద్రవిడ రాజకీయాలు కుల వివక్ష, సామాజిక న్యాయం ప్రధానంగా ఉండగా, ఇప్పుడు బీజేపీ దానిని మతపరమైన రాజకీయాల  వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. మురుగన్ అంటే తమిళులకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని  ఆసరాగా చేసుకుని, డీఎంకేను హిందూ వ్యతిరేక  పార్టీగా ముద్ర వేయాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం వర్సెస్ హిందుత్వ సిద్ధాంతం మధ్య జరిగే ఈ పోరులో తిరుప్పర కుండ్రం ఇప్పుడు ఒక కీలక  అంశంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget