అన్వేషించండి

J&K Gunfire: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట, కాల్పుల్లో ఓ జవాను మృతి - ఆరుగురికి తీవ్ర గాయాలు

J&K Gunfire: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

Terror Attack in Jammu: జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ CRPF జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి మొదలైన ఎన్‌కౌంటర్‌ తెల్లవారుజామున వరకూ కొనసాగింది. దొడ జిల్లాలోనూ ఐదుగురు సైనికులతో పాటు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌ ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డారు. జమ్ములోని Reasi లో ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఉగ్రవాదుల్ని ఏరేసే ఆపరేషన్ మొదలు పెట్టాయి. దాదాపు రెండు రోజులుగా ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. కథువాలోని యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌ని జమ్ము జోన్‌కి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఛత్తర్‌గలలోని ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోని బేస్‌లనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు తమపై దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వాళ్లలో ఒకరిని కాల్చి చంపినట్టు తెలిపారు. 

మరో టెర్రరిస్ట్ కోసం డ్రోన్‌ సాయంతో గాలిస్తున్నారు. అయితే...స్థానిక గ్రామంలోని ఇళ్లలోకి వెళ్లి ఉగ్రవాదులు మంచినీళ్లు అడిగారని, ఆ సమయంలో గ్రామస్థులు అలారం మోగించారని వివరించారు పోలీసులు. ఈ అలారం విన్న వెంటనే ఉగ్రవాదులు గ్రామస్థులపై కాల్పులు జరిపి పారిపోయినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. 

"ఉగ్రవాదుల కాల్పుల్లో చాలా మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజం కాదు. ఒకే ఒక వ్యక్తి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వచ్చే  ఏ సమాచారాన్నైనా నమ్మొద్దు"

- పోలీసులు

అయితే...పాకిస్థాన్‌ పేరు నేరుగా ప్రస్తావించకుండానే ఉన్నతాధికారులు ఆ దేశంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో ప్రశాంతమైన వాతావరణంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మండి పడుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget