అన్వేషించండి

Smart Phone eVoting: స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ-ఓటింగ్‌.. దేశంలో మొదటిసారిగా తెలంగాణ నుంచే అమలు..

కోవిడ్ కారణంగా ప్రపంచమంతా డిజిటల్ యుగం వైపు పరుగులు పెడుతోంది. సాంకేతికత సాయంతో ఇంటి నుంచే అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా ఓట్లు కూడా ఇంటి నుంచే వేసేలా ఈ-ఓటింగ్‌ విధానాన్ని రూపొందించారు.

ఓటింగ్ విధానంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అధునాతన టెక్నాలజీ సాయంతో ఇంటి నుంచే ఓటు వేసేలా ఈ-ఓటింగ్‌ విధానం రూపుదిద్దుకుంది. తెలంగాణ నుంచే ఇది ఆరంభం కానుండటం విశేషం. మొబైల్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఓటు వేసేలా దీనిని అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), రాష్ట్ర ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీడాక్ (CDAC), ఐఐటీ బిలాయ్ డైరెక్టర్, ఈసీఐ సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ రజత్ మూనా, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణలో ఈ యాప్ తయారైంది. 

Also Read: పేదరికంతో వైద్య విద్య ఆపేసి కూరగాయల అమ్మకం ! కేటీఆర్‌కు తెలిసిన వెంటనే...

ఖమ్మంలో ప్రయోగాత్మకంగా పరిశీలన.. 
ఈ-ఓటింగ్ యాప్ పనితీరును పలుమార్లు పరిశీలించారు. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో డమ్మీ ఓటింగ్ పేరుతో వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబర్ 20న డమ్మీ ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇది పరిశీలన కావడంతో పౌరులందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. 

Also Read: స్పెషలైజేషన్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టండి.. స్థానికంగానే వైద్య సేవలు అందించాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సాయంతో.. 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలను ఇందులో వినియోగించారు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో వివరాలు మార్చడం కుదరదు. ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫొటోలను సరిపోల్చేందుకు సాయం చేస్తుంది. ఈ రెండు టెక్నాలజీలలో అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఫోన్ హ్యాక్ చేయడానికి వీలులేని సాంకేతికతను ఇందులో వినియోగించారు. ఈ-ఓటింగ్ విధానంలో ఓటు వేయడం కోసం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం కుదరదు. లైవ్‌ ఫొటోతో నిర్ధారించిన తర్వాతనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒకే ఫోన్ ద్వారా ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఓటు వేసే సదుపాయం కల్పించారు. రిజిస్ట్రేషన్, ఓటింగ్‌ ప్రక్రియలకు ఒకే ఫోన్‌ నంబర్, మొబైల్‌ ఫోన్‌ను వినియోగించాలి. ఒకరి బదులుగా వేరే వ్యక్తి ఓటు వేయడానికి వీలుండదు. 

Also Read: మెడిసన్ ఫ్రమ్ స్కైలో సరికొత్త టెక్నాలజీ.. పేలోడ్ సాయంతో మందులు.. ప్రయోగాత్మకంగా అమలు

ఎలా పనిచేస్తుందంటే? 
ఓటు వేయాలనుకునే వ్యక్తి ముందుగా మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఓటరు ఐడీ నంబరు, ఆధార్ వివరాలు అందించాల్సి ఉంటుంది. అదే ఫోన్ ద్వారా లైవ్ ఫొటో తీసుకుని అప్ లోడ్ చేయాలి. ఓటర్ ఐడీలో ఉన్న ఫొటోతో సరిపోల్చి నిర్ధారించుకుంటుంది. అనంతరం ఫొటోలను ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో పోలుస్తుంది. ఓటీపీ ధ్రువీకరణతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

Also Read: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

Also Read: తెలుగులోనూ ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
Rithu Chowdhary Marriage : రిలేషన్ షిప్ ఓ టార్చర్ - సీక్రెట్ మ్యారేజ్‌పై రీతూ చౌదరి రియాక్షన్... బిగ్ బాస్ తర్వాత ఒంటరిగానేనా...
రిలేషన్ షిప్ ఓ టార్చర్ - సీక్రెట్ మ్యారేజ్‌పై రీతూ చౌదరి రియాక్షన్... బిగ్ బాస్ తర్వాత ఒంటరిగానేనా...
Embed widget