అన్వేషించండి

YS Jagan: స్పెషలైజేషన్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టండి.. స్థానికంగానే వైద్య సేవలు అందించాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

రాష్ట్రానికి అవసరమైన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష జరిపారు.

వైద్యం కోసం ప్రజలు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని.. మన రాష్ట్రంలోనే చికిత్స అందించే విధంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు ఏయే రకాల చికిత్సల కోసం వెళ్తున్నారో గుర్తించి ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ రకమైన వైద్య సేవలు స్థానికంగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌ తదితర అంశాలపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రానికి అవసరమైన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష జరిపారు. కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నెలాఖరుకు వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

Also Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. తాజాగా 9 మంది మృతి

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌పై సమీక్ష.. 
రాష్ట్రంలో కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. జనవరి 26 నాటికి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు. స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మహిళలు, బాలికల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు. 

Also Read: జగన్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ ..ఎందాకైనా వెళ్తానన్న రఘురామ..!

ఆరోగ్య శ్రీపై హోర్డింగ్స్‌ పెట్టాలి..
ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలని జగన్ అదికారులకు సూచించారు. ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ మీద ప్రచారం ఉండాలని తెలిపారు. ఆరోగ్య మిత్రల ఫోన్‌ నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఉంచాలని పేర్కొన్నారు. ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్న చెప్పారు. డిజిటల్‌ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 108 వెహికల్స్‌ సిబ్బందికి కూడా రిఫరెల్‌ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలని చెప్పారు. 

Also Read: తెలుగులోనూ ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలివే..

ఏపీ డిజిటల్‌ హెల్త్‌పై సీఎం సమీక్ష
హెల్త్‌ కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్‌ (QR) కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం తెలిపారు. ఆరోగ్య పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలని పేర్కొన్నారు. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలని సూచించారు. 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలని తెలిపారు. 

పౌరులందరికీ హెల్త్‌ ఐడీలు.. 
డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ హెల్త్‌ ఐడీలు క్రియేట్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై వివరాలను అందించారు. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 98.86 శాతంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 313 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. 11,997 సచివాలయాల్లో జీరో కేసులు నమోదైనట్లు చెప్పారు. థర్డ్ వేవ్‌కు సన్నద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 20,964 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేశామని.. ఇంకా 2,493 రావాల్సి ఉందని వివరించారు. 27,311 డి టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 140 ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. అక్టోబరు నెలాఖరు నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని వివరించారు. 

Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ

2.83 కోట్ల మందికి టీకాలు..
ఇప్పటివరకు 2,83,27,473 మంది కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 1,38,32,742 మంది సింగిల్‌ డోసు.. 1,44,94,731 మంది రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నట్లు వివరించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. 

Also Read: ఏపీ ఆర్జీయూకేటీ సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే.. టాప్ ర్యాంకర్లు వీరే..

Also Read: తప్పయింది.. ఇక ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయం ! హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రమాణపత్రం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
High Court: ఆ 106 మంది ఉద్యోగులకు ఊరట - విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఆ 106 మంది ఉద్యోగులకు ఊరట - విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
ITR 2024: ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?
ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?
Embed widget