అన్వేషించండి

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

ED Focus On KTR Formula E Case:తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఇ కేసు మరో మలుపు తిరిగేలా ఉంది. 55 కోట్ల రూపాయల విషయం నిగ్గు తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.

ED Focus On KTR Formula E Case: మాజీ మంత్రి కేటీఆర్‌పై  నమోదు అయిన ఫార్ములా ఇ కేసు చుట్టూ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇంత వరకు ఏసీబీ మాత్రం దీనిపై ఫోకస్డ్‌గా వర్క్ చేస్తుందని అంతా అనుకున్నారు. కాని ఇందులో 55 కోట్ల రూపాయల వ్యవహారం ఉన్నందున ఈడీ కూడా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కె.టిఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా ఇ రేస్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై కేటీఆర్ సహా ఇతరుల పాత్ర ఉందని అనుమానిస్తున్న ఈడీ కేసు నమోదు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుంచి ఫార్ములా E ఆపరేషన్స్ (FEO)కి కోట్లు బదిలీ చేశారని తేల్చినట్టు సమాచారం. ఇలా బదిలీ చేయడానికి సరైన అనుమతులు తీసుకోలేదని అంటున్నారు. ₹55 కోట్లను అనధికారికంగా బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

Also Read: తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

ఈ కేసులో కేటీఆర్‌ను ఎ-1గా పేర్కొంటూ ఇప్పటికే ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేసింది. దీని ఆధారంగానే ఈడీ కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ పేర్కొన్నట్టు ఇతర అధికారులపై కూడా ఈడీ దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. 

ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ నుంచి ఈడీ ఎఫ్‌ఐఆర్‌ కాపీ తీసుకోవడానికి ప్రక్రియ ప్రారంభించిందని తెలుస్తోంది. అనధికారికంగా ఈ కాపీని తీసుకున్న ఈడీ అధికారులు దీనిపై మంతనాలు చేస్తున్నారట. మొదట దీన్ని PMLA కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మరింత లోతుకు వెళ్లిన తర్వాత ఫెమా కింద కూడా కేసులు పెడతామంటున్నారట. 

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఇ రేస్‌ కోసం కేటీఆర్ ఆదేశాల మేరకు ₹55 కోట్లను అధికారులు బదిలీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా బదిలీ చేయడం చట్టవిరుద్దమని ACB FIRలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై అనుమాం వ్యక్తం చేసిన ఆ రేస్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జరిగిన ఈవెంట్‌లో నిధులు దుర్వినియోగం,  అక్రమాలపై విచారణకు ఆదేశించింది. 

తీవ్ర చర్చోచర్చలు ఆధారంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 12న కేటీఆర్, అరవింద్ కుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ప్రభుత్వ సీఎస్‌ ఆదేశం మేరకు, మున్సిపల్ శాఖ ఫిర్యాదుతో ఏసీబీ విచారణ చేపట్టింది. 

ఈ కేసు చాలా విచిత్రమైందని అన్న కేటీఆర్‌ న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటామని అంటున్నారు. ఇప్పటికే కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. ప్రజాసమస్యల నుంచి ప్రజలను దృష్టిని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు న్యాయస్థానంలో నిలబడదని అంటున్నారు కేటీఆర్. 

Also Read: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget