అన్వేషించండి

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు.

Telangana News: తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ భారతీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధరణి అక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ చట్టం పేరుతో చేసిన కబ్జాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఫోరెన్సిక్‌ విచారణ చేస్తున్నట్టు సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

లక్షన్నర కోట్ల విలువైన భూముల గోల్ మాల్ 

 ‘ధరణి’ (Dharani)పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1 లక్షా 50 వేల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారాయని  మంత్రి పొంగులేటి ఆరోపించారు. లిటిగేషన్‌లో ఉన్న భూములను పార్టీ-బీ‌ లో పెట్టి ఆ భూములను సక్రమం చేసుకున్నారని  దోచిన భూములను బీఆర్ఎస్  నేతలు తమ అస్మదీయులకు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేశారన్నారు.             

Also Read: తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

కొన్నిచోట్ల భూములకు యజమానులు ఇక్కడ లేరని .. దేశ విభజన సమయంలో పాకిస్తాన్  వెళ్లిపోయారని, అధికారులు నో అబ్జెక్షన్ అని  చెప్పారంటూ ఆ భూములను కూడా కాజేశారని పేర్కొన్నారు. ధరణి వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ముగ్గురు, నలుగురు వ్యక్తులు మీద మాత్రమే బదలాయింపు అయిందని ఆరోపించారు. ధరణి  పేరుతో నిరుపేదల ఆస్తులను కూడా కొల్లగొట్టారన్నారు.  

ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపు                

అలాగే ధరణి వల్ల సుమారు 25 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమయ్యాని ప్రభుత్వం భావిస్తోంది.  ఒక్క ఇబ్రహీంపట్నం పరిధిలోనే 10 వేల ఎకరాలు అన్యాక్రాంతం చేశారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అక్కడ ఎకరా రూ.10 కోట్ల విలువ ఉంటుందని న్యాక్రాంతమైన 25 వేల ఎకరాల భూముల మొత్తం విలువ రూ.2.50 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.                             

Also Read: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం

ప్రత్యేక సిట్ నియమించే అవకాశం                              

ధరణి మసుగులో జరిగిన భూ ఆక్రమనలన్నీ బయట పెడతామని, దీని వెనకాల ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తేలేదని ఇప్పటికే పలు సందర్భాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.  గత పదేళ్లలో చోటు చేసుకున్న భూ ఆక్రమణల మీద సమగ్ర విచారణ చేయడానికి సిట్‌   ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయలేదు కానీ రేపో మాపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
Embed widget