అన్వేషించండి

Heatwave deaths Telangana AP:అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు అగ్ని గోళంలా మారాడు. వడదెబ్బకు ఏపీ, తెలంగాణలో యాభై మందికిపైగా ప్రాణాలు గాలిలో కలిశాయి. రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బతో పదుల సంఖ్యలో మరణాలు, మే నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.
  • ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణలో 34 మంది మృతి, అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత.
  • ఎల్‌నినో, నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, ఎడారి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • రాబోయే నాలుగు రోజులు కీలకం, 18 జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

Heatwave deaths Telangana AP:తెలుగు రాష్ట్రాల్లో సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత 24 గంటల్లోనే వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో సూరీ ఊచకోత 

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఒక్క రోజు వడబెద్దకు 21 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా విజయవాడలోనే ఉన్నారు. ఇక్కడ పది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది యాచచకులే. రోడ్డు పక్కన, పార్కుల వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు.  ఇక ఏలూరులో ముగ్గురు, కాకినాడలో ముగ్గురు, పల్నాడులో ఇద్దరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

తెలంగాణ నిప్పుల కొలిమి

తెలంగాణలో ఎండల తీవ్రత మరింత భీకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వడ దెబ్బతో 34మంది మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవైకిపైగా జిల్లాల్లో 46 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కుమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 

ఎందుకు ఈ పరిస్థితి

ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎండలు కేవలం వేసవి ప్రభావం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో వేడి పెరగడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో వడగాలుల సంఖ్య, వాటి వ్యవధి పెరుగుతోంది. నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. 

మీ గుండె భద్రం

రాజస్థాన్, పంజాబ్ ఎడారి ప్రాంతాల నుంచి వీస్తున్న పొడి వేడి గాలుల మధ్య భారతంతోపాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా రాత్రి పూట చల్లబడాల్సిన వాతావరణం, ప్రస్తుతం 24-30 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ఇది మానవుల గుండపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. 

మరో నాలుగు రోజులు ఇదే తంతు

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. అందుకే తెలంగాణలోని 18 జిల్లాలు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. 

ఎండల వల్ల కేవలం ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతకు రోడ్డుపై వెళ్తున్న స్కూటీ మంటల్లో చిక్కుకుంది. జనగామా జిల్లాలో ఎండల వల్ల పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ధాన్యం కుప్పలు బూడిద అయ్యాయి. ఎండల వల్ల ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రిడ్‌ డిమాండ్ రికార్డు స్థాయిలో 15, 016 మెగావాట్లకు చేరింది. 

ప్రకృతి వైపరిత్యాలు మన చేతల్లో లేకపోయినా, అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని తగ్గించవ చ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.  

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బతో ఎన్ని మరణాలు సంభవించాయి?

గత 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది, తెలంగాణలో 34 మంది మరణించినట్లు తెలుస్తోంది.

ఏ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి?

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

నగరాల్లో ఉష్ణోగ్రతలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి?

నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది.

రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది?

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. తెలంగాణలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరవచ్చు.

ఈ తీవ్రమైన ఎండల సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Highways News: నేషనల్ హైవేలపై రాత్రి పూట లైట్లు ఎందుకు ఉండవు.. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ  క్లారిటీ ఇదే !
నేషనల్ హైవేలపై రాత్రి పూట లైట్లు ఎందుకు ఉండవు.. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ  క్లారిటీ ఇదే !
Best 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుండి అల్కాజార్ వరకు.. అధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే
మారుతి ఎర్టిగా నుండి అల్కాజార్ వరకు.. అధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
TG Inter Supply Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్స్
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్స్
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
TMC Congress Merger: కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం ప్రచారం - ఫైటర్ దీదీ అంత త్వరగా చేతులెత్తేస్తారా?
కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం ప్రచారం - ఫైటర్ దీదీ అంత త్వరగా చేతులెత్తేస్తారా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. ఎస్ఎంఎస్1లో ల్యాడిల్‌ నుంచి పడిపోయిన ఉక్కు ద్రవం
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. ఎస్ఎంఎస్1లో ల్యాడిల్‌ నుంచి పడిపోయిన ఉక్కు ద్రవం
Embed widget