అన్వేషించండి

Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!

Telangana Temperature Records: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎండ తీవ్రతో అగ్నిగుండంలా మారింది. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా  45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో తీవ్రమైన ఎండలు, పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.
  • వడదెబ్బతో రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
  • వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
  • ఎండల తీవ్రతతో పాటు కొన్ని చోట్ల అకాల వర్షాలు కూడా కురిశాయి.

IMD Heatwave Warning to Telangana: తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు చేసింది. 

అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ 

రాష్ట్రంలో మంగళవారం నాటి వాతావరణ గణాంకాలు భయం గొల్పుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఐలాపూర్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత చాలా ముందుగానే పెరిగింది. 2025 మే 19న రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలు ఉండగా, ఈ ఏడాది అదే సమయానికి 45.9 డిగ్రీలకు చేరుకోవడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. 

నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మార్కును దాటేశాయి. హైదరాబాద్‌లో వేడి తీవ్రం 43 డిగ్రీలుగా నమోదు అయ్యింది. 

ఎండలకు నలుగురు బలి 

తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంగళవారం వడ దెబ్బకు గురైన నలుగురు వ్యక్తులు మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన రాచర్ల రాజు అనే రైతు మరణించాడు. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ మండలం అంతారానికి చెందిన శామ్యూల్ అనే కార్మికుడు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన లచ్చు అనే వృద్ధురాలు, శాంతినగర్‌కు చెందిన బిరుదుల కిరణ్ కుమార్ వడదెబ్బకు ప్రాణాలు వదిలేశారు. 

గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడం ఈ తీవ్రమైన వేడికి ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ 50 శాతం లోపు మాత్రమే ఉంటోంది. సాధారణంగా రాత్రివేళల్లో వచ్చే చల్లని గాలులు కూడా ఇప్పుడు వీయకపోవడం వల్ల రాత్రిపూట కూడా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. 

రెడ్ అలర్ట్ జిల్లాల జాబితా ఇదే 

రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉండటంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావడం ప్రాణాపాయమని అధికారులు హెచ్చరించారు. 

ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. భారీగా వీచిన గాలులు కారణంగా చెట్లు విరిగిపడం, ఇళ్ల రేకులు ఎగిరిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం పంట నష్టం కూడా జరిగింది. 

రానున్న 3-4 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అందుకే ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ క్షేమంగా ఉండాలని సూచిస్తున్నారు.  

Frequently Asked Questions

తెలంగాణలో ప్రస్తుత ఎండల తీవ్రత ఎలా ఉంది?

తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలు దాటింది.

ఎండల కారణంగా ఎంతమంది మరణించారు?

తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు వడదెబ్బతో మరణించారు. వీరిలో ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక వృద్ధురాలు, ఒక యువకుడు ఉన్నారు.

గాలిలో తేమ శాతం ఎంత ఉంది?

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ శాతం 50 శాతం లోపు మాత్రమే ఉంది. ఇది తీవ్రమైన వేడికి ఒక ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

వాతావరణ కేంద్రం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది?

ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది.

ఎండల తీవ్రత ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది?

రానున్న 3-4 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
Embed widget