అన్వేషించండి

Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!

Telangana Temperature Records: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎండ తీవ్రతో అగ్నిగుండంలా మారింది. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా  45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో తీవ్రమైన ఎండలు, పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.
  • వడదెబ్బతో రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
  • వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
  • ఎండల తీవ్రతతో పాటు కొన్ని చోట్ల అకాల వర్షాలు కూడా కురిశాయి.

IMD Heatwave Warning to Telangana: తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు చేసింది. 

అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ 

రాష్ట్రంలో మంగళవారం నాటి వాతావరణ గణాంకాలు భయం గొల్పుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఐలాపూర్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత చాలా ముందుగానే పెరిగింది. 2025 మే 19న రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలు ఉండగా, ఈ ఏడాది అదే సమయానికి 45.9 డిగ్రీలకు చేరుకోవడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. 

నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మార్కును దాటేశాయి. హైదరాబాద్‌లో వేడి తీవ్రం 43 డిగ్రీలుగా నమోదు అయ్యింది. 

ఎండలకు నలుగురు బలి 

తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంగళవారం వడ దెబ్బకు గురైన నలుగురు వ్యక్తులు మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన రాచర్ల రాజు అనే రైతు మరణించాడు. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ మండలం అంతారానికి చెందిన శామ్యూల్ అనే కార్మికుడు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన లచ్చు అనే వృద్ధురాలు, శాంతినగర్‌కు చెందిన బిరుదుల కిరణ్ కుమార్ వడదెబ్బకు ప్రాణాలు వదిలేశారు. 

గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడం ఈ తీవ్రమైన వేడికి ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ 50 శాతం లోపు మాత్రమే ఉంటోంది. సాధారణంగా రాత్రివేళల్లో వచ్చే చల్లని గాలులు కూడా ఇప్పుడు వీయకపోవడం వల్ల రాత్రిపూట కూడా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. 

రెడ్ అలర్ట్ జిల్లాల జాబితా ఇదే 

రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉండటంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావడం ప్రాణాపాయమని అధికారులు హెచ్చరించారు. 

ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. భారీగా వీచిన గాలులు కారణంగా చెట్లు విరిగిపడం, ఇళ్ల రేకులు ఎగిరిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం పంట నష్టం కూడా జరిగింది. 

రానున్న 3-4 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అందుకే ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ క్షేమంగా ఉండాలని సూచిస్తున్నారు.  

Frequently Asked Questions

తెలంగాణలో ప్రస్తుత ఎండల తీవ్రత ఎలా ఉంది?

తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలు దాటింది.

ఎండల కారణంగా ఎంతమంది మరణించారు?

తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు వడదెబ్బతో మరణించారు. వీరిలో ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక వృద్ధురాలు, ఒక యువకుడు ఉన్నారు.

గాలిలో తేమ శాతం ఎంత ఉంది?

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ శాతం 50 శాతం లోపు మాత్రమే ఉంది. ఇది తీవ్రమైన వేడికి ఒక ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

వాతావరణ కేంద్రం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది?

ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది.

ఎండల తీవ్రత ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది?

రానున్న 3-4 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
TG 20 Tournament Controversy:విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
Revanth Reddy Letter to Kishan Reddy: ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
Kishan Reddy Letter To Revanth Reddy: సింగరేణిలో రూ. 1600 కోట్ల బొగ్గు మాయం? సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖపై దుమారం !
సింగరేణిలో రూ. 1600 కోట్ల బొగ్గు మాయం? సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖపై దుమారం !
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
TG 20 Tournament Controversy:విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
Sai Krishna Missing Case:
"కొడుకు శవాన్ని అయినా చూపించండి" సాయికృష్ణ తల్లి వేడుకోలు! తీవ్ర ఒత్తిడి రావడంతో ప్రభుత్వం కీలక చర్యలు!
Neno Butterfly Song: విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
US Indo Pacific Command Name Change: ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్‌లో పీఓకే పాకిస్థాన్‌దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్‌లో పీఓకే పాకిస్థాన్‌దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
Embed widget