అన్వేషించండి

Andhra News: జనవరి 4 నుంచి 'జయహో బీసీ' - బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామన్న నారా లోకేశ్

Nara Lokesh: వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

Nara Lokesh Comments on Jayaho BC Meet: రాష్ట్రంలో జనవరి 4 నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఈ కార్యక్రమ వివరాలను శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో వెల్లడించారు. సీఎం జగన్ (CM Jagan) బీసీల ద్రోహి అని, వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలపై వారిలో చైతన్యం కల్పించేందుకే ఈ కార్యక్రమం అని చెప్పారు. 2 నెలల పాటు 'జయహో బీసీ' (Jayaho BC) కొనసాగుతుందని, తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీసీలకు అవసరమైన ఇన్ పుట్ సబ్సిడీ, వారికి అనుకూల విధానాలు రూపొందిస్తామన్నారు.
Andhra News: జనవరి 4 నుంచి 'జయహో బీసీ' - బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామన్న నారా లోకేశ్

వైసీపీ హయాంలో బీసీలకు ఇబ్బందులే

వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు నారా లోకేశ్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించడంతో 16 వేల మంది బీసీలకు అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. 8 వేల ఎకరాల బీసీల అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుందని, 'ఆదరణ' పథకాన్ని రద్దు చేసిందని అన్నారు. పాదయాత్రలో 'ఆదరణ' పథకం ద్వారా పనిముట్లు అందలేదని పలువురు తన దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పినా, నిధులు విధుల్లేవని ఎద్దేవా చేశారు. జీవో 117 ద్వారా ప్రభుత్వం మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టిందని విమర్శించారు. పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. బీసీల కోసం పోరాడుతున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడులపై అక్రమ కేసులు పెట్టారని, ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్యను చంపేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దుకాణం ధ్వంసం చేశారని శ్రీకాళహస్తి పర్యటనలో ఓ మహిళ చెప్పిందని తెలిపారు.

బీసీలకు ప్రత్యేక నిధి

బీసీలు బలహీనులు కాదు, బలవంతులన్నదే టీడీపీ నినాదమని నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు. ఇప్పటికే మినీ మేనిఫెస్టోలో బీసీలకు రక్షణ చట్టం పేరిట ప్రాధాన్యమిచ్చామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం అందిస్తామని హామీ ఇచ్చారు. బీసీ ఉపకులాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి  వారికే ఖర్చు చేస్తామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించే వర్క్ షాప్ ద్వారా 'జయహో బీసీ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు వెళ్తామని పేర్కొన్నారు.

Also Read: YSRCP Leaders on Jagan: వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి-వైసీపీలో పెరుగుతున్న అసంతృప్త స్వరాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Supreme Court: ఏఐతో పిటిషన్ రాసుకొచ్చి సుప్రీంకోర్టులోనే అభాసుపాలయ్యాడు - ఈ స్వెట్టర్ వ్యాపారి ఇలా తెల్లారింది !
ఏఐతో పిటిషన్ రాసుకొచ్చి సుప్రీంకోర్టులోనే అభాసుపాలయ్యాడు - ఈ స్వెట్టర్ వ్యాపారి ఇలా తెల్లారింది !
ఈ బైక్‌ మీ దగ్గర ఉంటే సేఫ్టీ మీ చుట్టూ ఉన్నట్లే! - అత్యంత చవకైన Dual Channel ABS బైకులు
డ్యూయల్ ఛానల్ ABS ఉన్న చవకైన బైకులు ఇవే - రూ.1.05 లక్షల నుంచే అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్
First Passive Euthanasia: హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు
హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పర్మిషన్.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget