అన్వేషించండి

Quad Summit in India: భారత్‌లో క్వాడ్‌ సమ్మిట్‌పై భారీ అంచనాలు, ప్రధాని మోదీ గట్టిగానే ప్లాన్ చేశారా?

Quad Summit in India: వచ్చే ఏడాది భారత్‌లోనే క్వాడ్ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది.

Quad Summit in India: 


వచ్చే ఏడాది భారత్‌లోనే క్వాడ్ 

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. హిరోషిమాలో జరుగుతున్న G7 సదస్సుకి (G7 Summit)కి హాజరయ్యారు. జపాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతరత్రా అంతర్జాతీయ సవాళ్లపై పలు దేశాల అధినేతలతో చర్చించారు. ఈ సమయంలోనే ఓ కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆరు దేశాల అధినేతలతో చర్చించిన ఆయన G-20తో పాటు క్వాడ్ (QUAD) గురించీ ప్రస్తావించారు. వచ్చే ఏడాది క్వాడ్ సమ్మిట్ (Quad Summit in India) భారత్‌లోనే జరుగుతుందని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ ఈ సదస్సు జరగనుంది. క్వాడ్‌ దేశాల అధినేతలంతా ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇప్పటికే G-20 సదస్సుకి భారత్ అధ్యక్షత వహించేందుకు సిద్ధమవుతోంది. తరవాత క్వాడ్ సమావేశమూ భారత్‌లోనే జరగనుండటం కీలకంగా మారింది. అంతర్జాతీయంగా భారత్‌కున్న చరిష్మా మరింత పెరగనుంది. అయితే...ఈ క్వాడ్ సమావేశంతో ప్రపంచ దేశాలకు భారత్ ఏ సందేశం ఇవ్వనుంది..? దీనిపై కొందరు నిపుణులు ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించారు. ఇంటర్నేషనల్‌గా ఇంపాక్ట్ ఉంటుందని తేల్చి చెబుతున్నారు. G20 సమ్మిట్‌తోనే ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడిందని, భారత్‌పై ఇప్పటి వరకూ వాళ్లకున్న ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

శాంతి సందేశమిస్తారా? 

అయితే...ఈ క్వాడ్ సమ్మిట్‌లో భారత్‌ "శాంతి సందేశం" వినిపిస్తుందని అంచనా వేస్తున్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే.. శాంతియుత వాతావరణం చాలా కీలకమన్న విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ ఇదే వాణి వినిపించారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే...ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గంలోనే నడవాలన్న సందేశం వినిపించాలని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో చైనాకి కూడా గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే సరిహద్దు వివాదం విషయంలో పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది డ్రాగన్. ఒక్క భారత్‌నే కాదు. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రునెయి..ఈ అన్ని దేశాలతోనూ కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఇది తొలగిపోవాలంటే శాంతియుత చర్చలు అవసరం. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్న సందేశాన్ని భారత్ ఇచ్చే అవకాశముంది. దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమవుతుందని...అందుకు అన్ని దేశాలూ ముందుకు రావాలని పిలుపునివ్వనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే...ఉద్దేశపూర్వకంగా చైనాతో కయ్యానికి దిగాలని మాత్రం భారత్ అనుకోవడం లేదు. క్వాడ్ సమ్మిట్‌లో ఈ సరిహద్దు వివాదాలతో పాటు విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులపైనా చర్చించనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget