అన్వేషించండి

BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్

Telangana Latest News: కారణాలు ఏవైనా, వ్యూహం ఏదైనా రాజకీయ పార్టీ పరీక్ష ఎదుర్కోనేది ఎన్నికల్లోనే. అలాంటి పరీక్షను బీఆర్‌ఎస్ రాయకపోవడం విస్మయం కలిగిస్తోంది. అది భయంతోనా, లేక వ్యూహమా?

Telangana Latest News: గత రెండు దశాబ్ధాలుగా తెలంగాణలో రాజకీయాలను శాసించిన పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ అధినేత కేసీఆర్. గత ఎన్నికల ఫలితాల నుంచి మౌన వ్రతంలో ఉన్నారు కేసీఆర్. ఫిబ్రవరి, మార్చి నెలలో పెద్ద ఎత్తన కార్యక్రమాలు, బహిరంగ సభలతో కేసీఆర్ తన పాత రాజకీయాలను గుర్తు చేస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధాయ్య, పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నరోత్తం రెడ్డి, కరీంనగర్ - మెదక్ - నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్కా కొమరయ్య,  పట్టభద్రుల నియోజకవర్గానికి సి. అంజిరెడ్డిని బీజేపీ నిలబెట్టింది. కాంగ్రెస్ నుంచి కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి. నరేందర్ రెడ్డిని నిలబెట్టింది. వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎవర్నీ కాంగ్రెస్ బలపరచలేదు. బీఆర్ఎస్ మాత్రం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో రెండు జాతీయ పార్టీల నాయకులు- కార్యకర్తలు కోలహాలంగా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు.

భయమా - వ్యూహమా..కారణాలేంటి.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తే ఓడిపోతామన్న భయంతో ప్రకటించ లేదా లేక ఇప్పుడు ఓడిపోతే ఆ ఓటమి ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్న అనే ఆలోచన అనే చర్చ జరుగుతోంది. అయితే రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మాత్రం పోటీ చేయకపోవడం పట్ల గులాబీ పార్టీని ఎద్దేవా చేస్తున్నాయి. దీంతో గులాబీ కార్యకర్తలు డీలా పడుతున్నారు. 

మొదటి కారణం - ఓటర్లైన నిరుద్యోగులు - పట్టభద్రుల నియోజకవర్గంలో కీలమైన ఓటర్లు నిరుద్యోగులు. చదువుకుని నిరుద్యోగంతో ఉన్న వారు ఇంకా తమపై కోపంతో ఉన్నారా అన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో తాము నిరుద్యోగుల విషయంలో ఏం చేయలేదన్న ఆలోచనతో తమకు వారు ఓటు వేయలేదన్న విశ్లేషణలో కారు పార్టీ ఉంది. ఇప్పటికిప్పుడే వారికి తమపై కోపం పోయే అవకాశం లేదని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అభ్యర్థిని ప్రకటించి ఓడిపోతే ఆ ప్రభావం పార్టీపై మరోసారి పడే అవకాశం ఉంటుంది. దీన్ని కాంగ్రెస్, బీజేపీ ఉపయోగించుకొని బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్న ప్రచారం చేసే అవకాశం ఉంది. అలాంటి ఛాన్స్‌ రెండు పార్టీలకు ఇచ్చినట్లు అవుతుందన్న భావన ఆ పార్టీలో వ్యక్తం అవుతుంది. ఇది క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేయడమే కాకుండా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపెడుతుందేమో అన్న ఆలోచనతోనే కేసీఆర్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు?

రెండో కారణం.  ఉపాధ్యాయులు - తమ హయాంలో ప్రమోషన్లు,  బదిలీలు, ఇంక్రిమెంట్ల విషయంలో ఉపాధ్యాయులు కొంత ఆగ్రహంతో ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎన్నికలు పార్టీ జెండా, ఎజెండా మీద జరగేవి కావు కాబట్టి ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడం, ఏ ఉపాధ్యాయ అభ్యర్థికి మద్ధతు ప్రకటించకపోవడం మేలన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. 

మూడో కారణం - ఈ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య- ఈ ఎన్నికల్లో కేవలం పట్టభద్రులు, ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొంటారు. వీరి ఎన్నిక ప్రభావం పరిమితం. గెలిచినా, ఓడినా అది ప్రజాభిప్రాయంగా స్వీకరించలేని పరిస్థితి రాజకీయ పార్టీలది. సాధారణ ఎన్నికల్లోను, స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొంటారు. ఆ అభిప్రాయమే ప్రజాభిప్రాయంగా కేసీఆర్ భావిస్తున్నారని, గ్రౌండ్ లెవల్‌లో ప్రభుత్వంపై ప్రజలు ఏ ఆలోచనతో ఉన్నారో స్పష్టంగా తెలిసేది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే. ఆ దిశగా క్యాడర్ ముందుకు సాగాలని అంతర్గతంగా సూచించినట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.  

Also Read: స్కూల్‌కు వెళ్లడానికి మొండికేసిన విద్యార్థి- ఆరా తీస్తే ఏడుగురు స్టూడెంట్స్‌ సస్పెండ్ అయ్యారు, ప్రిన్సిపాల్‌ ఉద్యోగం పోయింది!

పై మూడు కారణాల వల్లే ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే పార్టీలో ఆశావాహుల్లోను, క్యాడర్‌లోను కొంత నిస్తేజం అలుముకుంది. పార్టీలో రాజకీయంగా ఎదిగే అవకాశం కోల్పోతున్నామని ఎన్నికల్లో నిలబడాలన్న కోరికతో ఉన్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 25 ఏళ్ల పాటు పలు ఎన్నికల్లో పాల్గొని, పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడుఈ ఎన్నికల్లో ఓటమి భయంతో ఉండటం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ జోష్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే, తాము రోడ్లపైకి వచ్చి ఓ గులాబీ జెండా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని క్యాడర్ నిరాశ వ్యక్తం చేస్తోంది. కారణాలు ఏవైనా, వ్యూహం ఏదైనా రాజకీయ పార్టీ పరీక్ష ఎదుర్కోనేది ఎన్నికల్లోనే. అలాంటి ఎన్నికలకు దూరంగా ఉండటం మాత్రం ఆసక్తికరం.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget