News
News
X

Bengaluru-Mysuru Highway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన ప్రధాని మోదీ, మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన

Bengaluru-Mysuru Highway: ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించారు.

FOLLOW US: 
Share:

Bengaluru-Mysuru Highway: 

బెంగళూరు - మైసూరు హైవే ప్రారంభం..

కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మండ్యలోని బెంగళూరు - మైసూరు హైవేను ప్రారంభించారు. దీంతో పాటు మరి కొన్ని రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 118 కిలోమీటర్ల బెంగళూరు-మైసూరు రోడ్‌ నిర్మాణం కోసం కేంద్రం రూ.8,480 కోట్లు ఖర్చు చేసింది. గతంలో బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాలంటే కనీసం 3 గంటల సమయం పట్టేది. ఈ హైవేతో ఆ ప్రయాణ సమయం 75 నిముషాలకు తగ్గిపోనుంది. అంతే కాదు. మండ్య ప్రాంతంలోని అభివృద్ధిలోనూ ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ రోడ్‌ను ప్రారంభించిన తరవాత మైసూరు-కుశాల్‌నగర్‌ 4 లేన్ హైవే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 92 కిలోమీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణం కోసం రూ.4,130 ఖర్చవుతుందని అంచనా. ప్రయాణ సమయం కూడా 5 గంటల నుంచి 2.5గంటలకు తగ్గిపోనుంది. ఇది పూర్తైతే... బెంగళూరు,  కుశాల్‌నగర్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ హైవేను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. 

"కొన్ని రోజుల క్రితం బెంగళూరు మైసూరు హైవే ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. ఈ అభివృద్ధిని చూసి యువత ఎంతో గర్విస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులన్నీ మన దేశ పురోగతికి బాటలు వేస్తాయి."

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇదే సమయంలో బెంగళూరు గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని. మైసూరు, బెంగళూరుకున్న ప్రాధాన్యతలేంటో వివరించారు. 

"కర్ణాటకలో బెంగళూరు, మైసూరు కీలకమైన నగరాలు. బెంగళూరు టెక్నాలజీకి పేరు గాంచింది. మైసూరు సాంస్కృతిక పరంగా ఎంతో ప్రాముఖ్యం చెందింది. ఇలాంటి రెండు ముఖ్యమైన నగరాల మధ్య కనెక్టివిటీ పెంచడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది."

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. ఆ పార్టీ ప్రజల్ని దోచుకుందని మండి పడ్డారు. అభివృద్ధి ఊసే పట్టించుకోలేదని అన్నారు. 

"2014కి ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పేద ప్రజలకు ఎలాంటి న్యాయమూ చేయలేకపోయింది. పైగా వాళ్ల నుంచే డబ్బులు దోచుకుంది" 

- ప్రధాని నరేంద్ర మోదీ
 

Published at : 12 Mar 2023 01:36 PM (IST) Tags: PM Modi Karnataka Karnataka Elections Bengaluru-Mysuru Highway Bengaluru-Mysuru

సంబంధిత కథనాలు

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్