అన్వేషించండి

Bengaluru-Mysuru Highway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన ప్రధాని మోదీ, మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన

Bengaluru-Mysuru Highway: ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించారు.

Bengaluru-Mysuru Highway: 

బెంగళూరు - మైసూరు హైవే ప్రారంభం..

కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మండ్యలోని బెంగళూరు - మైసూరు హైవేను ప్రారంభించారు. దీంతో పాటు మరి కొన్ని రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 118 కిలోమీటర్ల బెంగళూరు-మైసూరు రోడ్‌ నిర్మాణం కోసం కేంద్రం రూ.8,480 కోట్లు ఖర్చు చేసింది. గతంలో బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాలంటే కనీసం 3 గంటల సమయం పట్టేది. ఈ హైవేతో ఆ ప్రయాణ సమయం 75 నిముషాలకు తగ్గిపోనుంది. అంతే కాదు. మండ్య ప్రాంతంలోని అభివృద్ధిలోనూ ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ రోడ్‌ను ప్రారంభించిన తరవాత మైసూరు-కుశాల్‌నగర్‌ 4 లేన్ హైవే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 92 కిలోమీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణం కోసం రూ.4,130 ఖర్చవుతుందని అంచనా. ప్రయాణ సమయం కూడా 5 గంటల నుంచి 2.5గంటలకు తగ్గిపోనుంది. ఇది పూర్తైతే... బెంగళూరు,  కుశాల్‌నగర్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ హైవేను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. 

"కొన్ని రోజుల క్రితం బెంగళూరు మైసూరు హైవే ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. ఈ అభివృద్ధిని చూసి యువత ఎంతో గర్విస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులన్నీ మన దేశ పురోగతికి బాటలు వేస్తాయి."

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇదే సమయంలో బెంగళూరు గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని. మైసూరు, బెంగళూరుకున్న ప్రాధాన్యతలేంటో వివరించారు. 

"కర్ణాటకలో బెంగళూరు, మైసూరు కీలకమైన నగరాలు. బెంగళూరు టెక్నాలజీకి పేరు గాంచింది. మైసూరు సాంస్కృతిక పరంగా ఎంతో ప్రాముఖ్యం చెందింది. ఇలాంటి రెండు ముఖ్యమైన నగరాల మధ్య కనెక్టివిటీ పెంచడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది."

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. ఆ పార్టీ ప్రజల్ని దోచుకుందని మండి పడ్డారు. అభివృద్ధి ఊసే పట్టించుకోలేదని అన్నారు. 

"2014కి ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పేద ప్రజలకు ఎలాంటి న్యాయమూ చేయలేకపోయింది. పైగా వాళ్ల నుంచే డబ్బులు దోచుకుంది" 

- ప్రధాని నరేంద్ర మోదీ
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
Chandrababu: ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
Embed widget