అన్వేషించండి

PM Modi: మాకు 400 సీట్లు పక్కాగా వస్తాయ్, మా కాన్ఫిడెన్స్ అదే - ప్రధాని కీలక వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో తమదే పైచేయి అని ప్రజలకు తమపై నమ్మకముందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

PM Modi BJP's Majority: ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) 400 సీట్లు కచ్చితంగా సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి చరిత్ర సృష్టిస్తామని అంటున్నారు. తమ పదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాంటిదని, ప్రజలు తమకు తప్పకుండా ఈ మెజార్టీని అందిస్తారన్న నమ్మకముందనీ చెబుతున్నారు. మోదీకి ఎందుకంత కాన్ఫిడెన్స్..? 400 సీట్లు వస్తాయని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు..? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చారు ప్రధాని. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. 

"దేశ ప్రజలందరికీ మా ప్రభుత్వంపై గట్టి నమ్మకముంది. వాళ్ల బాధల్ని అర్థం చేసుకునే ప్రభుత్వం మాది. వాళ్లకి సముచిత గౌరవమిచ్చి వాళ్ల కలలను నెరవేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని ప్రజలకు అర్థమవుతోంది. అందుకే వాళ్లు మాకు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇస్తారని అంత ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ సారి ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి. మాదే పైచేయి. అయినా ఈ విషయం అందరికీ తెలిసిందే. వేగంగా పని చేయడం మా ప్రభుత్వ నైపుణ్యం. ఇది ఉన్నప్పుడు ఏమైనా సాధించొచ్చు అన్న నమ్మకం ఉంది " 

- ప్రధాని నరేంద్ర మోదీ

ప్రతిపక్షాల మాట ఇలా ఉంది..

ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తైంది. మరో మూడు విడతల్లో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనుంది. జూన్‌ 4వ తేదీన ఒకేసారి అన్ని ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ రోజు కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని అంటోంది బీజేపీ. అటు ప్రతిపక్షాలు మాత్రం బీజేపీకి మెజార్టీ రావడం కష్టమే అని ప్రచారం చేస్తున్నాయి. "మోదీ వేవ్ నాకెక్కడా కనిపించడం లేదే" అని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేస్తున్నారు. అటు రాహుల్ గాంధీ కూడా బీజేపీ మూడోసారి గెలవడం సాధ్యం కాదంటూ జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే మోదీ తాము మెజార్టీ సాధించి తీరతామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే...ఉత్తరాదిలో బీజేపీకి బలం ఉన్నప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఇంకా బలపడాల్సి ఉంది. బీజేపీ పెట్టుకున్న 400 లక్ష్యం నెరవేరాలంటే సౌత్‌లోనూ భారీగా ఓట్లు పోల్‌ అవ్వాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో కలిపి మొత్తం 130 ఎంపీ స్థానాలున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇందులో 29 సీట్లు సాధించింది బీజేపీ. అందులో 25 కర్ణాటక నుంచి కాగా...మిగతావి తెలంగాణలోవి. కేరళ, తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో ఖాతా కూడా తెరవలేకపోయింది. 

ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ధీమా..

ఇక మొత్తం సీట్ల విషయానికొస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు సాధించుకుంది బీజేపీ. ఇప్పుడు 370 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. NDA కూటమితో కలిసి మొత్తంగా 400 స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తామని అంటోంది. పదేళ్లలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని తేల్చి చెబుతోంది. ఇటీవలే అమిత్ షా కూడా ఇదే విషయం వెల్లడించారు. 

Also Read: Arvind Kejriwal: ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేపీ ఆఫీస్‌కి బయల్దేరిన కేజ్రీవాల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Israel-Iran War: ఒకే దాడిలో 48 మంది ఇరాన్ నేతలు మృతి, కొత్త నాయకత్వంతో చర్చలకు రెడీ: డొనాల్డ్ ట్రంప్
ఒకే దాడిలో 48 మంది ఇరాన్ నేతలు మృతి, కొత్త నాయకత్వంతో చర్చలకు రెడీ: డొనాల్డ్ ట్రంప్
Ind vs WI Highlights: సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget