అన్వేషించండి

PM Modi: మాకు 400 సీట్లు పక్కాగా వస్తాయ్, మా కాన్ఫిడెన్స్ అదే - ప్రధాని కీలక వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో తమదే పైచేయి అని ప్రజలకు తమపై నమ్మకముందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

PM Modi BJP's Majority: ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) 400 సీట్లు కచ్చితంగా సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి చరిత్ర సృష్టిస్తామని అంటున్నారు. తమ పదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాంటిదని, ప్రజలు తమకు తప్పకుండా ఈ మెజార్టీని అందిస్తారన్న నమ్మకముందనీ చెబుతున్నారు. మోదీకి ఎందుకంత కాన్ఫిడెన్స్..? 400 సీట్లు వస్తాయని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు..? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చారు ప్రధాని. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. 

"దేశ ప్రజలందరికీ మా ప్రభుత్వంపై గట్టి నమ్మకముంది. వాళ్ల బాధల్ని అర్థం చేసుకునే ప్రభుత్వం మాది. వాళ్లకి సముచిత గౌరవమిచ్చి వాళ్ల కలలను నెరవేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని ప్రజలకు అర్థమవుతోంది. అందుకే వాళ్లు మాకు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇస్తారని అంత ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ సారి ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి. మాదే పైచేయి. అయినా ఈ విషయం అందరికీ తెలిసిందే. వేగంగా పని చేయడం మా ప్రభుత్వ నైపుణ్యం. ఇది ఉన్నప్పుడు ఏమైనా సాధించొచ్చు అన్న నమ్మకం ఉంది " 

- ప్రధాని నరేంద్ర మోదీ

ప్రతిపక్షాల మాట ఇలా ఉంది..

ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తైంది. మరో మూడు విడతల్లో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనుంది. జూన్‌ 4వ తేదీన ఒకేసారి అన్ని ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ రోజు కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని అంటోంది బీజేపీ. అటు ప్రతిపక్షాలు మాత్రం బీజేపీకి మెజార్టీ రావడం కష్టమే అని ప్రచారం చేస్తున్నాయి. "మోదీ వేవ్ నాకెక్కడా కనిపించడం లేదే" అని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేస్తున్నారు. అటు రాహుల్ గాంధీ కూడా బీజేపీ మూడోసారి గెలవడం సాధ్యం కాదంటూ జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే మోదీ తాము మెజార్టీ సాధించి తీరతామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే...ఉత్తరాదిలో బీజేపీకి బలం ఉన్నప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఇంకా బలపడాల్సి ఉంది. బీజేపీ పెట్టుకున్న 400 లక్ష్యం నెరవేరాలంటే సౌత్‌లోనూ భారీగా ఓట్లు పోల్‌ అవ్వాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో కలిపి మొత్తం 130 ఎంపీ స్థానాలున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇందులో 29 సీట్లు సాధించింది బీజేపీ. అందులో 25 కర్ణాటక నుంచి కాగా...మిగతావి తెలంగాణలోవి. కేరళ, తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో ఖాతా కూడా తెరవలేకపోయింది. 

ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ధీమా..

ఇక మొత్తం సీట్ల విషయానికొస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు సాధించుకుంది బీజేపీ. ఇప్పుడు 370 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. NDA కూటమితో కలిసి మొత్తంగా 400 స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తామని అంటోంది. పదేళ్లలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని తేల్చి చెబుతోంది. ఇటీవలే అమిత్ షా కూడా ఇదే విషయం వెల్లడించారు. 

Also Read: Arvind Kejriwal: ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేపీ ఆఫీస్‌కి బయల్దేరిన కేజ్రీవాల్

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget