అన్వేషించండి

సస్పెన్షన్‌ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎంపీల భారీ ర్యాలీ, దేశ చరిత్రలో ఇదే తొలిసారి

Opposition MPs Rally: సస్పెన్షన్‌ని వ్యతిరేకిస్తూ 143 మంది ఎంపీలు పార్లమెంట్‌ నుంచి విజయ్ చౌక్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.

Opposition MPs March: 

ఎంపీల ర్యాలీ..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliament Winter Session) నుంచి దాదాపు 143 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. భద్రతా వైఫల్యం ఘటనపై చర్చకు డిమాండ్ చేసినందుకు ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్‌ని వ్యతిరేకిస్తూ...ప్రతిపక్ష ఎంపీలు భారీ ర్యాలీ (Opposition MP's Rally) నిర్వహించారు. పార్లమెంట్ హౌజ్ నుంచి విజయ్ చౌక్‌ వరకూ ర్యాలీ చేశారు. లోక్‌సభ నుంచి సస్పెండ్ అయిన 97 మంది, రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన 46 మంది ఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రంగా మండి పడ్డారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ, అమిత్‌ షా సభలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సభలో ఈ చర్చ తీసుకొచ్చిన ప్రతిసారీ అధికార పక్ష ఎంపీలు తమను అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు ర్యాలీ చేశారు. భారత దేశ చరిత్రలోనే ఇంత మంది ఎంపీలు ఇలా ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. 

"లోక్‌సభ, రాజ్యసభ స్పీకర్‌లకు మేం పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ అధికారపక్ష ఎంపీలు మాత్రం ఆ చర్చే జరగనివ్వడం లేదు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారు"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

143 మంది సస్పెండ్.. 

ఈ మాస్ సస్పెన్షన్‌పై I.N.D.I.A కూటమి నేతలు స్పందించారు. డిసెంబర్ 22న జంతర్ మంతర్‌ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు పిలుపునిచ్చారు. మొత్తం మూడు దశల్లో 143 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ హత్య చేసిందంటూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా మండి పడుతున్నారు. తమతో చర్చించకుండానే బిల్స్‌ని ప్రవేశపెట్టి ఆమోదిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం (Security Breach Parliament)ఘటనలో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ ఇంజనీర్‌ని అదుపులోకి తీసుకున్నారు. బగల్‌కోటేలోని ఆ టెక్కీ ఇంటికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు ఢిల్లీకి తరలించారు. అరెస్ట్ అయిన యువకుడు మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు కావడం మరింత సంచలనమవుతోంది. లోక్‌సభలో దాడి ఘటనలో ఈ యువకుడి హస్తమూ ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు.

Also Read: Anti Cold Drug: నాలుగేళ్ల లోపు చిన్నారుల జలుబు మందుపై నిషేధం, భారత్ సంచలన నిర్ణయం

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Top 10, 4 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 4 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
Breaking News: బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget