అన్వేషించండి

YSRTP : నిరుద్యోగులతో నామినేషన్లు - హుజురాబాద్‌పై షర్మిల పార్టీ కొత్త ప్లాన్ !

నిజామాబాద్‌లో పసుపు రైతుల తరహాలో హుజురాబాద్‌లో నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా కో-ఆర్డినేటర్‌ను నియమించారు.


హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా పడినా రాజకీయ పార్టీలు మాత్రం తమ వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే హుజురాబాద్‌ను రౌండప్ చేసేశారు. బీజేపీ నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇతర పార్టీలూ అదే పనిలో ఉన్నాయి. అయితే కొత్తగా తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్న పట్టదలతో ఉన్న వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మాత్రం పోటీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పోటీ చేయడం లేదన్న సంకేతాలను పంపారు. అయితే తాము పోటీ చేయకపోయినా నిరుద్యోగులతో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయించాలని నిర్ణయించారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్‌లో పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. వారి ఎన్నికల పోరాటం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. అదే తరహాలో షర్మిల హుజురాబాద్‌లో కొత్త పోరాటం ప్రారంభించారు. 

Also Read : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..?

ఇప్పటికే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికకు నిరుద్యోగుల‌తో భారీ ఎత్తున నామినేష‌న్లు వేయించాలని నిర్ణయించారు. ఇందు కోసం కోసం ప్రత్యేకంగా కో-ఆర్డినేట‌ర్‌ ను నియమింంచారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న భాస్కర్‌రెడ్డిని ష‌ర్మిల‌ నిరుద్యోగులతో నామినేషన్లు వేయించే కార్యక్రమానికి ఇంచార్జ్‌గా నియమించారు.  నిరుద్యోగులు భారీ ఎత్తున ఉపఎన్నిక బరిలో నిల‌వాలని షర్మిల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న సీఎం కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలన్నారు. నిరుద్యోగుల‌కు మ‌ద్దతుగా వైఎస్‌ఆర్‌టీపీ అండ‌గా ఉంటుందని భరోసా ఇచ్చారు. నామినేష‌న్ల ప్రక్రియ, స‌హాయ స‌హ‌కారాలు నిరుద్యోగులకు అందిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read : మహిళను చంపుతానని బెదిరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేయకపోయినా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంలో షర్మిల ఉన్నారు.  ఆ పోరాటానికి  నామినేషన్లు వేసే నిరుద్యోగులకు అండగా ఉండేలా ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుంటున్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్ల విడుద‌ల జాప్యాన్ని నిర‌సిస్తూ హుజురాబాద్‌ వ్యాప్తంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వంపై గట్టిగా పోరాడటం ద్వారానే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని షర్మిల పట్టుదలగా ఉన్నారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో పార్టీకి గట్టి పునాదులు ఉన్నాయని.. వాటిని ప్రజా పోరాటాల ద్వారా మరింత పటిష్టం  చేసుకోవాలని భావిస్తున్నారు. 

Also Read : కోమటిరెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలంటున్న నేతలు

ఉద్యోగ నియామకాల ప్రకటనను ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వెళ్తోంది. ఎప్పుడు ఉపఎన్నికలు జరిగినా యాభై వేల ఉద్యోగాల  భర్తీ అని చెబుతూంటారు. దుబ్బాక ఎన్నికలు ముగిసిపోయిప్పటి నుండి చెబుతున్నారు కానీ ఇంత వరకూ నోటిఫికేషన్లు రాలేదు. త్వరలో అనే ప్రకటన మాత్రం చేస్తున్నారు. నిరుద్యోగుల్లో ఉన్న ఈ ఆగ్రహాన్ని ప్రజాపోరాటాలుగా మార్చాలని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు పట్టుదలగా ఉన్నారు. 

Also Read : దళిత ఉద్యమంలోకి షర్మిల పార్టీ

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Retirement Plan: రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే
రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget