అన్వేషించండి

బెంగాల్‌లో NIA అధికారులపై మూకదాడి, కార్ అద్దం ధ్వంసం - ఒకరికి గాయాలు

NIA Officials Attacked: బెంగాల్‌లో సోదాలు చేసేందుకు వెళ్లిన NIA అధికారులపై కొందరు దాడి చేశారు.

NIA Officials Attacked in Bengal: యాంటీ టెర్రర్ ఏజెన్సీ NIA అధికారులు పశ్చిమ బెంగాల్‌లో 2022 నాటి భూపతినగర్‌ బాంబు పేలుళ్ల కేసులోని ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. మెదినిపూర్‌ జిల్లాలో సోదాలు నిర్వహించి వాళ్లని అరెస్ట్ చేశారు. అయితే...భూపతినగర్‌లో సోదాలు చేసేందుకు వచ్చిన NIA టీమ్‌పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అధికారి గాయపడ్డాడు. బాంబు పేలుడు కేసులో నిందితులైన బలాయ్ చరణ్, మనోబాత్రా జనాని కస్టడీలోకి తీసుకున్నారు. సోదాలు చేస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి కొందరు గుంపుగా వచ్చి దాడి చేశారు. NIA అధికారులు వచ్చిన వాహనంపైనా దాడి జరిగింది. కార్ ముందు అద్దం ధ్వంసమైంది. చుట్ట పక్కల ఉన్న కొన్ని వాహనాలూ ధ్వంసమయ్యాయి. అరెస్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుండగా కొందరు ఇలా దాడి చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే...ఈ ఘటనపై NIA అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. NIA వెల్లడించిన వివరాల ప్రకారం...కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు క్రూడ్ బాంబ్‌లు తయారు చేస్తున్నారు. మెదినిపూర్‌లో ఓ ఇంట్లో వీటిని నిల్వ ఉంచారు. 2022 డిసెంబర్‌లో ఒక్కసారిగా ఈ బాంబులు పేలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. డిసెంబర్ 3వ తేదీన పశ్చిమ బెంగాల్ పోలీస్‌లు ఈ ఘటనపై FIR నమోదు చేశారు.  Explosive Substances Act కింద మాత్రం కేసు నమోదు చేయలేదు. ఆ తరవాతే కోల్‌కత్తా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్నీ FIRలో చేర్చాలని ఆ పిటిషన్‌ కోర్టుని కోరింది. అంతే కాదు. ఈ కేసుని NIAకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని NIAకి బదిలీ చేశారు. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు అధికారులు. పక్కా సమాచారం అందుకుని మెదినిపూర్‌కి వచ్చి సోదాలు నిర్వహించారు. అప్పుడే ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. NIA అధికారులు బీజేపీ కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి వచ్చి సోదాలు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అసలు వాళ్లకి పోలీసులు అనుమతి ఉందా అంటూ మండి పడ్డారు. ఒక్కసారిగా ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వస్తే ఎవరైనా అలాగే స్పందిస్తారంటూ దాడి చేస్తారని తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు కావాలనే ఇలా అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో పోరాటం చేయడానికి ప్రపంచమంతా ఏకం కావాలని అసహనం వ్యక్తం చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget