అన్వేషించండి

బెంగాల్‌లో NIA అధికారులపై మూకదాడి, కార్ అద్దం ధ్వంసం - ఒకరికి గాయాలు

NIA Officials Attacked: బెంగాల్‌లో సోదాలు చేసేందుకు వెళ్లిన NIA అధికారులపై కొందరు దాడి చేశారు.

NIA Officials Attacked in Bengal: యాంటీ టెర్రర్ ఏజెన్సీ NIA అధికారులు పశ్చిమ బెంగాల్‌లో 2022 నాటి భూపతినగర్‌ బాంబు పేలుళ్ల కేసులోని ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. మెదినిపూర్‌ జిల్లాలో సోదాలు నిర్వహించి వాళ్లని అరెస్ట్ చేశారు. అయితే...భూపతినగర్‌లో సోదాలు చేసేందుకు వచ్చిన NIA టీమ్‌పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అధికారి గాయపడ్డాడు. బాంబు పేలుడు కేసులో నిందితులైన బలాయ్ చరణ్, మనోబాత్రా జనాని కస్టడీలోకి తీసుకున్నారు. సోదాలు చేస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి కొందరు గుంపుగా వచ్చి దాడి చేశారు. NIA అధికారులు వచ్చిన వాహనంపైనా దాడి జరిగింది. కార్ ముందు అద్దం ధ్వంసమైంది. చుట్ట పక్కల ఉన్న కొన్ని వాహనాలూ ధ్వంసమయ్యాయి. అరెస్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుండగా కొందరు ఇలా దాడి చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే...ఈ ఘటనపై NIA అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. NIA వెల్లడించిన వివరాల ప్రకారం...కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు క్రూడ్ బాంబ్‌లు తయారు చేస్తున్నారు. మెదినిపూర్‌లో ఓ ఇంట్లో వీటిని నిల్వ ఉంచారు. 2022 డిసెంబర్‌లో ఒక్కసారిగా ఈ బాంబులు పేలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. డిసెంబర్ 3వ తేదీన పశ్చిమ బెంగాల్ పోలీస్‌లు ఈ ఘటనపై FIR నమోదు చేశారు.  Explosive Substances Act కింద మాత్రం కేసు నమోదు చేయలేదు. ఆ తరవాతే కోల్‌కత్తా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్నీ FIRలో చేర్చాలని ఆ పిటిషన్‌ కోర్టుని కోరింది. అంతే కాదు. ఈ కేసుని NIAకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని NIAకి బదిలీ చేశారు. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు అధికారులు. పక్కా సమాచారం అందుకుని మెదినిపూర్‌కి వచ్చి సోదాలు నిర్వహించారు. అప్పుడే ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. NIA అధికారులు బీజేపీ కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి వచ్చి సోదాలు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అసలు వాళ్లకి పోలీసులు అనుమతి ఉందా అంటూ మండి పడ్డారు. ఒక్కసారిగా ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వస్తే ఎవరైనా అలాగే స్పందిస్తారంటూ దాడి చేస్తారని తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు కావాలనే ఇలా అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో పోరాటం చేయడానికి ప్రపంచమంతా ఏకం కావాలని అసహనం వ్యక్తం చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget