అన్వేషించండి

Rajyasabha Row : క్షమాపణలు చెప్పాల్సింది మీరే... ! రాజ్యసభ ఘటనలపై అధికార, విపక్షాల రాజకీయ రచ్చ..!

సాగు చట్టాలకు నిరసనగా రాజ్యసభలో కొంత మంది సభ్యులు బల్లలు ఎక్కి ఫైళ్లు విసిరేసి గందరోగళం సృష్టించారు. దీనికి మీరంటే మీరు కారణమని బీజేపీ, విపక్షాలు ఆరోపించుకుంటున్నాయి.

రాజ్యసభ  నిరవధిక వాయిదా పడక ముందు రాజ్యసభలో జరిగిన పరిణామాలపై  ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. సభలో జరిగిన ఘటనలపై బయట కూడా రాజకీయ వివాదం చోటు చేసుకుంటోంది. సాగుచట్టాలపై విపక్షాలు నిరసనలు చేపట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు కొందరు.. రాజ్యసభ చైర్మన్‌ స్థానం కింద పార్లమెంటరీ సిబ్బంది కూర్చునే బల్లలపైకి ఎక్కి, నల్లటి వస్త్రాలతో నిరసన తెలుపుతూ, ఫైళ్లు విసిరేసి తీవ్ర గందరగోళం సృష్టించారు.  కొందరు సభ్యులు బల్లలపై దాదాపు గంటన్నర పాటు తిష్ఠవేశారు. ఓ కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌ స్థానంపైకి ఫైల్‌ను విసిరేశారు. విపక్ష సభ్యులు తమ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  దేశ చరిత్రలో మదటి సారిగా రాజ్యసభలో సభ్యుల్ని శారీరకంగా కూడా దాడి చేశారని.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాధీ మండిపడ్డారు. 

 దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  పార్లమెంట్‌లో ఏవరేం చేశారో దేశం మొత్తం చూసిందని... ఈ ఘటనలపై బాధ్యత తీసుకుంటే.. తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా..  ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఛైర్మన్ కూడా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరాృతం కాకూడదన్నారు. కొందరు సభ్యులు టేబుల్స్ ఎక్కి.. గర్వంగా ఫీలయ్యారని.. వారేదో గొప్ప  పని చేసినట్లుగా ట్వీట్లు చేసుకున్నారని... ఇది చాలా తప్పని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సభ లోపు వీడియో షూట్ చేయడం తప్పన్నారు. ప్రజలంతా ఎంపీలు తమ సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్నారని.. కానీ ప్రతిపక్ పార్టీలు ఎజెండా ఆరాచకరం మాత్రమేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

 ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. మొసలి కన్నీళ్లు కార్చే బదులు, వారు దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..  మరో వైపు  ప్రభుత్వం పార్లమెంట్‌లో అప్రజాస్వామికంగా వ్యవహరించిందంటూ...  శరద్ పవార్ సహా ప్రతిపక్ష నేతలంతా ఉపరాష్ట్రపతిని కలిసి వినతిపత్రంఅందించారు.  రాజ్యసభలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్‌లో చర్చలు జరగకుడా చేసి.. బిల్లులను ఏకపక్షంగా పాస్ చేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే మండిపడ్డారు. రాజ్యసభలో జరిగిన పరిణామాలు... పార్లమెంట్‌లో చీకటి రోజులుగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి బాధ్యత వారిదేనని అధికార పార్టీ విమర్శిస్తోంది.త మొత్తంగా రాజ్యసభలో జరిగిన పరిణామాలు మాత్రం దేశ ప్రజల్ని విస్మయ పరుస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget