అన్వేషించండి

Massive encounter in Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- 10 మంది మావోయిస్టుల మృతి - అగ్రనేతల హతం ?

Chattisgarh: చత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీ కీలక నేతలు హతమయ్యారు . మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ (CC) సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఉన్నట్లు గుర్తించారు.

Key Maoist party leaders killed:   ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మ జిల్లా గరియాబాద్ లో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టు లు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మనోజ్ కూడా అలియాస్ మొడెం బాలకృష్ణ తో పాటు ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు SZCM ప్రమోద్ అలియాస్ పాండు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. 10 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయాని గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. ఉదయం నుండి భద్రతా దళాలు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. థానా మెయిన్‌పూర్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గరియాబంద్ E30, STF, COBRA బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను మొదలుపట్టాయి. ఇప్పటివరకు 10 మృతదేహాలను ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనేది  అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు
  
గరియాబంద్ జిల్లా SP నిఖిల్ రఖేచా ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్ సెప్టెంబర్ 11, 2025 ఉదయం నుంచి మైన్‌పూర్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో జరిగింది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారని నిర్దిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఈ-30 యూనిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) యొక్క కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ సెప్టెంబర్ 10, 2025 రాత్రి నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 11 ఉదయం తీవ్రమైన కాల్పులతో ఉధృతమైంది.

"ఈ ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టులతో భీకర కాల్పులు జరిపాయి. ఇప్పటివరకు 10 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము,  పలు ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాము," అని  బలగాల ఉన్నతాధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో AK-47లు, ఇన్సాస్ రైఫిల్స్, SLRలు,  ఇతర ఆధునిక ఆయుధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.మావోయిస్టు సీనియర్ కమాండర్ మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఈ ప్రాంతంలో ఉన్నాడని నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. బాలకృష్ణ ఒక కీలక మావోయిస్టు నాయకుడిగా పరిగణించబడతాడు. అతని సమక్షంలో ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు ఊపందుకున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో అతనితో పాటు ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా మృతి చెందినట్లు అనధికారిక సమాచారం ఉంది, అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.                         
  
ఈ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడానికి భద్రతా బలగాలు చేస్తున్న ప్రయత్నంలో మరో ముందడుగు.  2025లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 225 మంది మావోయిస్టులు వివిధ ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి, ఇందులో బస్తర్ డివిజన్‌లో 208 మంది ఉన్నారు.                      

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump China Visit: అమెరికా, చైనా సూపర్ పవర్స్.. చైనా రెండో స్థానంలో ఉంటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా, చైనా సూపర్ పవర్స్.. చైనా రెండో స్థానంలో ఉంటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AIADMK Split: తమిళ విశ్వాస పరీక్ష - అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? విజయ్ వద్ద ప్లాన్ బీ ఉందా?
తమిళ విశ్వాస పరీక్ష - అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? విజయ్ వద్ద ప్లాన్ బీ ఉందా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Embed widget