అన్వేషించండి

Karnataka Maharashtra Row: సరిహద్దు సమస్య పరిష్కారానికి మహారాష్ట్ర మాస్టర్ ప్లాన్, త్వరలోనే ప్రత్యేక తీర్మానం

Karnataka Maharashtra Border: కర్ణాటకతో ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం ప్రవేశ పెట్టనుంది.

Karnataka Maharashtra Row:

వచ్చే వారం అసెంబ్లీలో తీర్మానం..

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఎన్నో రోజులుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఇప్పుడు మరోసారి ఆ చిచ్చు రేగింది. దాదాపు 15 రోజులుగా అక్కడ పోలీసుల పహారా పెరిగింది. ఈ క్రమంలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీలో ఓ ప్రతిపాదనను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయ్ దీనిపై స్పందించారు. వచ్చే వారం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ప్రవేశ పెట్టిన తీర్మానం కన్నా 10 రెట్లు మెరుగైన తీర్మానం తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆకాంక్షల్ని, ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని..మహారాష్ట్రకు ఒక్క ఇంచు భూమి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. పదేపదే మహారాష్ట్ర ప్రభుత్వమే సరిహద్దు వివాదాన్ని లేవనెత్తుతోందని విమర్శించింది. అయితే...ఈ నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం మండి పడింది. "ఇద్దరు ముఖ్య మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యాక కూడా కర్ణాటక అలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. మేం మాత్రం చర్చల ద్వారా సమస్యను
పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం" అని మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ స్పష్టం చేశారు. 

కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు..

నిజానికి మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇవాళే ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని భావించింది. కానీ...బీజేపీ ఎమ్మెల్యే ముక్త తిలక్ మృతితో ఇది వాయిదా పడింది. అందుకే...సోమవారం ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరాఠీ ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.  మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారింది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో జరిగిన నిరసనలు, ఆందోళనలు.. ఇప్పుడు దాడుల వరకు చేరాయి. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్ణాటకలో నిరసనకారులు ఇటీవల దాడులు చేశారు. స్సులపైకి రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. దీంతో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్టుమెంట్ ప్రకటించింది. అక్కడికి 
బస్సులను నడపడం శ్రేయస్కరం కాదని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించడంతో తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని తెలిపింది.

సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ఈ ఆందోళనకర పరిస్థితులకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కారణమని పవార్‌ ఆరోపించారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న కన్నడ, మరాఠి మాట్లాడే గ్రామాలు తమకే చెందినవంటూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలు ఇటీవల ప్రకటనలు చేశారు. దీంతో సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ బెళగావి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 
ఇదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలపై రాళ్లు రువ్వి దాడి చేయడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

Also Read: Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ అంటే ఏంటి? కరోనాపై ఎలా పని చేస్తుంది?

టాప్ హెడ్ లైన్స్

Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
ICC Dream Team: ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టీమ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా.. ఇండియా నుంచి కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కే చోటు.. ఆ తెలుగు స్టార్ ఎవ‌రంటే..?
ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టీమ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా.. ఇండియా నుంచి కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కే చోటు.. ఆ తెలుగు స్టార్ ఎవ‌రంటే..?
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Jharkhand Man Eats Two Snakes Alive:మద్యం మత్తులో వికృత చేష్ట! బతికున్న పామును పట్టుకుని కొరికి తినేసిన జార్ఖండ్ వ్యక్తి!- బతికాడా?
మద్యం మత్తులో వికృత చేష్ట! బతికున్న పామును పట్టుకుని కొరికి తినేసిన జార్ఖండ్ వ్యక్తి!- బతికాడా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget