అన్వేషించండి

Karnataka Assembly Elections 2023: ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర, సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ - కాల్‌ రికార్డింగ్ విడుదల

Karnataka Assembly Elections 2023: ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.

Karnataka Assembly Elections 2023: 


సుర్జేవాలా ఆరోపణలు..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. బీజేపీ ఆయనను హత్యకు స్కెచ్ వేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ని కూడా షేర్ చేసింది కాంగ్రెస్. ఖర్గేతో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని తేల్చి చెప్పింది. బీజేపీ నేత కాల్‌ రికార్డింగ్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. చిత్తాపూర్‌ బీజేపీ అభ్యర్థి హస్తం ఉందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని తట్టుకోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సుర్జేవాలా మండి పడ్డారు. 

"కన్నడ ప్రజలు కాంగ్రెస్‌ను ఎంతో అభిమానిస్తున్నారు. బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీకి ఓటు వేసే అవకాశాలే లేవు. ఇది చూసి బీజేపీ అసహనానికి గురవుతోంది. అందుకే మర్డర్‌ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది. ఓటమిని ఎదుర్కోలేక ఇంతగా దిగజారిపోతున్నారు"

- రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ సీనియర్ నేత 

ట్విటర్‌లో ఆడియో క్లిప్ పోస్ట్ చేసిన కాంగ్రెస్...చిత్తాపూర్ నియోజకవర్గ ప్రతినిధి మణికంఠ్ రాథోడ్ ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించింది. 

"చిత్తాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి మణికంఠ్ రాథోడ్ ఖర్గే హత్యకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ వ్యక్తిపై 40 క్రిమినల్ కేసులున్నాయి. ప్రధాని మోదీ, సీఎం బొమ్మై ఇద్దరూ కలిసి ఈ వ్యక్తిని హత్యకు పురమాయించారు. ఖర్గే కుటుంబాన్ని చంపేస్తాం అని ఎలా మాట్లాడుతున్నారో వినండి. 40% కమిషన్ ప్రభుత్వం ఇలా దిగజారిపోయింది. ఇది కేవలం ఖర్గేపై మాత్రమే చేసే దాడి కాదు. మొత్తం కన్నడ ప్రజలపై జరగనున్న దాడి"

- కాంగ్రెస్ 

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విషసర్పం అని, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. మరి కొద్ది రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో భాగంగా కలబుర్గిలో ఖర్గే మాట్లాడారు. ఆ సమయంలోనే ఇలా నోరు జారారు.బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ప్రధాని మోదీ గురించి మాట్లాడలేదని, కేవలం బీజేపీ ఐడియాలజీ గురించి మాత్రమే కామెంట్ చేశానని అన్నారు. వాళ్ల ఐడియాలజీ విషపూరితమైన పాము లాంటిదని, ముట్టుకుంటే కాటుకు గురి కాక తప్పదని అన్నట్టు వివరించారు. 

"ప్రధాని నరేంద్ర మోదీ ఓ విషసర్పం లాంటి వాడు. అది విషమా కాదా అని రుచి చూశారా..? ఇక అంతే. ఆ విషం ఎక్కి వెంటనే చచ్చిపోతారు" 

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

Also Read: Unemployment Rate: ఉద్యోగమో రామచంద్రా! ఏప్రిల్‌లో 8% దాటిన నిరుద్యోగిత రేటు

టాప్ హెడ్ లైన్స్

Supreme Court on CJP Protest: విద్యార్థుల నిరసనపై విచారణ జరపాలి, ఇప్పుడే చర్యలొద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
విద్యార్థుల నిరసనపై విచారణ జరపాలి, ఇప్పుడే చర్యలొద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Japan Earthquake:జపాన్‌ను వణికించిన 7.1 భూకంపం: సునామీ హెచ్చరికతో హైఅలర్ట్!
జపాన్‌ను వణికించిన భూకంపం, 7.1 తీవ్రతతో కంపించిన భూమి, సునామీ హెచ్చరిక జారీ  
PM Modi vs Mete: ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!
ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget