అన్వేషించండి

Vande Bharat Sleeper: చుక్క నీరు కింద పడలేదు, మొబైల్ కూడా కదల్లేదు - 180 కి.మీల వేగంతో దూసుకెళ్లిన వందేభారత్, వీడియో చూశారా?

Viral Video: మరికొన్ని నెలల్లోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 180 కి.మీ వేగంతో దూసుకెళ్లింది.

Vande Bharat Sleeper Trains Speed Trails: వందేభారత్ (Vande Bharat).. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది. తక్కువ టైంలో ఎక్కువ దూరం సకల సౌకర్యాలతో కూడిన రైలు ప్రయాణం. ఇప్పటివరకూ సీటింగ్‌లో వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టగా మంచి ప్రజాదరణ పొందాయి. ఈ క్రమంలోనే దేశంలో తొలిసారిగా వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గంటకు గరిష్ఠంగా 180 కి.మీల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vasishnaw) సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

చుక్క నీరు కింద పడలేదు

వందేభారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు 180 కి.మీల వేగంతో దూసుకెళ్లినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కిందపడలేదు. కనీసం పక్కన ఉన్న మొబైల్ కూడా కదల్లేదు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు ఈ పరీక్షలను రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో నిర్వహించారు.

క్రమక్రమంగా వేగం పెంచారు..

తొలుత జనవరి 1వ తేదీన రైలును 130 Kmph వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా, ఈ వేగాన్ని 180 Kmph కు పెంచారు. రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య రైలు దూసుకెళ్లింది. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. కాగా, వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని వెల్లడించారు.

మరికొన్ని నెలల్లోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉండనుండగా.. అందులో థర్ట్ ఏసీకి 10, సెకండ్ ఏసీకి 4, ఫస్ట్ ఏసీకి ఒక బోగీ కేటాయించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే, సీటింగ్‌తో పాటు లగేజీ కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయన్నారు.

Also Read: Allahabad High Court : భార్య హిజాబ్ ధరించలేదని విడాకులు కోరిన భర్త - కోర్టు సంచలన తీర్పు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DMK BJP alliance rumors: కాంగ్రెస్‌పై యుద్ధం - పాత మిత్రుడిని విలన్‌గా మార్చి.. బీజేపీ వైపు డీఎంకే చూపు?
కాంగ్రెస్‌పై యుద్ధం - పాత మిత్రుడిని విలన్‌గా మార్చి.. బీజేపీ వైపు డీఎంకే చూపు?
Union Cabinet Expansion 2026: కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
Embed widget