అన్వేషించండి

Yogi Adityanath: మాట వినకపోతే క్రమశిక్షణలో పెట్టడానికి మరో పద్ధతిని అనుసరిస్తాం - రోడ్లపై ప్రార్థనలు చేసే వారికి యూపీ సీఎం వార్నింగ్

Namaz On Roads: యూపీలో ట్రాఫిక్ ఆపేసి ప్రార్థనలు చేసే ముస్లింల తీరుపై యూపీ సీఎం అసహన ంవ్యక్తం చేశారు. దానికి ఆయన పరిష్కారం చెప్పారు. మాట వినకపోతే తమ పద్దతిని తాము అనుసరిస్తామని హెచ్చరించారు.

Yogi Adityanath Statement Namaz On Roads : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన ప్రార్థనల నిర్వహణపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నోలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రోడ్లపై నమాజ్ నిర్వహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అది ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడమే కాకుండా సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందని స్పష్టం చేశారు. రోడ్లు అనేవి ప్రజల రాకపోకల కోసం నిర్దేశించినవని, వాటిని మతపరమైన కూడళ్లుగా లేదా ప్రార్థనా స్థలాలుగా మార్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేసే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ..  యూపీలో రోడ్ల మీద నమాజ్ చదవడం నిజంగా ఆగిపోయిందా  అని నన్ను తరచూ అడుగుతుంటారు. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై నమాజ్ జరగడం లేదు, కావాలంటే మీరే వెళ్లి చూడండి అని యోగి వ్యాఖ్యానించారు. బహిరంగ రహదారులపై లేదా ప్రధాన కూడళ్ల వద్ద జనం గుమిగూడి ట్రాఫిక్ నిలిపివేయడం చట్టవిరుద్ధమని, క్రమశిక్షణ పాటించని పక్షంలో యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

ప్రార్థనలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి సూచించారు. జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా సాధ్యమని కొందరు నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పాను.. షిఫ్టుల పద్ధతిలో ప్రార్థనలు చేసుకోండి అని. ఇంట్లో లేదా ప్రార్థనా మందిరాల్లో స్థలం లేకపోతే, సమయాన్ని విభజించుకుని పద్ధతిగా నిర్వహించుకోవాలి తప్ప, రోడ్ల మీదకు వచ్చి అనవసరంగా రద్దీని పెంచకూడదు అని ఆయన హితవు పలికారు. మతపరమైన ఆచారాలు ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా శాంతిని కాపాడే విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెబుతూనే, చర్చలు , అవగాహన ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.  మేము ప్రేమతో, మాటలతో మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మాట వినకపోతే, క్రమశిక్షణలో పెట్టడానికి మరో పద్ధతిని అనుసరిస్తాం  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మతపరమైన పట్టింపుల కంటే ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు ,  పౌర క్రమశిక్షణే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.    

 ఉత్తరప్రదేశ్ నమూనాలో బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణను అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని యోగి సర్కార్ యోచిస్తోంది. రహదారులపై ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, మతపరమైన ఊరేగింపులు లేదా ప్రార్థనలు ప్రజల దైనందిన జీవితానికి అడ్డంకిగా మారకూడదన్నది ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పారదర్శకమైన పాలన , కఠినమైన చట్ట అమలుతో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడతామని ఆయన చెబుతున్నారు.  


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Reasons For Prashant Kishor Win: బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
Karnataka Cabinet Expansion: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget