అన్వేషించండి

Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!

తమిళనాడు సాతంకుళంలో తండ్రీకొడుకుల కస్టడీ మరణాల కేసులో 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు వెనుక హెడ్ కానిస్టేబుల్ రేవతి ప్రాణాలకు తెగించి చెప్పిన సాక్ష్యం కీలకంగా నిలిచింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కస్టడీలో తండ్రీకొడుకుల హింస కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష.
  • లాక్‌డౌన్ సమయంలో షాప్ ఎక్కువసేపు తెరిచినందుకు అదుపులోకి తీసుకున్నారు.
  • పోలీసుల అరాచకాన్ని కానిస్టేబుల్ రేవతి సాక్ష్యంతో బయటపెట్టారు.
  • ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత దోషులకు శిక్ష, చట్టం అందరికీ సమానం.

Constable Revathi: భారత్‌ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాతంకుళం. కస్టడీలో ఉన్న తండ్రీ కొడుకులను అతి దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో జరిగిన ఈ ఉదంతం, దేశంలో పోలీసు వ్యవస్థలోని అరాచకాలను ఎత్తి చూపింది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో దోషులకు శిక్ష పడేలా చేయడంలో ఒక సామాన్య కానిస్టేబుల్ చూపిన సాహసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆ రాత్రి ఏం జరిగింది?

2020 జూన్‌ నెలలో కరోనా లాక్‌-డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో సాతంకుళంలో మొబైల్‌ షాపు నడుపుతున్న పి. జయరాజ్, ఆయన కుమారుడు జె. బెన్నిక్స్ తమ దుకాణాన్ని నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచారనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో జరిగిన హింస వర్ణనాతీతం. పోలీసులు తమ విచక్షణను మరిచి, లాఠీలతో, బూటు కాలితో వారిపై విరుచుకుపడ్డారు. 

మపులు తిప్పిన రేవతి సాక్ష్యం 

ఈ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడటంలో కీలక పాత్ర పోషించింది హెడ్ కానిస్టేబులు రేవతి. అదే స్టేషన్‌లో పని చేస్తున్న ఆమె, తన తోటి అధికారులు చేస్తున్న అరాచకాన్ని కళ్లారా చూసింది. ఉన్నతాధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా, తన ఉద్యోగానికి, కుటుంబానికి ముప్పు ఉందని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎంఎస్‌ భారతీ దాసన్ విచారణకు వచ్చినప్పుడు " సార్ నేను ప్రతి విషయాన్ని చెబుతారు. దాచిన విషయాలు వెలుగులోకి తీసుకొస్తాను. కానీ నా ఇద్దరు చిన్న పిల్లల భద్రతకు మీరు హామీ ఇవ్వగలరా" అని ఆమె అడిగిన ప్రశ్న ఆమెలోని భయాన్ని, అదే సమయంలో ఆమెకున్న ధైర్యాన్ని చాటిచెప్పింది. 

హింసకు పరాకాష్ట

రేవతి తన సాక్ష్యంలో ఆ రాత్రి జరిగిన దారుణాలను వివరించారు. పోలీసులు బాధితులను బట్టలు విప్పి దారుణంగా కొట్టడమే కాకుండా, వారి ప్రైవేటు భాగాలపై బూట్లతో తొక్కారు. అంత హింస జరుగుతున్నా, పోలీసులు మధ్య మధ్యలో మద్యం సేవించి మరీ మళ్లీ కొట్టేవారని ఆమె వెల్లడించారు. తండ్రీ కొడుకులు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు రేవతి జయరాజ్‌కు కాఫీ ఇవ్వబోగా, ఇతర సిబ్బంది దానిని విసిరికొట్టారు. ఆ హింసను చూడలేక ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

రేవతికి బెదిరింపులు 

సాక్ష్యం చెప్పకుండా రేవతిని తోటి పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేశారు. మేజిస్ట్రేట్‌ విచారణ జరుగుతున్న సమయంలో కూడా స్టేషన్ బయటకు పోలీసులు గుమిగూడి రేవతిని భయపెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందంటే, రేవతి తన స్టేట్‌మెంట్‌పై సంతకం చేయడానికి కూడా తొలుత భయపడ్డారు. మద్రాస్‌ హైకోర్టు జోక్యం చేసుకొని ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఆమె భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. 

న్యాయం ఎలా గెలిచింది?

ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి, నిందితులను గుర్తించడంలో రేవతి సాక్ష్యం ఎంతో సహయపడింది. ఐదేళ్లపాటు సాగిన ఈ కేసులో చివరికి న్యాయస్థానం సహాయపడింది. ఐదేళ్లపాటు సాగిన ఈ కేసులో చివరికి న్యాయస్థఆనం పోలీసులకు మరణశిక్ష విధించడం ద్వారా, చట్టం ముందు ఎవరూ అతీతులుకారని నిరూపితమైంది. 

Frequently Asked Questions

సాతంకుళం కేసులో తండ్రీ కొడుకులకు ఏం జరిగింది?

2020 జూన్ లో లాక్‌-డౌన్‌ నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలపై పోలీసులు జయరాజ్, బెన్నిక్స్ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో వారిని దారుణంగా హింసించి ప్రాణాలు తీశారు.

ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష పడటానికి కారణమేంటి?

అదే స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రేవతి ధైర్యంగా సాక్ష్యం చెప్పడమే 9 మంది పోలీసులకు శిక్ష పడటానికి ప్రధాన కారణం. ఆమె నేరుగా జరిగిన హింసను వివరించారు.

కానిస్టేబుల్ రేవతికి ఎలాంటి బెదిరింపులు ఎదురయ్యాయి?

సాక్ష్యం చెప్పకుండా ఉండేలా తోటి పోలీసులు రేవతిని తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఆమె ఉద్యోగానికి, కుటుంబానికి ముప్పు ఉందని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు.

ఈ కేసులో న్యాయం ఎలా గెలిచింది?

ఐదేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో, రేవతి సాక్ష్యం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా న్యాయస్థానం పోలీసులకు మరణశిక్ష విధించింది. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని నిరూపితమైంది.

టాప్ హెడ్ లైన్స్

Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget