అన్వేషించండి

Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!

తమిళనాడు సాతంకుళంలో తండ్రీకొడుకుల కస్టడీ మరణాల కేసులో 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు వెనుక హెడ్ కానిస్టేబుల్ రేవతి ప్రాణాలకు తెగించి చెప్పిన సాక్ష్యం కీలకంగా నిలిచింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కస్టడీలో తండ్రీకొడుకుల హింస కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష.
  • లాక్‌డౌన్ సమయంలో షాప్ ఎక్కువసేపు తెరిచినందుకు అదుపులోకి తీసుకున్నారు.
  • పోలీసుల అరాచకాన్ని కానిస్టేబుల్ రేవతి సాక్ష్యంతో బయటపెట్టారు.
  • ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత దోషులకు శిక్ష, చట్టం అందరికీ సమానం.

Constable Revathi: భారత్‌ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాతంకుళం. కస్టడీలో ఉన్న తండ్రీ కొడుకులను అతి దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో జరిగిన ఈ ఉదంతం, దేశంలో పోలీసు వ్యవస్థలోని అరాచకాలను ఎత్తి చూపింది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో దోషులకు శిక్ష పడేలా చేయడంలో ఒక సామాన్య కానిస్టేబుల్ చూపిన సాహసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆ రాత్రి ఏం జరిగింది?

2020 జూన్‌ నెలలో కరోనా లాక్‌-డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో సాతంకుళంలో మొబైల్‌ షాపు నడుపుతున్న పి. జయరాజ్, ఆయన కుమారుడు జె. బెన్నిక్స్ తమ దుకాణాన్ని నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచారనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో జరిగిన హింస వర్ణనాతీతం. పోలీసులు తమ విచక్షణను మరిచి, లాఠీలతో, బూటు కాలితో వారిపై విరుచుకుపడ్డారు. 

మపులు తిప్పిన రేవతి సాక్ష్యం 

ఈ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడటంలో కీలక పాత్ర పోషించింది హెడ్ కానిస్టేబులు రేవతి. అదే స్టేషన్‌లో పని చేస్తున్న ఆమె, తన తోటి అధికారులు చేస్తున్న అరాచకాన్ని కళ్లారా చూసింది. ఉన్నతాధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా, తన ఉద్యోగానికి, కుటుంబానికి ముప్పు ఉందని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎంఎస్‌ భారతీ దాసన్ విచారణకు వచ్చినప్పుడు " సార్ నేను ప్రతి విషయాన్ని చెబుతారు. దాచిన విషయాలు వెలుగులోకి తీసుకొస్తాను. కానీ నా ఇద్దరు చిన్న పిల్లల భద్రతకు మీరు హామీ ఇవ్వగలరా" అని ఆమె అడిగిన ప్రశ్న ఆమెలోని భయాన్ని, అదే సమయంలో ఆమెకున్న ధైర్యాన్ని చాటిచెప్పింది. 

హింసకు పరాకాష్ట

రేవతి తన సాక్ష్యంలో ఆ రాత్రి జరిగిన దారుణాలను వివరించారు. పోలీసులు బాధితులను బట్టలు విప్పి దారుణంగా కొట్టడమే కాకుండా, వారి ప్రైవేటు భాగాలపై బూట్లతో తొక్కారు. అంత హింస జరుగుతున్నా, పోలీసులు మధ్య మధ్యలో మద్యం సేవించి మరీ మళ్లీ కొట్టేవారని ఆమె వెల్లడించారు. తండ్రీ కొడుకులు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు రేవతి జయరాజ్‌కు కాఫీ ఇవ్వబోగా, ఇతర సిబ్బంది దానిని విసిరికొట్టారు. ఆ హింసను చూడలేక ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

రేవతికి బెదిరింపులు 

సాక్ష్యం చెప్పకుండా రేవతిని తోటి పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేశారు. మేజిస్ట్రేట్‌ విచారణ జరుగుతున్న సమయంలో కూడా స్టేషన్ బయటకు పోలీసులు గుమిగూడి రేవతిని భయపెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందంటే, రేవతి తన స్టేట్‌మెంట్‌పై సంతకం చేయడానికి కూడా తొలుత భయపడ్డారు. మద్రాస్‌ హైకోర్టు జోక్యం చేసుకొని ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఆమె భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. 

న్యాయం ఎలా గెలిచింది?

ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి, నిందితులను గుర్తించడంలో రేవతి సాక్ష్యం ఎంతో సహయపడింది. ఐదేళ్లపాటు సాగిన ఈ కేసులో చివరికి న్యాయస్థానం సహాయపడింది. ఐదేళ్లపాటు సాగిన ఈ కేసులో చివరికి న్యాయస్థఆనం పోలీసులకు మరణశిక్ష విధించడం ద్వారా, చట్టం ముందు ఎవరూ అతీతులుకారని నిరూపితమైంది. 

Frequently Asked Questions

సాతంకుళం కేసులో తండ్రీ కొడుకులకు ఏం జరిగింది?

2020 జూన్ లో లాక్‌-డౌన్‌ నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలపై పోలీసులు జయరాజ్, బెన్నిక్స్ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో వారిని దారుణంగా హింసించి ప్రాణాలు తీశారు.

ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష పడటానికి కారణమేంటి?

అదే స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రేవతి ధైర్యంగా సాక్ష్యం చెప్పడమే 9 మంది పోలీసులకు శిక్ష పడటానికి ప్రధాన కారణం. ఆమె నేరుగా జరిగిన హింసను వివరించారు.

కానిస్టేబుల్ రేవతికి ఎలాంటి బెదిరింపులు ఎదురయ్యాయి?

సాక్ష్యం చెప్పకుండా ఉండేలా తోటి పోలీసులు రేవతిని తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఆమె ఉద్యోగానికి, కుటుంబానికి ముప్పు ఉందని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు.

ఈ కేసులో న్యాయం ఎలా గెలిచింది?

ఐదేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో, రేవతి సాక్ష్యం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా న్యాయస్థానం పోలీసులకు మరణశిక్ష విధించింది. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని నిరూపితమైంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Malvan Resort Accident: డైవింగ్ చేసి స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకాడు - ఇక అంతే - షాకింగ్ వీడియో
డైవింగ్ చేసి స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకాడు - ఇక అంతే - షాకింగ్ వీడియో
How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget