అన్వేషించండి

1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

Indias 1st Hydrogen Train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తూ కాలుష్యరహితంగా అందరికీ మేలు చేస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాని మోదీ జింద్‌లో భారత్ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించారు.
  • స్వదేశీ పరిజ్ఞానంతో 10 కోచ్‌ల రైలు కాలుష్యరహితంగా నడుస్తుంది.
  • హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయన చర్యతో శక్తిని ఉత్పత్తి చేస్తూ ప్రయాణిస్తుంది.
  • బహుళ భద్రతా వ్యవస్థలతో జింద్-సోనిపత్ మార్గంలో సేవలు అందిస్తుంది.

1st Hydrogen Train In India: భారత్‌లో తొలి పర్యావరణహిత హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ 10 కోచ్‌ల రైలు నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ కాలుష్య రహితంగా ప్రయాణిస్తుంది. ఈ తొలి హైడ్రోజన్ రైలు హరియాణాలోని జింద్- సోనిపత్ మధ్య సేవలు అందిస్తుంది.

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన రైలు పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేస్తూ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇంజినీర్లు ఈ మోడ్రన్ రైలును రూపొందించారు. స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్ల తర్వాత భారత రైల్వే ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలిచింది.

హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే..

హైడ్రోజన్ రైలు సాధారణ విద్యుత్ రైళ్లలా కాకుండా, తన శక్తిని తానే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఇందులోని 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రొటాన్ ఎక్స్‌ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్ ప్లాంట్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య రసాయన చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ 3,200 హెచ్‌పీ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా మోటార్లకు అంది, రైలు గంటకు దాదాపు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. ఇంధన దహనచర్య లేకపోవడం వల్ల హైడ్రోజన్ రైలు నుంచి కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడుతాయి. హానికారక కర్బన ఉద్గారాలు, శబ్ద కాలుష్యం లేని పర్యావరణహిత ప్రయాణం వీలవుతుంది.

Also Read: Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

ఈ రైలులో అత్యున్నత రక్షణ ప్రమాణాలతో కూడిన పలు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ లీకేజీలు, వేడి లేదా మంటలను క్షణాల్లో గుర్తించి అప్రమత్తం చేసే ఆటోమేటిక్ షట్‌ఆఫ్ వ్యవస్థను సెటప్ చేశారు.  నిరంతర వెంటిలేషన్ సౌకర్యం వల్ల ఒకవేళ లీకేజీ జరిగినా గ్యాస్ గాల్లో కలిసిపోతుంది. లోకోపైలట్ కేబిన్‌ను సైతం ప్రత్యేకంగా డిజైన్ చేసి, అన్ని భద్రతా అంశాలను పర్యవేక్షించేలా ఇందులో స్క్రీన్‌ను అమర్చి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ రైలు నిర్వహణ కోసం జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ నిల్వ, డిస్పెన్సింగ్ కేంద్రాన్ని నిర్మించారు.

తొలి దశలో ఈ హైడ్రోజన్ రైలు నార్త్ రైల్వే పరిధిలోని హర్యానాలోని జింద్- సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో 12 స్టేషన్లలో హాల్ట్ ద్వారా ప్రయాణించనుంది. రానున్న రోజుల్లో కల్కా- షిమ్లా వంటి మార్గాల్లోనూ హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా వంటి దేశాల్లో 2 నుండి 4 కోచ్‌లతో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా, భారత్ మాత్రం రికార్డు స్థాయిలో 10 కోచ్‌లతో, ఒకేసారి 2,600 మంది ప్రయాణించేలా రైలును తీసుకొచ్చారు. 

అరుదైన దేశాల జాబితాలో భారత్

ప్రస్తుతం చైనా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, అమెరికాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా తాజాగా  భారత్ వాటి సరసన చేరింది. ఈ రైళ్లు హైడ్రోజన్, ఆక్సిజన్‌ను విద్యుత్తుగా మార్చేందుకు హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ ఉపయోగిస్తాయి. చివరగా ప్రక్రియ పూర్తయ్యాక కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేయడంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. భారత్ సైతం త్వరలో మరిన్ని ప్రాంతాలకు హైడ్రోజన్ రైళ్లను ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తేనుంది. 

 

Frequently Asked Questions

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ఎవరు ప్రారంభించారు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ రైలును ప్రారంభించారు. ఇది 10 కోచ్‌లతో కాలుష్య రహితంగా ప్రయాణిస్తుంది.

హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?

ఇది ప్రొటాన్ ఎక్స్‌ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్ ప్లాంట్‌తో హైడ్రోజన్, ఆక్సిజన్ల రసాయన చర్య ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది, కాలుష్యం ఉండదు.

భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ఏ మార్గంలో ప్రయాణిస్తుంది?

తొలి దశలో ఈ రైలు హరియాణాలోని జింద్-సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో 12 స్టేషన్లలో సేవలు అందిస్తుంది. భవిష్యత్తులో కల్కా-షిమ్లా వంటి మార్గాల్లోనూ ప్రవేశపెట్టనున్నారు.

ఇతర దేశాల హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే భారత రైలు ప్రత్యేకత ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో 2-4 కోచ్‌లతో రైళ్లు నడుస్తుండగా, భారత్ 10 కోచ్‌లతో, ఒకేసారి 2,600 మంది ప్రయాణించేలా ఈ రైలును రూపొందించింది. ఇది దాని ప్రత్యేకత.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJP Founder Abhijit Dipke: కేంద్రంతో చర్చలు సఫలం.. దీక్ష విరమించిన సీజేపీ- యువతకు అభిజీత్ దీప్కే కీలక సూచనలు
కేంద్రంతో చర్చలు సఫలం.. దీక్ష విరమించిన సీజేపీ- యువతకు అభిజీత్ దీప్కే కీలక సూచనలు
Breaking News: కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ
కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ
Lalit Modi Return to India: 16 ఏళ్ల తర్వాత లలిత్ మోడీ ఘర్ వాపసీ - లీగల్ క్లియరెన్స్ లభించిందా? భారత్‌కు వస్తే అరెస్ట్ చేస్తారా?
16 ఏళ్ల తర్వాత లలిత్ మోడీ ఘర్ వాపసీ - లీగల్ క్లియరెన్స్ లభించిందా? భారత్‌కు వస్తే అరెస్ట్ చేస్తారా?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget