అన్వేషించండి

PM Modi In Rajasthan: ఎల్‌పీజీ సబ్సిడీతో 70లక్షల కుటుంబాలకు లబ్ధి: రాజస్థాన్‌లో మోదీ

PM Modi In Rajasthan: ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌ను రూ.600 కే అందిస్తామని దీని వల్ల 70 లక్షల కుటుంబాలకు లాభం చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.


ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌ను రూ.600 కే అందిస్తామని దీని వల్ల 70 లక్షల కుటుంబాలకు లాభం చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌ పర్యటనలో చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ఎల్‌పీజీ సిలిండర్ల సబ్సిడీని రూ.200 నుంచి రూ.300 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు లాభం చేకూరనుంది. . రాజస్థాన్‌లో రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రధాని రెండు వారాల్లో మూడు సార్లు అక్కడికి వెళ్లారు. గురువారం జోధ్ పూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు. అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో పేపర్ లీక్‌ మాఫియా, అవినీతి, దళితులు మహిళలపై నేరాలు పెరిగాయని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతను పేపర్‌ లీక్‌ మాఫియాకు బలి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని యువకులు తమకు న్యాయం కావాలని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన కాంగ్రెస్‌ పేపర్‌ లీక్‌ మాఫియాపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుంటుందని రాజస్థాన్‌ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారు.

సభలో మాట్లాడుతూ మోదీ.. ఈరోజు జోధ్‌పూర్‌, మార్వాడ్‌ ప్రజలు పలు బహుమతులు తీసుకుంటారని అన్నారు. ఉజ్వల పథకం మహిళా లబ్దిదారులకు రూ.600 కే ఎల్‌పీజీ సిలిండర్‌ ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని నిన్ననే నిర్ణయించిందని తెలిపారు. దీనిని అందించడం కోసం దిల్లీ నుంచి తాను వచ్చినట్లు చెప్పారు. అంతకుముందు రాజస్థాన్‌లో రూ.5000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ప్రాజెక్టులు రోడ్డు, రైలు, విమానయానం, ఆరోగ్యం మరియు ఉన్నత విద్య వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు అందులో ఉన్నాయి.

రాజస్థాన్‌ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మోదీ తెలిపారు. అయితే అవినీతి, అల్లర్లలో కాంగ్రెస్‌ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటోందని దుయ్యబట్టారు. మహిళలు, దళితులపై అఘాయిత్యాలలో రాజస్థాన్‌ నెంబర్‌ 1 గా నిలిచిందని మోదీ ఆరోపించారు. డ్రగ్స్‌ వ్యాపారానికి కాంగ్రెస్‌ స్వేచ్ఛ నిచ్చిందని ఆయన విమర్శలు చేశారు. 'ఐదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. మొత్తం ఇక్కడ 'కుర్సీ కా ఖేల్' కొనసాగింది.'లాల్ డైరీ' గురించి విన్నారా? ఆ డైరీలో కాంగ్రెస్ అవినీతికి సంబంధించిన ప్రతి అకృత్యాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. చెప్పండి ఆ డైరీ రహస్యాలు బయటికి రాకూడదా?నిజాయితీ లేని వారిని శిక్షించకూడదా?కాంగ్రెస్ ప్రభుత్వం డైరీ రహస్యాలను బయటికి తెస్తుందా?నిజం బయటకు రావాలంటే మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ' అని మోదీ విమర్శలు చేశారు. 


మోదీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో 350 పడకల ట్రామా సెంటర్‌, క్రిటికల్‌ కేర్‌ హాస్పిటల్‌ బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద ఏడు క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేసే పనులను ప్రారంభించారు. ఒక్క ట్రామా సెంటర్‌కే రూ.350 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. హెరిటేజ్ స్పెషల్-మార్వార్ మరియు రునిచా ఎక్స్‌ప్రెస్-జైసల్మేర్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి గురువారం జోధ్‌పూర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. జోధ్‌పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక టెర్మినల్ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 1,135 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఐఐటీ జోధ్‌పూర్ క్యాంపస్‌ను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Budget Family Trip : ఫ్యామిలీతో ట్రిప్​కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
ఫ్యామిలీతో ట్రిప్​కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
Rahul Gandhi PM Hopes: రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget