అన్వేషించండి

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత నగదు జమ అయ్యేది ఎప్పుడంటే

Pradhan Mantri Kisan Samman Nidhi | పీఎం కిసాన్ 21వ విడత నగదు జమ చేసే తేదీ ఖరారైంది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఈ పొరపాట్లు చేయవద్దు. ఈకేవైసీ పూర్తి చేయాలని రైతులకు సూచించారు.

PM Kisan Yojana 21st Installment | కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (Kisan Yojana) అతిపెద్దది. దీని కింద లబ్ధిదారులైన రైతులకు సంవత్సరానికి రూ. 6000 అందజేస్తారు. ఇది 2 వేల రూపాయల చొప్పున 3 వాయిదాలలో చెల్లిస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే 20 వాయిదాల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 

రైతులు ప్రస్తుతం 21వ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక సమాచారం అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ చేస్తారు. 21వ వాయిదా ఎప్పుడు విడుదలవుతుందో, అంతకుముందే రైతులు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం, తద్వారా మీ వాయిదాలో ఎలాంటి ఆటంకం కలగదు.

రైతులకు 21వ వాయిదా నగదు విడుదల

కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ యోజన 21వ వాయిదాకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19, 2025న రైతుల ఖాతాల్లో తదుపరి వాయిదాను విడుదల చేయనున్నారు. ఈసారి దాదాపు 9 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అంటే వాయిదా కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. వారం రోజుల్లోపే రైతులకు రూ.2 వేలు రానున్నాయి.

కేంద్రం ఇప్పటికే వరద ప్రభావిత రాష్ట్రాల రైతులకు 21వ వాయిదా విడుదల చేసిందని తెలిసిందే. ఇందులో అక్టోబర్ 7, 2025న జమ్మూ కాశ్మీర్ రైతులకు 21వ వాయిదా లభించింది. అంతకుముందు సెప్టెంబర్ 26, 2025న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రైతులకు కూడా 21వ వాయిదా నగదు లభించింది.

రైతులు వెంటనే ఈ పని చేయాలి

PM కిసాన్ యోజన 21వ వాయిదా విడుదలయ్యే ముందు రైతులు కొన్ని పనులు పూర్తి చేయాలి. వీటిలో ముఖ్యమైనది ఏమిటంటే, చాలా మంది రైతులు ఇప్పటికీ ఈ-కేవైసీ (E KYC) ప్రక్రియను పూర్తి చేయలేదు. అలాంటి రైతుల తాజా వాయిదా నగదు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేసుకోవాలని అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇటు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

అంతేకాకుండా, భూమి ధృవీకరణ కూడా పూర్తి చేసుకోవాలి. భూమికి సంబంధించిన రికార్డులలో ఏదైనా లోపం ఉన్న రైతులు, దానిని కూడా పత్రాల్లో సరిదిద్దుకోవడం ముఖ్యం. అలాగైతేనే 2 వేల రూపాయల వాయిదా మీ బ్యాంక్ ఖాతాలో ఎలాంటి ఆటంకం లేకుండా జమ అవుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Breaking News: బాసర ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
బాసర ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Jana Nayagan Producer: 'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
Embed widget