అన్వేషించండి

దేశం పరువు తీశారు, ఇంకా ఎంత దిగజారిపోతారు - నితీశ్ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్

PM Modi Slams Nitish: జనాభా నియంత్రణపై నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు.

PM Modi Slams Nitish Kumar:

ప్రధాని మోదీ ఆగ్రహం..

జనాభా నియంత్రణపై అసెంబ్లీలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ విమర్శలు ఆగడం లేదు. పలువురు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంత కన్నా సిగ్గుచేటు మరోటి ఉండదంటూ ఫైర్ అవుతున్నారు. ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. నితీశ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌పై విపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. మహిళల పట్ల అంత నీచంగా మాట్లాడడం దేశ ప్రతిష్ఠకే అవమానకరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించారు. 

"ఘమండియా ఘట్‌బంధన్‌ I.N.D.I.A కూటమిలో ఓ సీనియర్ నేత మహిళల పట్ల అత్యంత నీచంగా మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయినా వాళ్లకు ఏ మాత్రం సిగ్గుగా అనిపించడం లేదు. విపక్ష కూటమిలో ఒక్కరు కూడా ఆ వ్యాఖ్యలపై స్పందించలేదు. ఎవరూ ఖండించలేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వాళ్లు మహిళల కోసం మంచి చేస్తారని ఎలా నమ్మగలం. మన తల్లులు, సోదరీమణుల ఇలా మాట్లాడి దేశ పరువు తీస్తున్నారు. ఇంకా ఎంత దిగజారిపోతారు"

- ప్రధాని నరేంద్ర మోదీ

 

కేసు నమోదు..

నితీశ్ చేసిన వ్యాఖ్యలపై ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌లో ఫిర్యాదు నమోదైంది. జనాభా నియంత్రణ మహిళల వల్లే సాధ్యమవుతుందన్న విషయాన్ని చాలా నీచంగా మాట్లాడారని ఆ కంప్లెయింట్‌లో ప్రస్తావించారు. అసెంబ్లీ సాక్షిగా దారుణమైన భాష వినియోగించారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై కోర్టు నవంబర్ 25న విచారణ చేపట్టనుంది.

జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నితీశ్ కుమార్ ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జనాభా నియంత్రణ విషయంలో మహిళల అవగాహన గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో నోరు జారారు నితీశ్. రాష్ట్రంలో ఫర్టిలిటీ రేట్‌ 4.2% నుంచి 2.9%కి పడిపోయింది. దీనిపై చర్చిస్తున్న సమయంలోనే కాస్త వివాదాస్పద భాష వాడారు. దీనికి వివరణ ఇస్తూ "నా వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి. ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను" అని చెప్పారు.

Also Read: మూడోసారి ప్రధాని అయ్యాక ఇండియా ఎకానమీని నంబర్ 3 స్థానానికి తీసుకెళ్తా - మోదీ ధీమా

టాప్ హెడ్ లైన్స్

Fact Check: రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
Nepal Floods Video: నేపాల్‌లో వరద బీభత్సం CCTV వీడియో.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన ప్రజలు
నేపాల్‌లో వరద బీభత్సం CCTV వీడియో.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన ప్రజలు
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YS Jagan Unanimous Elections Stand: అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Fact Check: రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
ఇరాన్-అమెరికా యుద్ధం: 2026లో పాలన మార్పు? 4 నెలల్లో ఏం జరగబోతోంది?
ఇరాన్-అమెరికా యుద్ధం: 2026లో పాలన మార్పు? 4 నెలల్లో ఏం జరగబోతోంది?
Embed widget