అన్వేషించండి

Pakistan Vs India : పాకిస్థాన్‌ను మరింతగా దెబ్బతీసేందుకు సిద్ధమైన భారత్- ఏడీబీతో నిర్మలమ్మ సమావేశం

Pakistan Vs India : అన్ని రకాలుగా పాకిస్థాన్‌ను లాక్ చేసేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఆర్థికంగా కూడా తొక్కిపెట్టేందుకు సిద్ధమైంది.

FM Nirmala Sitharaman meets ADB President: భారతదేశపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) అధ్యక్షుడు మసాటో కాండాను కలిసి పాకిస్థాన్‌కు ఇచ్చే నిధులను ఆపాలని డిమాండ్ చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ADB అధ్యక్షుడితో సమావేశమై భారత్‌ డిమాండ్‌ను వివరించారు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై  ఉగ్రవాద దాడి జరిగిన తరువాత భారత్ , పాకిస్థాన్ మధ్య తీవ్రతరమైన ఉద్రిక్తతల నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు భారత్‌ దాయాది దేశంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (మే 5)న ఇటలీలోని మిలన్‌లో జరిగిన 58వ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) వార్షిక సమావేశంలో ADB అధ్యక్షుడు మసాటో కాండాను కలిశారు.  అంతేకాకుండా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ డిమాండ్‌ను ఇటలీ ఆర్థిక మంత్రి జియాంకార్లో జియోర్జెట్టి ముందు లేవనెత్తారు.

భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపై కేంద్ర  చర్యలపై చర్చ

అదే సమయంలో ADB అధ్యక్షుడు మసాటో కాండాతో సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని కీలకాంశాలు కూడా చర్చించారు. “భారతదేశం  ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తోంది. దేశంలో ఒక విధానపరమైన , నియంత్రణా పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాం .”

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు షాక్ ఇవ్వవచ్చు

మరోవైపు, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం (మే 5) తన నివేదికలో భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు షాక్ ఇవ్వవచ్చు. దాని ప్రస్తుతం నెలకొన్ని వివాదాలు  సమస్యలను సృష్టించవచ్చు అని పేర్కొంది. అంతేకాకుండా ఈ ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఇతర దేశాలతో కలిగి ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావితం చేయవచ్చు, అలాగే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని కలిగించవచ్చు, ఇది తదుపరి రుణ చెల్లింపులపై ప్రభావం పడుతుందని తెలిపింది. .

పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి

భారత్ , పాకిస్థాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు ఏప్రిల్ 22, 2025న జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పెరిగాయి. ఈ ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయ పౌరులు సహా మొత్తం 26 మంది మరణించారు. దీని తరువాత భారతదేశం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అనేక పెద్ద చర్యలు తీసుకుంది. ఆ దేశంలో  దౌత్య సంబంధాలు తెంచుకుంటూ వస్తోంది. పౌరులకు వీసాలు నిరాకరిస్తోంది. సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకుంది. భారత్ గగన తలంలోకి పాకిస్థాన్ విమానాల రాకను నిషేదించింది. ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా ఇండియాలో రాకుండా కట్టడి చేసింది. ఇలా అన్నివైపుల నుంచి పాకిస్థాన్‌ను బందించే ప్రయత్నం చేస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget