అన్వేషించండి

Pakistan Vs India : పాకిస్థాన్‌ను మరింతగా దెబ్బతీసేందుకు సిద్ధమైన భారత్- ఏడీబీతో నిర్మలమ్మ సమావేశం

Pakistan Vs India : అన్ని రకాలుగా పాకిస్థాన్‌ను లాక్ చేసేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఆర్థికంగా కూడా తొక్కిపెట్టేందుకు సిద్ధమైంది.

FM Nirmala Sitharaman meets ADB President: భారతదేశపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) అధ్యక్షుడు మసాటో కాండాను కలిసి పాకిస్థాన్‌కు ఇచ్చే నిధులను ఆపాలని డిమాండ్ చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ADB అధ్యక్షుడితో సమావేశమై భారత్‌ డిమాండ్‌ను వివరించారు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై  ఉగ్రవాద దాడి జరిగిన తరువాత భారత్ , పాకిస్థాన్ మధ్య తీవ్రతరమైన ఉద్రిక్తతల నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు భారత్‌ దాయాది దేశంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (మే 5)న ఇటలీలోని మిలన్‌లో జరిగిన 58వ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) వార్షిక సమావేశంలో ADB అధ్యక్షుడు మసాటో కాండాను కలిశారు.  అంతేకాకుండా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ డిమాండ్‌ను ఇటలీ ఆర్థిక మంత్రి జియాంకార్లో జియోర్జెట్టి ముందు లేవనెత్తారు.

భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపై కేంద్ర  చర్యలపై చర్చ

అదే సమయంలో ADB అధ్యక్షుడు మసాటో కాండాతో సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని కీలకాంశాలు కూడా చర్చించారు. “భారతదేశం  ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తోంది. దేశంలో ఒక విధానపరమైన , నియంత్రణా పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాం .”

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు షాక్ ఇవ్వవచ్చు

మరోవైపు, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం (మే 5) తన నివేదికలో భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు షాక్ ఇవ్వవచ్చు. దాని ప్రస్తుతం నెలకొన్ని వివాదాలు  సమస్యలను సృష్టించవచ్చు అని పేర్కొంది. అంతేకాకుండా ఈ ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఇతర దేశాలతో కలిగి ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావితం చేయవచ్చు, అలాగే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని కలిగించవచ్చు, ఇది తదుపరి రుణ చెల్లింపులపై ప్రభావం పడుతుందని తెలిపింది. .

పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి

భారత్ , పాకిస్థాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు ఏప్రిల్ 22, 2025న జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పెరిగాయి. ఈ ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయ పౌరులు సహా మొత్తం 26 మంది మరణించారు. దీని తరువాత భారతదేశం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అనేక పెద్ద చర్యలు తీసుకుంది. ఆ దేశంలో  దౌత్య సంబంధాలు తెంచుకుంటూ వస్తోంది. పౌరులకు వీసాలు నిరాకరిస్తోంది. సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకుంది. భారత్ గగన తలంలోకి పాకిస్థాన్ విమానాల రాకను నిషేదించింది. ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా ఇండియాలో రాకుండా కట్టడి చేసింది. ఇలా అన్నివైపుల నుంచి పాకిస్థాన్‌ను బందించే ప్రయత్నం చేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget