అన్వేషించండి

Petrol Diesel Price Hike: చమురుపై అగ్ర దేశాలు 50 శాతం వడ్డిస్తే భారత్‌ ప్రభుత్వం రూ.3లతో సరిపెట్టింది! విమర్శించే ముందు తేడా తెలుసుకోండి!

ప్రపంచమంతా చమురు సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులపై భారాన్ని మోపాయి. ఇప్పుడు భారత్‌ చమురుపై మూడు రూపాయలు పెంచింది. ప్రపంచ దేశాలతో చూస్తే మాత్రం ఇది చాలా తక్కువనే చెప్పాలి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రజల ప్రయాణాలు తగ్గించాలని కేంద్రం సూచిస్తోంది.
  • ప్రపంచవ్యాప్తంగా 82 దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
  • భారత్ లో చమురు ధరలు మూడు రూపాయలు మాత్రమే పెరిగాయి.
  • ప్రభుత్వం లీటరుకు 26 రూపాయల వరకు నష్టాన్ని భరిస్తోంది.

Petrol Diesel Price Hike: భారత్‌లో ప్రస్తుతానికి చమురు సంక్షోభం తీవ్రంగా లేదు. కానీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందుకే ప్రజలకు ప్రయాణాలు తగ్గించాలని సూచిస్తోంది. అంతే కాకుండా చమురు ధర కూడా మూడు రూపాయలు పెంచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇలా ధరలు పెంచారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నమై, ధరలు మండిపోతున్న వేళ పెంచక తప్ప లేదు. ఇలా పెంచడం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు కూడా చమురు ధరలను పెంచాయి. అయితే వాటితో పోల్చుకుంటే మనకు పెంచింది చాలా తక్కువే. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 82 దేశాలు చమురు సంక్షోభం కారణంగా ఎమర్జెన్సీ ఆంక్షలు, రేషనింగ్‌ లేదా భారీ ధరల పెంపును అమలు చేస్తున్నాయి. అయితే భారత్ అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా కేవలం మూడు రూపాయలు మాత్రమే పెంచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చమురు ధరలు ఏ స్థాయిలో పెంచారో చూద్దాం. 

  • యూఏఈలో ఇంధన ధరలు ఏకంగా 52 శాతం పెంచారు.
  • అగ్రరాజ్యం అమెరికాలో 44శాతం మేర ధరలు హైక్ చేశారు. 
  • మయన్మార్‌లో పెట్రోల్‌పై 89.7 శాతం, డీజిల్‌పై 112.7 శాతం పెరిగింది. 
  • మలేసియాలో పెట్రోల్‌పై 56.9 శాతం, డీజిల్‌పై 71.2శాతం పెరిగింది. 
  • పాకిస్తాన్‌లో పెట్రోల్‌పై 54.9శాతం, డీజిల్‌పై 44.9శాతం పెరిగింది. 
  • యూఏఈలో పెట్రోల్‌పై 52.4 శాతం, డీజిల్‌పై 86.1 శాతం పెరిగింది. 
  • అమెరికాలో పెట్రోల్‌పై 44.5శాతం, డీజిల్‌పై 48.1 శాతం పెరిగింది. 
  • శ్రీలంకలో పెట్రోల్‌పై 38.2శాతం, డీజిల్‌పై 41.8శాతం పెరిగింది. 
  • కెనడాలో పెట్రోల్‌పై 31.9శాతం, డీజిల్‌పై 32.8శాతం పెరిగింది. 
  • యూకేలో పెట్రోల్‌పై 19.2శాతం, డీజిల్‌పై 34.2శాతం పెరిగింది. 
  • ఫ్రాన్స్‌లో పెట్రోల్‌పై 20.9శాతం, డీజిల్‌పై 31శాతం పెరిగింది. 
  • జపాన్‌లో పెట్రోల్‌పై 9.7శాతం, డీజిల్‌పై 11.2శాతం పెరిగింది. 

భారత్‌లో పెట్రోల్‌పై 3.2శాతం, డీజిల్‌పై 3.4శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లు దాటినప్పటికీ, భారత్‌ ప్రభుత్వం గత 76 రోజులుగా ధరలను స్థిరంగా ఉంచి వినియోగదారులకు ఊరటనిచ్చింది. 

లీటర్‌కు 26 రూపాయల భారం ప్రభుత్వంపై 

ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలే. అమెరికా- ఇరాన్ మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం స్ట్రైట్ ఆఫ్‌ హార్మూజ్‌ మూసివేయడంతో రవాణాకు ఆటంకం కలిగింది. దీంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతే కాకుండా నౌకల ప్రయాణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో భారత్‌లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరగాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం కనికరించింది. సామాన్యులపై భారం వేయకుండా కేవలం 3 రూపాయలతో సరిపెట్టింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం పెట్రోల్‌పై లీటర్‌కు 26 రూపాయలు, డీజిల్‌పై 82 రూపాయలు చొప్పున నష్టాన్ని భరించాల్సి వస్తోంది. 

అంతర్జాతీయ సంక్షోభం వేళ ఇతర దేశాలు చేతులెత్తేసినా, భారత్ మాత్రం మూడు రూపాయలను మాత్రమే పెంచింది. అసలైన భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. అయితే భవిష్యత్‌లో పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Frequently Asked Questions

ప్రస్తుతం భారతదేశంలో చమురు సంక్షోభం తీవ్రంగా ఉందా?

ప్రస్తుతానికి భారతదేశంలో చమురు సంక్షోభం తీవ్రంగా లేదు. కానీ ముందు జాగ్రత్తగా కేంద్రం చమురు ధరను మూడు రూపాయలు పెంచింది.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయి?

భారతదేశంలో పెట్రోల్ పై 3.2% మరియు డీజిల్ పై 3.4% పెరిగింది. ఇది సుమారు మూడు రూపాయలకు సమానం.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా కీలక చమురు రవాణా మార్గం మూసివేయబడటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ధరల పెంపు ఎలా ఉంది?

భారతదేశంలో కేవలం మూడు రూపాయలు మాత్రమే పెంచగా, యూఏఈ, అమెరికా, మయన్మార్ వంటి దేశాలు 50% పైగా ధరలను పెంచాయి. భారత్ లోని పెంపు చాలా తక్కువ.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget