Hijab Row: విద్యార్థుల నుంచి టీచర్లకు చేరిన హిజాబ్ వివాదం- ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
విద్యార్థుల మధ్య మొదలైన హిజాబ్ వివాదం చివరికి టీచర్ల వరకు చేరింది. హిజాబ్ ధరించిన టీచర్లను ఎగ్జామ్ హాల్స్లోకి అనుమతించరాదని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హిజాబ్ వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. అయితే చాలామంది ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా హిజాబ్కు సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది కర్ణాటక ప్రభుత్వం. పరీక్షలకు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
లేకపోతే
ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఇన్విజిలేషన్కు వెళ్లే టీచర్లు కూడా హిజాబ్ ధరించకూడదని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ధరిస్తే వారిని అనుమతించరాదని తేల్చిచెప్పింది.
హైకోర్టు తీర్పు
కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.
Before You Go
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
ట్రెండింగ్ వార్తలు






















