అన్వేషించండి

Godhra Train Burning Case: గోద్రా అల్లర్ల కేసులో 8 మందికి బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు

Godhra Train Burning Case: 2002లో జరిగిన గోద్రా అల్లర్ల కేసులో 8 మంది నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. మరో నలుగురికి బెయిల్ నిరాకరించింది.

Godhra Train Burning Case: 2002 నాటి గోద్రా రైల్ కోచ్ దహనం కేసులో 8 మంది దోషులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. మరో నలుగురు దోషుల పాత్ర దృష్ట్యా వారి బెయిల్ పిటిషన్ ను పరిశీలించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. 2002లో జరిగిన గోద్రా రైలు దహనం, ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన మతపరమైన అల్లర్లలో నిందితుల్లో ఒకరికి గతేడాది డిసెంబర్ 15వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 8 మంది దోషులకు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు ముందు దోషులకు బెయిల్ ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దోషులు చేసింది చిన్న నేరం కాదనీ, ప్రయాణికులు బోగీలో నుండి బయటకు రాకుండా తలుపులు బిగించారని, ఆ తర్వాత దానిపై రాళ్లు విసిరారని తుషార్ మెహతా ధర్మాసనానికి గుర్తు చేశారు. గతంలో ట్రయల్ కోర్టు దోషులకు విధించిన మరణ శిక్షను గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడాన్నీ ఆయన సవాల్ చేశారు. 

17 ఏళ్ల పాటు జైలులో ఉన్నారని, బెయిల్ ఇవ్వాలని కోరిన న్యాయవాది

గోద్రా అల్లర్ల దోషులపై టాడా చట్టం ప్రయోగించినట్లు చెప్పిన తుషార్ మెహతా.. ఆ నిందితులకు బెయిల్ ఇచ్చి విడుదల చేయకూడదని విజ్ఞప్తి చేశారు. దోషుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. వారు 17 ఏళ్ల పాటు జైలులో ఉన్నారని, వారికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం 8 మందికి బెయిల్ ఇచ్చింది. మరో నలుగురి బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. ఈ 8 మంది దోషులుగా నిర్ధారించబడి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించిన వారి బెయిల్ దరఖాస్తును గుజరాత్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చినందుకు గాను గతంలో బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని, హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. 

2002లో గోద్రా రైలు కోచ్ పై దాడి

2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రాలో కరసేవకులు ప్రయాణిస్తున్న సబర్మతి రైలులోని ఎస్6 బోగీని దహనం చేశారు. ఈ ఘటనలో 59 మంది చనిపోయారు. గోద్రా రైలు దహనంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వ్యాప్తంగా హింస చెలరేగింది. ఈ అల్లర్లలో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 

నరోదాగామ్ కేసులో ఊరట

గుజరాత్ అల్లర్లకు సంబంధించిన నరోదాగామ్ కేసులో మాజీ మంత్రి మాయా కొద్నానీ, భజరంగ్ దళ్ కు చెందిన భజరంగీ సహా 67 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నరోదాగామ్ లో ఇళ్లకు నిప్పు పెట్టడం వల్ల 11 మంది చనిపోయారి. ఈ కేసులో 86 మంది నిందితులుగా గుర్తించగా, విచారణ జరుగుతుండగానే 18 మంది చనిపోయారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PPP Medical Colleges: దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
No Cut In MRP: జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
TGSRTC Tour Packages: హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త
Sai Durgha Tej: ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
Advertisement

వీడియోలు

Boycott Asia cup 2025 Ind vs Pak Match | సోషల్ మీడియాలో మళ్లీ బాయ్‌కాట్ ట్రెండ్ | ABP Desam
Asia Cup 2025 | ఒమన్ పై పాకిస్తాన్ బంపర్ విక్టరీ | ABP Desam
Quentin Tarantino - Master of Stylized Violence | హాలీవుడ్ ను రక్తంతో తడిపేసిన డైరెక్టర్ | ABP Desam
Sachin Tendulkar BCCI Next President | బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్‌గా సచిన్ ఎన్నికయ్యే అవకాశం | ABP Desam
Ind vs Pak | పాక్ జట్టులో అనుకోని సమస్య.. భారత్‌తో మ్యాచ్‌కు డౌటే | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PPP Medical Colleges: దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
No Cut In MRP: జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
TGSRTC Tour Packages: హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త
Sai Durgha Tej: ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
Woman Maoist surrender: ఆమె తలపై రూ. కోటి రివార్డ్ - ఏకంగా 106 కేసులు  - ప్రాణభయంతో పోలీసుల ఎదుట సరెండర్ అయిన సుజాతక్క !
ఆమె తలపై రూ. కోటి రివార్డ్ - ఏకంగా 106 కేసులు - ప్రాణభయంతో పోలీసుల ఎదుట సరెండర్ అయిన సుజాతక్క !
Paga Paga Paga Movie OTT: మ్యూజిక్ డైరెక్టర్ కోటి విలన్‌గా మూవీ - మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మ్యూజిక్ డైరెక్టర్ కోటి విలన్‌గా మూవీ - మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Force Motors Prices Reduced: జీఎస్టీ కొత్త స్లాబ్స్‌తో రూ.6 లక్షల వరకు తగ్గిన ఫోర్స్ మోటార్స్ ధరలు, మోడల్ వారీగా డిస్కౌంట్స్
జీఎస్టీ కొత్త స్లాబ్స్‌తో రూ.6 లక్షల వరకు తగ్గిన ఫోర్స్ మోటార్స్ ధరలు, మోడల్ వారీగా డిస్కౌంట్స్
Asia Cup 2025 IND vs PAK: భారత్-పాకిస్తాన్ మధ్య మరో హైవోల్టేజ్ మ్యాచ్‌.. ఇప్పటివరకూ టాప్ 5 స్కోరర్స్ వీరే
భారత్-పాకిస్తాన్ మధ్య మరో హైవోల్టేజ్ మ్యాచ్‌.. ఇప్పటివరకూ టాప్ 5 స్కోరర్స్ వీరే
Embed widget