By: Ram Manohar | Updated at : 10 Sep 2023 04:52 PM (IST)
ఢిల్లీ డిక్లరేషన్ సక్సెస్ కావడానికి మా టీమ్ ఎంతో కష్టపడిందంటూ G20 షెర్పా అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు. (Image Credits: Twitter)
G20 Summit 2023:
G20 షెర్పాగా అమితాబ్ కాంత్
G20 సదస్సు రెండో రోజుకి చేరుకుంది. నేడు (సెప్టెంబర్ 10) పూర్తిస్థాయిలో వాతావరణ మార్పులపై చర్చ జరగనుంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీ డిక్లరేషన్ని G20 సభ్యులందరూ ఆమోదించారు. దీనిపై భారత్ సంతోషం వ్యక్తం చేసింది. రెండో రోజు కూడా ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ధీమాగా చెబుతోంది. అయితే...ఈ సదస్సులో ఎలాంటి అవాంతరాలు రాకుండా...షెడ్యూల్లో ఎలాంటి తేడాలు రాకుండా చూసుకున్నారు G20 Sherpa.సింపుల్గా చెప్పాలంటే...ఈ మొత్తం సమ్మిట్కి వీళ్లే లీడర్లు. భారత్ G20 షెర్పాగా బాధ్యతలు తీసుకున్నారు అమితాబ్ కాంత్. టీమ్తో కలిసి ఈ సదస్సు సక్సెస్ అయ్యేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం దాదాపు 200 గంటల పాటు చర్చలు జరిగాయని వెల్లడించారు అమితాబ్ కాంత్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా చివరకు అది సాధించింది భారత్. ఈ విషయంలో షెర్పా పాత్ర కీలకం. 300 ద్వైపాక్షిక చర్చలు జరిపి 15 డ్రాఫ్ట్లు ఈ సదస్సులో ప్రవేశపెట్టారు. ఆ తరవాత వీటన్నింటికీ G20 నేతలు ఆమోద ముద్ర వేశారు. ఈ ఘనత సాధించడంపై తన టీమ్ని అభినందించారు అమితాబ్ కాంత్. స్పెషల్ ట్వీట్ కూడా చేశారు.
"రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సభ్యులందరూ ఏకాభిప్రాయానికి రావడమే అతిపెద్ద సవాలు. కానీ దీన్ని సాధించగలిగాం. ఇందుకోసం 200 గంటల పాటు చర్చలు జరిగాయి. 300 ద్వైపాక్షిక చర్చలు నిర్వహించాల్సి వచ్చింది. ఇదంతా సాధ్యం కావడానికి నా టీమ్ మెంబర్సే కారణం. నాకు అన్ని విధాలుగా సహకరించారు"
- అమితాబ్ కాంత్, G20 భారత్ షెర్పా
The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37
— Amitabh Kant (@amitabhk87) September 10, 2023
తొలిరోజు G20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ డిక్లరేషన్కి (Delhi Declaration) సభ్యులందరూ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కొంత వరకూ భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ చివరకు అంతా ఏకాభిప్రాయంతో డిక్లరేషన్ని స్వాగతించినట్టు స్పష్టం చేశారు. ఇదంతా సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ప్రధాని తెలిపారు.
"ఇప్పుడే నేనో శుభవార్త విన్నాను. మా టీమ్ కృషి వల్ల న్యూ ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో అందరు నేతలూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ డిక్లరేషన్కి ఆమోదం తెలపాలని నేను ప్రతిపాదించాను. అందరూ అందుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా G20 షెర్పాలు, మంత్రులతో పాటు ఇది సాధ్యమయ్యేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: శాంతి మంత్రంతో G20 సదస్సుని ముగించిన ప్రధాని మోదీ, నవంబర్లో వర్చువల్ మీటింగ్
BSF Seize Drugs: భారత్-బంగ్లా సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం, రూ.12 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Nipah Cases: కేరళలో సున్నా నిఫా కేసులు నమోదు, కోజికోడ్లో ఆంక్షల సడలింపు
Football Coach: బాలికను వేధించిన ఫుట్బాల్ కోచ్ - 2019 నాటి కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
Sudha Murty: రద్దీగా ఉండే విమానాశ్రయంలో ప్రయాణికులతో సుధా మూర్తి మాటామంతీ
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>