![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీ మరోసారి అస్వస్థకు గురయ్యారు.
![Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స Congress Parliamentary Party Chairperson Sonia Gandhi Hospitalised Admitted to Delhi Sir Gangaram Hospital Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/01c9eb1049a75e3e5c2a0b96e83a0c7e1693721156693517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sonia Gandhi Hospitalised:
సోనియా గాంధీకి జ్వరం..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థకు గురయ్యారు. స్వల్ప జ్వరంతో ఆమె బాధపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని,ఆందోళన పడాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పారు.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi has been admitted to Delhi's Sir Gangaram Hospital with symptoms of mild fever. She is under doctors' observation and is currently stable: Sources pic.twitter.com/9uuZz8n4ra
— ANI (@ANI) September 3, 2023
దాదాపు ఏడాది కాలంగా ఆమె అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య పలు సార్లు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో సోనియా బాధ పడ్డారు. వెంటనే ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్పటికి యూపీలో భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్, ప్రియాంక గాంధీ వెంటనే ఢిల్లీకి వచ్చారు. గతేడాది జూన్లోనూ సోనియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ సోకిన తరవాత కూడా చాలా రోజుల పాటు ఆమెను ఏదో ఓ సమస్య వెంటాడింది. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు. గతేడాది అక్టోబర్లో కర్ణాటకలో యాత్ర జరిగినప్పుడు రాహుల్, ప్రియాంక గాంధీతో కలిసి నడిచారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 1998 నుంచి 2017 వరకు సోనియా పనిచేశారు. 2019 నుంచి బుధవారం వరకు ఆమె పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. 1991లో తన భర్త రాజీవ్ గాంధీ మరణించే సమయానికి సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కానీ, పరిస్థితుల ప్రభావం కారణంగా 1997లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ మరుసటి ఏడాదే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
రిటైర్మెంట్పై వ్యాఖ్యలు..కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతోనే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అని వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పురోగతి సాధించిందని, ఆయన పని తీరు తనకు సంతృప్తినిచ్చిందని అన్నారు.
"2004,2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మేం సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే భారత్ జోడో యాత్రతోనే నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు. కాంగ్రెస్కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చు"
-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
అయితే...ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది కాంగ్రెస్. ఆమె వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టతనిచ్చింది. కాంగ్రెస్ ప్రతినిధి అల్కా లంబా దీనిపై స్పందించారు. సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదంటూ వెల్లడించారు. ఆమె ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించి కథనాలు రాయొద్దంటూ మీడియాకు సూచించారు.
"ఈ వార్తలు సోనియా గాంధీ వరకూ వెళ్లాయి. ఇది వినగానే సోనియా గాంధీ గట్టిగా నవ్వారు. నేనెప్పుడూ రాజకీయాల నుంచి తప్పుకోలేదు. తప్పుకోను కూడా అని నాతో చాలా స్పష్టంగా చెప్పారు. మీడియా ఇది గమనించాలి. ఆమె ప్రసంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు"
అల్కా లంబా, కాంగ్రెస్ ప్రతినిధిAlso Read: అప్పుల్లో కర్ణాటక ప్రభుత్వం, అయినా మంత్రులకు కొత్త కార్లు - రూ. 10 కోట్ల ఖర్చు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)