అన్వేషించండి

Maharastra Politics: ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డ మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్, మహా వికాస్ అఘాడీలో లుకలుకలు

Maharastra Crisis: మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీలో లుకలుకలు బయటపడుతున్నాయి. శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం,  కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి.

Maharastra Politics : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ (Maha vikas Aghadi)లో లుకలుకలు బయటపడుతున్నాయి. శివసేన (Shivasena Ubt )ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్‌సీపీ (NCP Sharad Pawar) శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్‌ (Congress ) పార్టీల మధ్య సీట్ల వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి. మూడు పార్టీలు ఎవరెవరు ఎక్కడెక్కడో పోటీ చేయాలన్న దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నాయ్. ఇంతలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అఘాడి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతుండగా... ముంబై నార్త్-వెస్ట్ నియోజకవర్గానికి శివసేన అభ్యర్థిగా అమోల్ కీర్తికర్‌ను ఉద్దవ్ ఠాక్రే  ప్రకటించడంపై సంజయ్‌ నిరుపమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోసారి అదే సీటుపై గురి 
రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు సంజయ్ నిరుపమ్. ఒకసారి శివసేన తరపున, మరోసారి కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ముంబై నార్త్-వెస్ట్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయాలని సంజయ్ నిరుపమ్ భావిస్తున్నారు. ఇంతలోనే ఉద్దవ్ ఠాక్రే తమ పార్టీ నుంచి అమోల్ కీర్తికర్‌ పోటీ చేస్తారని ప్రకటించడం నిరుపమ్ కు ఆగ్రహం తెప్పించింది. కూటమిలో సీట్ల షేరింగ్ పూర్తి కాకపోయినా... అప్పుడే ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు. నార్త్ వెస్ట్ సీటు తమదని ఉద్దవ్ వర్గం చెబుతోందని... అయితే ఈ సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రతిసారి పోటీ చేస్తున్న విషయం మరచిపోవద్దని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో  ముంబై నార్త్-వెస్ట్ పోటీ చేస్తానని, ఐదేళ్లుగా నార్త్‌ వెస్ట్‌ సీటు కోసం సిద్ధమవుతున్నానని స్పష్టం చేశారు. నార్త్ వెస్ట్ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీనే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

కుంభకోణంలో చిక్కుకున్న వ్యక్తికి టికెట్? 
కోవిడ్‌ సమయంలో  బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికుల కోసం ఖిచిడీ పంపిణీ చేసింది. వలస కార్మికుల కోసం చేపట్టిన ఖిచిడీలో స్కామ్ జరిగిందని, ఇందులో అమోల్‌ కీర్తికర్‌ హస్తం ఉందని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. నిరుపేదల కోసం ప్రారంభించిన పథకంలో అమోల్‌ కీర్తికర్‌ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఖిచిడీ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోందన్న నిరుపమ్.... కుంభకోణంలో చిక్కుకున్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అమోల్‌ కీర్తికర్‌ను  నిలబెడితే కాంగ్రెస్, శివసేన కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారని నిలదీశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget