అన్వేషించండి

Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి

Bihar Stampede News: అధిక రద్దీ, సరైన ఏర్పాట్ల లేమి కారణంగా బిహార్ నలందలోని శీతల్ దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు చనిపోగా, పలువురు భక్తులు గాయపడ్డారు.

Bihar Stampede News | బిహార్‌లోని నలందలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. దీపనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఘడాలో ఉన్న శీతల్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొంత మంది భక్తులు గాయపడ్డారు. మృతుల్లో పలువురు మహిళలు పాట్నాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

శీతల్ దేవి ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో పాటు సరైన ఏర్పాట్లు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఎంతమంది భక్తులు మరణించారనే విషయంపై నలంద అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.

ప్రతి మంగళవారం వేల సంఖ్యలో భక్తుల రాక

ప్రతి మంగళవారం మాతా శీతల్ దేవి ఆలయంలో పూజలు చేయడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే, ఈ మంగళవారం భద్రతా ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పూజలు చేయడానికి భక్తులు భారీగా తరలివచ్చారు, అదే సమయంలో తోపులాట జరిగి అది తొక్కిసలాటకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పలు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎస్డీఎం (SDM) కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

శీతల్ దేవి ఆలయంలో తొక్కిసలాటపై సీఎం నితీష్ దిగ్భ్రాంతి

నలంద లోని ప్రముఖ శీతల్ దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 8 మంది భక్తులు చనిపోవడంపై  బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు విపత్తు నిర్వహణ శాఖ నుండి రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CM relief fund) నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున (మొత్తం రూ. 6 లక్షలు చొప్పున) ఎక్స్‌గ్రేషియాను సీఎం నితీష్ ప్రకటించారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం, అరకొర ఏర్పాట్ల కారణంగానే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాన్ని లేదా మృతుల సంఖ్యపై అధికారులు మాత్రం స్పందించలేదు. 

చికిత్స కోసం సదర్ ఆస్పత్రికి తరలింపు:

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భక్తుల సంఖ్య 12 వరకు ఉందని తెలుస్తోంది.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు. ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ఘటన తర్వాత భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు.

నేడు నలంద విశ్వవిద్యాలయంలో కన్వొకేషన్

సమాచారం ప్రకారం, ఈరోజు నలంద విశ్వవిద్యాలయంలో కాన్వోకేషన్ జరగనుంది. రాజ్‌గిర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనాల్సి ఉంది. సీఎం నితీష్ కుమార్ కూడా నలంద విశ్వవిద్యాలయ దీక్షాంత సమారోహంలో పాల్గొంటారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కూడా ఉంటారు. ఇటువంటి కార్యక్రమం ఉన్న కారణంగానే ఆలయ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget