అన్వేషించండి

MGNREGS: బ్యాంకు ఖాతాలోనే ఉపాధి హామీ డబ్బుల జమా, సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

MGNREGS: ఉపాధి హామీ డబ్బులను బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

MGNREGS: ఉపాధి హామీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద నమోదైన వారికి వేతనాలు చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థని ఈ ఏడాది జనవరిలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కార్మికులకు డబ్బు చెల్లించడానికి ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని అమలు చేయడానికి ఆగస్టు 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. అయితే ఈ తేదీని పొడిగించే ప్రసక్తి లేదని, సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేసిన తీరాల్సిందేనని మరోసారి ఆదేశించింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలని అందుకోసం మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత గడువు తేదీని జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. మరోసారి గడుపు పెంచుతూ ఆగస్టు 31ని నిర్ణయించింది. అయితే ఇక మీదట గడువు తేదీ పొడగించబోమని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. యాక్టివ్ వర్కర్ల ఖాతాల్లో 90 శాతానికి పైగా ఇప్పటికే ఆధార్ తో అనుసంధానించినందు వల్ల గడువును ఇకపై పొడిగించబోమని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

జూన్ లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మొత్తం 14.28 కోట్ల యాక్టివ్ లబ్ధిదారుల్లో, 13.75 కోట్లతో ఆధార్ నంబర్ సీడింగ్ చేసినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం 12.17 కోట్ల ఆధార్ నంబర్లు ప్రామాణీకరించబడినట్లు తెలిపింది. 77.81 శాతం మంది ఆ సమయంలో ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థకు అర్హులుగా గుర్తించారు. మే 2023లో, దాదాపు 88 శాతం వేతన చెల్లింపు ఏబీపీఎస్ ద్వారానే జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకుని జాబ్ కార్డులు ఉన్న దాదాపు 1.13 కోట్ల మంది బ్యాంక్ ఖాతాలు లేదా ఈ పథకం కింద ఉన్న యాక్టివ్ కార్మికుల్లో దాదాపు 8 శాతం మంది బ్యాంకు ఖాతాలు ఇంకా ఆధార్ తో సీడింగ్ జరగలేదని.. ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

Also Read: Brics Summit 2023: బ్రిక్స్‌లో 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం, కూటమి బలోపేతం అవుతుందన్న మోదీ

ఆధార్ సీడింగ్ ప్రక్రియలో ఈశాన్య రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని తెలిపారు. అస్సాంలో 42 శాతం కంటే ఎక్కువ, అరుణాచల్ ప్రదేశ్ లో 23 శాతం, మేఘాలయలో 70 శాతానికి పైగా, నాగాలాండ్ లో 37 శాతం మంది కార్మికుల ఖాతాలు ఆధార్ నంబర్లతో సీడింగ్ కాలేదని పేర్కొన్నారు. ప్రత్యక్ష ఖాతా బదిలీతో పాటు ప్రత్యామ్నాయ చెల్లింపు విధానంగా ఏబీపీఎస్ ను 2017 నుంచి ఉపాధి హామీ పథకంలో ఉపయోగిస్తున్నారు. 100 శాతం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లబ్ధిదారులను ఏబీపీఎస్ కిందకు మారేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget