అన్వేషించండి

MGNREGS: బ్యాంకు ఖాతాలోనే ఉపాధి హామీ డబ్బుల జమా, సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

MGNREGS: ఉపాధి హామీ డబ్బులను బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

MGNREGS: ఉపాధి హామీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద నమోదైన వారికి వేతనాలు చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థని ఈ ఏడాది జనవరిలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కార్మికులకు డబ్బు చెల్లించడానికి ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని అమలు చేయడానికి ఆగస్టు 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. అయితే ఈ తేదీని పొడిగించే ప్రసక్తి లేదని, సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేసిన తీరాల్సిందేనని మరోసారి ఆదేశించింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలని అందుకోసం మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత గడువు తేదీని జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. మరోసారి గడుపు పెంచుతూ ఆగస్టు 31ని నిర్ణయించింది. అయితే ఇక మీదట గడువు తేదీ పొడగించబోమని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. యాక్టివ్ వర్కర్ల ఖాతాల్లో 90 శాతానికి పైగా ఇప్పటికే ఆధార్ తో అనుసంధానించినందు వల్ల గడువును ఇకపై పొడిగించబోమని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

జూన్ లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మొత్తం 14.28 కోట్ల యాక్టివ్ లబ్ధిదారుల్లో, 13.75 కోట్లతో ఆధార్ నంబర్ సీడింగ్ చేసినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం 12.17 కోట్ల ఆధార్ నంబర్లు ప్రామాణీకరించబడినట్లు తెలిపింది. 77.81 శాతం మంది ఆ సమయంలో ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థకు అర్హులుగా గుర్తించారు. మే 2023లో, దాదాపు 88 శాతం వేతన చెల్లింపు ఏబీపీఎస్ ద్వారానే జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకుని జాబ్ కార్డులు ఉన్న దాదాపు 1.13 కోట్ల మంది బ్యాంక్ ఖాతాలు లేదా ఈ పథకం కింద ఉన్న యాక్టివ్ కార్మికుల్లో దాదాపు 8 శాతం మంది బ్యాంకు ఖాతాలు ఇంకా ఆధార్ తో సీడింగ్ జరగలేదని.. ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

Also Read: Brics Summit 2023: బ్రిక్స్‌లో 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం, కూటమి బలోపేతం అవుతుందన్న మోదీ

ఆధార్ సీడింగ్ ప్రక్రియలో ఈశాన్య రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని తెలిపారు. అస్సాంలో 42 శాతం కంటే ఎక్కువ, అరుణాచల్ ప్రదేశ్ లో 23 శాతం, మేఘాలయలో 70 శాతానికి పైగా, నాగాలాండ్ లో 37 శాతం మంది కార్మికుల ఖాతాలు ఆధార్ నంబర్లతో సీడింగ్ కాలేదని పేర్కొన్నారు. ప్రత్యక్ష ఖాతా బదిలీతో పాటు ప్రత్యామ్నాయ చెల్లింపు విధానంగా ఏబీపీఎస్ ను 2017 నుంచి ఉపాధి హామీ పథకంలో ఉపయోగిస్తున్నారు. 100 శాతం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లబ్ధిదారులను ఏబీపీఎస్ కిందకు మారేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget